Pakistan: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం.. ఆయుధాలు అమ్ముతున్న పాకిస్థాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ డబ్బులు సంపాదించుకునేందుకు ఆయుధాలను అమ్ముతుంది. ఇందులో భాగంగా పాకిస్థాన్ గత ఏడాది రెండు ప్రైవేట్ అమెరికాకు చెందిన కంపెనీలతో ఆయుధ ఒప్పందాలలో $364 మిలియన్లు సంపాదించినట్లు తెలుస్తుంది. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్కు మందుగుండు సామగ్రిని సరఫరా చేయడం ద్వారా పాకిస్తాన్ ఈ డబ్బును సంపాదించిందని పాక్ మీడియాలో వెల్లడిస్తుంది. బీబీసీ ఉర్దూ సోమవారం ప్రసారం చేసింది. అయితే, రొమేనియా పొరుగు దేశమైన ఉక్రెయిన్కు తాము ఎలాంటి మందుగుండు సామాగ్రిని అందించలేదని పాకిస్థాన్ తెలిపింది. యూఎస్ ఫెడరల్ ప్రొక్యూర్మెంట్ డేటా సిస్టమ్ నుంచి కాంట్రాక్ట్ వివరాల ప్రకారం.. 155 ఎంఎం షెల్స్ అమ్మకం కోసం గ్లోబల్ మిలిటరీ, నార్త్రోప్ గ్రుమ్మన్ అనే రెండు యూఎస్ కంపెనీలతో పాకిస్తాన్ ఒప్పందాలు చేసుకుందని బీబీసీ తెలిపింది. ఉక్రెయిన్కు ఆయుధాలు అందించేందుకు 2022 ఆగస్టు 17న పాకిస్థాన్ ఈ ఒప్పందాలపై సంతకం చేసింది.
Read Also: LB Nagar Politics: ప్రచారంపై ప్రత్యేక దృష్టి.. సభలు, రోడ్షోలతో హోరెత్తుతున్న ఎల్బి నగర్..
Also Read
ఇక, ఇస్లామాబాద్లోని విదేశాంగ కార్యాలయం ఉక్రెయిన్కు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని విక్రయించడాన్ని తీవ్రంగా ఖండించింది. విదేశాంగ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. పాకిస్తాన్ రెండు దేశాల మధ్య వివాదంలో తటస్థత విధానాన్ని కొనసాగిస్తోంది.. వారికి ఎలాంటి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అందించలేదు అని పేర్కొంది. ఈ ఆరోపణ ఒప్పందాలు పాకిస్తాన్ డెమోక్రటిక్ మూవ్మెంట్ (PDM) పాలనలో జరిగాయని మీకు తెలిపారు. గత ఏడాది ఏప్రిల్లో అవిశ్వాస తీర్మానం ద్వారా ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని పీఎండీ పార్టీ గద్దె దింపింది. ఉక్రెయిన్పై దాడికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించినప్పుడు, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫిబ్రవరి 24న రష్యా పర్యటనలో ఉన్నారు.
Read Also: Arvind Kejriwal: ఢిల్లీలో అధికారులు వర్సెస్ ప్రభుత్వం.. ముదురుతున్న వివాదం
ఇక, బీబీసీ ఉర్దూ నివేదిక ప్రకారం.. అమెరికా-ఆధారిత కంపెనీ గ్లోబల్ మిలిటరీకి US$232 మిలియన్ల విలువైన కాంట్రాక్టు లభించగా.. US$131 మిలియన్ల విలువైన మరో ఒప్పందం నార్త్రోప్ గ్రుమ్మన్తో సంతకం చేయబడింది. ఈ ఒప్పందాల గడువు గత నెల అంటే అక్టోబర్ 2023తో ముగిసిందని నివేదికలో వెల్లడించింది. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ నుండి ఐదుసార్లు రావల్పిండిలో ల్యాండ్ అయిన బ్రిటిష్ మిలటరీ కార్గో విమానంలో డెలివరీ జరిగిందని నివేదిక ఆరోపించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశ ఆయుధాల ఎగుమతులు 3,000 శాతం పెరిగాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ డేటా కూడా ప్రకటించిందని బీబీసీ ఉర్దూ సాక్ష్యాలను వెల్లడించింది. పాకిస్తాన్ 2021-22లో US $ 13 మిలియన్ల విలువైన ఆయుధాలను ఎగుమతి చేయగా.. తాజా ఎగుమతులు 2022-23లో US $ 415 మిలియన్లకు చేరుకున్నాయి.
తాజావార్తలు
-
Tollywood: టాలీవుడ్ నిర్మాతలకు టీ సర్కార్ కీలక ఆదేశాలు
-
Bangladesh: గంగా జలాలపై బంగ్లాదేశ్ కన్ను.. భారత్పై ఒత్తిడి పెంచే ప్లాన్..
-
Will Smith: బన్నీకి ఎదురుగా విల్ స్మిత్.. ‘రాకా’లో ఈ కాంబో నిజమైతే రచ్చే!
-
Iran-Hormuz: హార్ముజ్పై ఇరాన్ పట్టు కోల్పోతోందా? కారణమిదేనా?
-
Monsoon Tips: వర్షాకాలంలో ఊరగాయలపై బూజు పట్టకుండా.. ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి..!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!