Pakistan Petrol Price: పాక్ ప్రజలపై పెట్రో బాంబ్.. లీటరుకు రూ.15పెంపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Petrol Price: పాకిస్థాన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ద్రవ్యోల్బణం నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభిస్తుందని అంతా భావించారు. కానీ అక్కడి ప్రజల ఆశలు నిరాశ అయ్యాయి. ఇందుకు కారణం.. మంగళవారం పాకిస్థాన్లోని తాత్కాలిక ప్రభుత్వం పెట్రోలియం కొత్త ధరలను ప్రకటించనుంది. దీంతో బుధవారం అంటే ఆగస్టు 16వ తేదీ నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరగనున్నాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.15 పెరగనుంది. కాగా డీజిల్ ధరలు లీటరుకు రూ.20 పెరగనున్నాయి. గ్లోబల్ మార్కెట్లో పెరిగిన ధరలు పెట్రోలియం ధరలను పెంచడం వెనుక వాదనలు వినిపిస్తున్నాయి. ముడి చమురు ధరలు బ్యారెల్కు 5 డాలర్లు పెరిగి బ్యారెల్కు 91 డాలర్లకు చేరుకున్నాయి. అదే సమయంలో ముడి చమురుపై బ్యారెల్కు 2డాలర్ల చొప్పున ప్రత్యేక ప్రీమియం ఛార్జీ విధించబడుతుంది.
Read Also:Vinayaka Stotram: ఈ స్తోత్ర పారాయణం చేస్తే త్వరలోనే వివాహం జరుగుతుంది
Also Read
గ్లోబల్ మార్కెట్లో పెట్రోలు, డీజిల్ ధరలు బ్యారెల్కు 97 డాలర్ల నుంచి 102 డాలర్లకు 5 డాలర్లు పెరిగాయని చెబుతున్నారు. పాకిస్థాన్లో లీటర్ పెట్రోల్ రూ. 272.95 ఉండగా, డీజిల్ లీటరుకు రూ. 273.40 చొప్పున విక్రయిస్తున్నారు. 15 రోజుల క్రితం పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.19 పెంచారు. వాస్తవానికి రష్యా నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురు సరఫరాను పాకిస్థాన్ నిలిపివేసింది. ముడి చమురును శుద్ధి చేస్తున్నప్పుడు దాని నుండి పెట్రోల్ కంటే ఎక్కువ ఫర్నేస్ ఆయిల్ (చమురు వ్యర్థాలు) బయటకు రావడమే దీనికి కారణం. రష్యా చమురు దిగుమతిని నిలిపివేయాలని పాకిస్తాన్ నిర్ణయించిన వెంటనే, ఇప్పుడు ధరలు పెరగబోతున్నాయన్న విషయం కలకలం రేపింది.
Read Also:Gold: 76ఏళ్లలో రూ.89నుంచి రూ.59వేలకు బంగారం.. ప్రతేడాది 800 టన్నుల వినియోగం
రష్యా నుంచి చమురును ఎంత చౌక ధరలకు కొనుగోలు చేస్తున్నామో ఇప్పటి వరకు పాకిస్థాన్ వెల్లడించలేదు. అరబ్ దేశాల నుంచి వచ్చే చమురు కంటే రష్యా చమురులో ఎక్కువ వ్యర్థాలు వెలువడుతున్నాయి. పాకిస్థాన్లో పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడం వెనుక రష్యా నుంచి చమురు సరఫరా నిలిచిపోవచ్చని భావిస్తున్నారు. పెరిగిన ధరల ప్రభావం మిగతా వాటిపైనా పడనుంది.
తాజావార్తలు
-
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
-
ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ లిస్ట్ కేసులో కీలక పరిణామం
-
FSSAI: ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై బ్యాన్.. ఎగ్, చికెన్, గరం మసాలాల్లో నిబంధనల ఉల్లంఘన..
-
Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!