టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఈరోజు భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. కాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. దుబాయ్లో ఈ మ్యాచ్ జరుగనుంది. తన ఆరంభ మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయం పాలైన భారత్.. ఈ మ్యాచ్ గెలవాలని పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్ భారత్కు చావోరేవో. ఇకనుంచి ప్రతి మ్యాచూ కీలకం కాబట్టి పాకిస్థాన్పై నేడు గెలిచి తీరాల్సిందే. లేదంటే టోర్నీ ఆరంభ దశ నుంచే ఇంటిముఖం పట్టాల్సి ఉంటుంది. ఇంత ఒత్తిడి మధ్య హర్మన్ప్రీత్ సేన ఎలాంటి ప్రదర్శన చేస్తుందో..? చూడాలి.
T20 World Cup 2024: టాస్ గెలిచిన పాకిస్తాన్.. భారత్ బౌలింగ్
- భారత్-పాక్ మధ్య మ్యాచ్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్
- మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్.