Pakistan: పాకిస్థాన్లోని వైమానిక స్థావరంపై ఫిదాయీన్ దాడి.. నలుగురు ఉగ్రవాదులు హతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పొరుగు దేశం పాకిస్థాన్లోని మియాన్వాలి ఎయిర్బేస్పై ఉగ్రవాదులు అర్థరాత్రి దాడి చేశారు. ఉగ్రవాదులు ఎయిర్బేస్లోకి ప్రవేశించి భారీ కాల్పులు జరిపారు. ఆ తర్వాత నగరం అంతటా భయాందోళనలు వ్యాపించాయి. ఈ దాడికి ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఏ-జిహాద్ పాకిస్థాన్ (టీజేపీ) బాధ్యత వహించింది. ఎయిర్బేస్లో ఉగ్రవాదులు డజన్ల కొద్దీ విమానాలను తగులబెట్టారని, పైలట్తో సహా పలువురిని కాల్చిచంపారని టీజేపీ అధికార ప్రతినిధి ముల్లా మహ్మద్ ఖాసీం పేర్కొన్నారు. ఉగ్రవాదులు పలు విమానాలను ధ్వంసం చేశారు. పాకిస్థాన్ ప్రతీకార కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. ఎయిర్బేస్లో ఉగ్రవాదులు నిరంతరం పేలుళ్లు, కాల్పులు జరుపుతున్నారు. ఆత్మాహుతి బాంబర్లు వైమానిక స్థావరం గోడపై ఫెన్సింగ్ను కత్తిరించి లోపలికి ప్రవేశించి ఎయిర్బేస్లో ఉంచిన యుద్ధ విమానాలను లక్ష్యంగా చేసుకున్నారు.
Read Also:Bhatti Vikramarka: బీఆర్ఎస్ పార్టీని బంగాళాఖాతంలో కలపాలి.. భట్టి సంచలన వ్యాఖ్యలు
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
ఉగ్రవాద దాడిలో 3 యుద్ధ విమానాలు దెబ్బతిన్నాయని పాకిస్థాన్ ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ దాడి వెనుక ఉద్దేశం ఇంకా తెలియరాలేదు. పాకిస్థాన్లోని పలు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఎయిర్బేస్ ప్రాంతానికి సమీపంలో ఉన్న అన్ని పాఠశాలలు, కళాశాలలు మూసివేయబడ్డాయి. ఉగ్రవాదుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. హెలికాప్టర్ ద్వారా కూడా సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. ఎయిర్బేస్పై అర్థరాత్రి దాడి జరిగింది. ముందుజాగ్రత్తగా పాకిస్థాన్లోని అన్ని ఎయిర్బేస్లలో హెచ్చరికలు జారీ చేశారు. దాడికి ఒక రోజు ముందు నవంబర్ 3 న, బలూచిస్తాన్లోని గ్వాదర్లో పాకిస్తాన్ భద్రతా దళాల వాహనాలపై కూడా ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 14 మంది పాకిస్థాన్ సైనికులు మరణించారు. నివేదికల ప్రకారం, పాకిస్తాన్ సైనికుల కాన్వాయ్ గ్వాదర్ జిల్లాలోని పస్ని నుండి ఒర్మారా వైపు వెళుతుండగా ఈ సంఘటన జరిగింది.
Read Also:Afghanistan Semi Final Chances: సెమీస్ రేసు రసవత్తరం.. అఫ్గానిస్థాన్కు ఇంకా ఛాన్స్ ఉందా?
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!