Pakistan: పాకిస్థాన్లోని వైమానిక స్థావరంపై ఫిదాయీన్ దాడి.. నలుగురు ఉగ్రవాదులు హతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పొరుగు దేశం పాకిస్థాన్లోని మియాన్వాలి ఎయిర్బేస్పై ఉగ్రవాదులు అర్థరాత్రి దాడి చేశారు. ఉగ్రవాదులు ఎయిర్బేస్లోకి ప్రవేశించి భారీ కాల్పులు జరిపారు. ఆ తర్వాత నగరం అంతటా భయాందోళనలు వ్యాపించాయి. ఈ దాడికి ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఏ-జిహాద్ పాకిస్థాన్ (టీజేపీ) బాధ్యత వహించింది. ఎయిర్బేస్లో ఉగ్రవాదులు డజన్ల కొద్దీ విమానాలను తగులబెట్టారని, పైలట్తో సహా పలువురిని కాల్చిచంపారని టీజేపీ అధికార ప్రతినిధి ముల్లా మహ్మద్ ఖాసీం పేర్కొన్నారు. ఉగ్రవాదులు పలు విమానాలను ధ్వంసం చేశారు. పాకిస్థాన్ ప్రతీకార కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. ఎయిర్బేస్లో ఉగ్రవాదులు నిరంతరం పేలుళ్లు, కాల్పులు జరుపుతున్నారు. ఆత్మాహుతి బాంబర్లు వైమానిక స్థావరం గోడపై ఫెన్సింగ్ను కత్తిరించి లోపలికి ప్రవేశించి ఎయిర్బేస్లో ఉంచిన యుద్ధ విమానాలను లక్ష్యంగా చేసుకున్నారు.
Read Also:Bhatti Vikramarka: బీఆర్ఎస్ పార్టీని బంగాళాఖాతంలో కలపాలి.. భట్టి సంచలన వ్యాఖ్యలు
Also Read
- New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్ఫోన్ విడుదల..
- Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
- Mojtaba Khamenei: లండన్లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
- Nigeria Qualified: నైజీరియా సంచలనం.. ఐసీసీ ప్రపంచకప్కు క్వాలిఫై..
ఉగ్రవాద దాడిలో 3 యుద్ధ విమానాలు దెబ్బతిన్నాయని పాకిస్థాన్ ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ దాడి వెనుక ఉద్దేశం ఇంకా తెలియరాలేదు. పాకిస్థాన్లోని పలు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఎయిర్బేస్ ప్రాంతానికి సమీపంలో ఉన్న అన్ని పాఠశాలలు, కళాశాలలు మూసివేయబడ్డాయి. ఉగ్రవాదుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. హెలికాప్టర్ ద్వారా కూడా సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. ఎయిర్బేస్పై అర్థరాత్రి దాడి జరిగింది. ముందుజాగ్రత్తగా పాకిస్థాన్లోని అన్ని ఎయిర్బేస్లలో హెచ్చరికలు జారీ చేశారు. దాడికి ఒక రోజు ముందు నవంబర్ 3 న, బలూచిస్తాన్లోని గ్వాదర్లో పాకిస్తాన్ భద్రతా దళాల వాహనాలపై కూడా ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 14 మంది పాకిస్థాన్ సైనికులు మరణించారు. నివేదికల ప్రకారం, పాకిస్తాన్ సైనికుల కాన్వాయ్ గ్వాదర్ జిల్లాలోని పస్ని నుండి ఒర్మారా వైపు వెళుతుండగా ఈ సంఘటన జరిగింది.
Read Also:Afghanistan Semi Final Chances: సెమీస్ రేసు రసవత్తరం.. అఫ్గానిస్థాన్కు ఇంకా ఛాన్స్ ఉందా?
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!