Asaduddin Owaisi: సభలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు..మజ్లిస్ అభ్యర్థిపై కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistani Slogans In MP Asaduddin Owaisi Meeting:ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్న సభలో కలకలం రేగింది. ఆయన సభలో ఓ వ్యక్తి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ పాక్ అనుకూల నినాదాలు చేశాడు. దీంతో పోలీసులు దాయాది దేశానికి అనుకూలంగా నినాదాలు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా సదరు వ్యక్తితో పాటు ఎంఐఎం అభ్యర్థి ఎండీ అబ్దుల్ మొబిన్ రిజ్వి, నిర్వాహకుడు ముజఫర్ హసన్ నురానీతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. డుమరీ ఎమ్మెల్యే జగర్నాథ్ మహ (జేఎంఎం) మృతి చెందారు. ఈ కారణంగా ఖాళీ అయిన ఆ స్థానానికి సెప్టెంబరు 5న ఉప ఎన్నిక జరగనుంది. కాగా ఓట్ల లెక్కింపు సెప్టెంబర్ 8 వ తేదీన జరగనుంది. ఈ స్థానంలో పోటీకి దిగిన మజ్లిస్ అభ్యర్థి అబ్దుల్ మొబిన్ రిజ్వికి మద్దతుగా బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఆ సభలో అసదుద్దీన్ పాల్గొన్నారు.
Also Read: Adani Group: అదానీ గ్రూప్పై మళ్లీ ఆరోపణలు.. పాత స్టోరీకి కొత్త స్కీన్ ప్లే అంటున్న కంపెనీ
Also Read
- Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
- Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
- Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
- Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
ఆయన ప్రసంగిస్తున్న సమయంలోనే ఎవరో ఓ వ్యక్తి పాకిస్తాన్ కు అనుకూల నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కొంతమందిపై కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా, మత సామరస్యానికి భంగం కలిగించేలా ప్రవర్తించినందుకు డుమరీ పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే తమ అభ్యర్థిపై పోలీసులు కేసు నమోదు చేయడంపై ఎంఐఎం నేతలు మండిపడుతున్నారు. అది ట్యాంపరింగ్ వీడియో అని ఝార్ఖండ్ ఎంఐఎం అధ్యక్షుడు ఎం.డి.షాకీర్ తెలిపారు. కావాలనే తాము గెలవకూడదనే తమపై ఇలాంటి కుట్రలు చేస్తున్నారన్నారు. ఇక గతంలో కూడా అసదుద్దీన్ సభలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసిన సంగతి తెలిసిందే. ఇక జార్ఖండ్ లో మూక దాడులు ఆగిపోయాయని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ చెప్పినప్పటికీ ఇంకా అవి కొనసాగుతున్నాయని అసదుద్దీన్ సభలో మండిపడ్డారు. అంతేకాకుండా దీనిపై కాంగ్రెస్, ఆర్జేడీ కూడా సైలెంట్ గా చూస్తూ ఉండిపోయాయాని అసహనం వ్యక్తం చేశారు అసదుద్దీన్.
తాజావార్తలు
-
Virat Kohli Chase Master: విరాట్ కోహ్లీ కొడితే అర్సిబీ గెలవాల్సిందే.. షాకింగ్ గణాంకాలు ఇవే!
-
PEDDI POWERPLAY TOUR : ‘పెద్ది’ ప్రమోషనల్ టూర్ ప్లాన్ వచ్చేసింది
-
VD Satheesan: కేరళం సీఎంగా వీడీ సతీశన్.. అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ.. పూర్తి వివరాలు
-
Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
-
Vivo Y60 5G: 6500mAh బ్యాటరీతో వివో Y60 5G విడుదల.. ధర, ఫీచర్స్ తెలుసుకోండి
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!