Gowru Charitha Reddy: పసుపుమయమైన పాణ్యం.. నామినేషన్ దాఖలు చేసిన గౌరు చరిత రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాణ్యం నియోజకవర్గం మొత్తం పసుపుయంగా మారింది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరిత రెడ్డి నామినేషన్ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, గౌరు అభిమానులు భారీ ర్యాలీగా వచ్చి కదం తొక్కారు. తమ అభిమాన నేత చరితమ్మకు స్వాగతం పలుకుతూ.. ప్రజలు కూడా ఈ ర్యాలీలో పాల్గొని ఆమెను ఆశీర్వదించారు. పాణ్యంలో ఇవాళ జరిగిన గౌరు చరిత రెడ్డి నామినేషన్ ర్యాలీ టీడీపీ శ్రేణుల్లో కదనోత్సాహం రగిలించింది.
Read Also: Uttarpradesh : భర్తతో గొడవ.. పిల్లలతో సహా నదిలో దూకి తల్లి సామూహిక ఆత్మహత్య
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
ఇక, గత ఐదేళ్లుగా ప్రతిపక్ష నేతగా పాణ్యం నియోజకవర్గం ప్రజల తరపున గౌరు చరిత రెడ్డి పోరాటం చేశారు. బాబు ష్యూరిటీ – భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామగ్రామానా తిరిగిన ఆమె సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో తనను గెలిపిస్తే పాణ్యంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పి, సంక్షేమ అభివృద్ధి నెలకొల్పుతానని చరిత రెడ్డి ప్రజల్లో నమ్మకం కలిగించారు.
Read Also: AP Elections 2024: చంద్రబాబుతో బీజేపీ జాతీయ నేతల భేటీ.. ఏం చేద్దాం..?
కాగా, గౌరు చరిత రెడ్డి నామినేషన్ కార్యక్రమం సందర్భంగా పాణ్యం నియోజకవర్గం నలుమూల నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గౌరు అభిమానులు, ప్రజలు వేలాదిగా తరలిరావడంతో పసుపుమయంగా మారింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు భర్త, నందికొట్కూరు టీడీపీ ఇంచార్జి గౌరు వెంకటరెడ్డి, కుటుంబసభ్యులు, అభిమానులు, తోడుగా పాణ్యంలోని తన స్వగృహం నుంచి కర్నూలు జిల్లా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీగా జరిగిన ఈ నామినేషన్ కార్యక్రమంలో దాదాపు 11 వేల మంది వరకు పాల్గొన్నట్లు తెలుస్తుంది. పాణ్యం ప్రజలు సైతం ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని చరిత రెడ్డిని ఆశీర్వదించారు. మొత్తంగా ఈసారి పాణ్యంలో మార్పు తథ్యమని.. గౌరు చరిత రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించబోతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!