Asaduddin Owaisi: సభలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు..మజ్లిస్ అభ్యర్థిపై కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistani Slogans In MP Asaduddin Owaisi Meeting:ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్న సభలో కలకలం రేగింది. ఆయన సభలో ఓ వ్యక్తి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ పాక్ అనుకూల నినాదాలు చేశాడు. దీంతో పోలీసులు దాయాది దేశానికి అనుకూలంగా నినాదాలు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా సదరు వ్యక్తితో పాటు ఎంఐఎం అభ్యర్థి ఎండీ అబ్దుల్ మొబిన్ రిజ్వి, నిర్వాహకుడు ముజఫర్ హసన్ నురానీతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. డుమరీ ఎమ్మెల్యే జగర్నాథ్ మహ (జేఎంఎం) మృతి చెందారు. ఈ కారణంగా ఖాళీ అయిన ఆ స్థానానికి సెప్టెంబరు 5న ఉప ఎన్నిక జరగనుంది. కాగా ఓట్ల లెక్కింపు సెప్టెంబర్ 8 వ తేదీన జరగనుంది. ఈ స్థానంలో పోటీకి దిగిన మజ్లిస్ అభ్యర్థి అబ్దుల్ మొబిన్ రిజ్వికి మద్దతుగా బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఆ సభలో అసదుద్దీన్ పాల్గొన్నారు.
Also Read: Adani Group: అదానీ గ్రూప్పై మళ్లీ ఆరోపణలు.. పాత స్టోరీకి కొత్త స్కీన్ ప్లే అంటున్న కంపెనీ
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
ఆయన ప్రసంగిస్తున్న సమయంలోనే ఎవరో ఓ వ్యక్తి పాకిస్తాన్ కు అనుకూల నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కొంతమందిపై కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా, మత సామరస్యానికి భంగం కలిగించేలా ప్రవర్తించినందుకు డుమరీ పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే తమ అభ్యర్థిపై పోలీసులు కేసు నమోదు చేయడంపై ఎంఐఎం నేతలు మండిపడుతున్నారు. అది ట్యాంపరింగ్ వీడియో అని ఝార్ఖండ్ ఎంఐఎం అధ్యక్షుడు ఎం.డి.షాకీర్ తెలిపారు. కావాలనే తాము గెలవకూడదనే తమపై ఇలాంటి కుట్రలు చేస్తున్నారన్నారు. ఇక గతంలో కూడా అసదుద్దీన్ సభలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసిన సంగతి తెలిసిందే. ఇక జార్ఖండ్ లో మూక దాడులు ఆగిపోయాయని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ చెప్పినప్పటికీ ఇంకా అవి కొనసాగుతున్నాయని అసదుద్దీన్ సభలో మండిపడ్డారు. అంతేకాకుండా దీనిపై కాంగ్రెస్, ఆర్జేడీ కూడా సైలెంట్ గా చూస్తూ ఉండిపోయాయాని అసహనం వ్యక్తం చేశారు అసదుద్దీన్.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?