Pakistan Team: పాకిస్తాన్ జట్టు ప్రకటన.. ఏడుగురు ప్లేయర్స్కు ఇదే మొదటిసారి! కప్ గెలుస్తారా భయ్యా
- సెప్టెంబర్ 30న మహిళల వన్డే ప్రపంచకప్ ప్రారంభం
- 15 మంది సభ్యులతో కూడిన పాకిస్తాన్ జట్టు ప్రకటన
- ఏడుగురు ప్లేయర్స్కు ఇదే మొదటిసారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Women’s World Cup 2025 Squad Announced: 2025 మహిళల వన్డే ప్రపంచకప్ సెప్టెంబర్ 30న ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సోమవారం ప్రకటించింది. పాక్ జట్టుకు సీనియర్ ప్లేయర్ ఫాతిమా సనా కెప్టెన్గా వ్యవహరించనున్నారు. ఐసీసీ టోర్నీల్లో పాకిస్తాన్ జట్టు సారథిగా వ్యవహరించడం సనాకు ఇదే తొలిసారి కావడం విశేషం. సనాకు డిప్యూటీగా మునీబా అలీ ఎంపికయ్యారు. డయానా బేగ్, ఒమైమా సోహైల్ లాంటి సీనియర్ ప్లేయర్లకు చోటు దక్కింది. జట్టులో ఐదుగురు ట్రావెలింగ్ రిజర్వ్లు ఉన్నారు.
మహిళల ప్రపంచకప్ కోసం ఇరవై ఏళ్ల ఐమాన్ ఫాతిమాను పీసీబీ ఎంపిక చేసింది. ఆమె వన్డేలకు ఎంపికవడం ఇదే మొదటిసారి. ఐమాన్తో పాటు మరో ఆరుగురు క్రీడాకారిణులు తొలిసారిగా వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నారు. నటాలియా పర్వైజ్, రమీన్ షమీమ్, సదాఫ్ షమాస్, సాదియా ఇక్బాల్, షావాల్ జుల్ఫికర్, సయ్యదా అరూబ్ షా మొదటిసారి మెగా టోర్నీ ఆడనున్నారు. ప్రపంచకప్ ఆడడం ఏడుగురు ప్లేయర్స్కు ఇదే మొదటిసారి. దాంతో పాక్ జట్టుపై ట్రోలింగ్ మొదలైంది. ఈ జట్టుతో ‘కప్ గెలుస్తారా భయ్యా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
Also Read: Viral Video: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలోకి జీపుతో యువకులు.. చివరికి ఏమైందంటే?
భారత్, శ్రీలంక వేదికలుగా మహిళల వన్డే ప్రపంచకప్ 2025 జరగనుంది. పాకిస్తాన్ తమ అన్ని మ్యాచ్లను కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఆడనుంది. భారత్ తొలి మ్యాచ్లో సెప్టెంబర్ 30న గౌహతిలో శ్రీలంకతో ఆడనుంది. ఆక్టోబర్ 5న కొలంబోలో భారత్-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ప్రపంచకప్కు ముందు దక్షిణాఫ్రికాతో పాకిస్తాన్ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు లాహోర్లో జరుగుతుంది. ప్రపంచకప్లో ఆడాల్సిన పాకిస్తాన్ ప్లేయర్స్ ఈ సిరీస్లో ఆడనున్నారు.
పాకిస్తాన్ జట్టు:
ఫాతిమా సనా (కెప్టెన్), మునీబా అలీ సిద్ధిఖీ (వైస్ కెప్టెన్), అలియా రియాజ్, డయానా బేగ్, ఎమాన్ ఫాతిమా, నష్రా సుంధు, నటాలియా పర్వైజ్, ఒమైమా సొహైల్, రమీన్ షమీ, సదాఫ్ షమాస్, సాదియా ఇక్బాల్, షావాల్ జుల్ఫికర్, సిద్రా అమిన్, అరూబ్ షా.
ట్రావెలింగ్ రిజర్వ్లు: గుల్ ఫిరోజా, నజిహా అల్వీ, తుబా హసన్, ఉమ్-ఎ-హని మరియు వహీదా అక్తర్.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!