Pakisthan: ఫ్లోరిడాలో భారీ వర్షం.. పాకిస్తాన్ ఆశలు గల్లంతు..!
- ఫ్లోరిడాలో భారీగా కురుస్తున్న వర్షం
- జూన్ 16న ఐర్లాండ్-పాకిస్తాన్ మ్యాచ్
- మ్యాచ్ ద్దు అయ్యేందుకు చాలా అవకాశం
- ఫ్లోరిడాలో ఎమర్జెన్సీ ప్రకటించిన అధికారులు
- మ్యాచ్ రద్దు అయితే పాకిస్తాన్ సూపర్ -8 ఆశలు గల్లంతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా అమెరికాను ఓడించి సూపర్-8కి చేరింది. అయితే.. అమెరికా ఓటమితో సూపర్-8కి చేరుకోవాలన్న పాకిస్థాన్ ఆశలు సజీవంగానే మిగిలాయి. మరోవైపు.. ఇతర జట్ల ప్రదర్శనపై కూడా ఆధారపడి ఉంది. అయితే.. పాకిస్తాన్ జట్టు తన చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్ ఆడేందుకు ఆటంకం కలిగేలా ఉంది. జూన్ 16న ఐర్లాండ్తో పాకిస్తాన్ తలపడనుంది. ఈ మ్యాచ్ కు వర్ష గండం బీభత్సంగా ఉంది. పాకిస్తాన్-ఐర్లాండ్ మ్యాచ్ జరిగే ఫ్లోరిడాలో భారీ వర్షం కురుస్తుంది. దీంతో.. పాకిస్తాన్ జట్టులో ఆందోళన ప్రారంభమైంది.
వాస్తవానికి, దక్షిణ ఫ్లోరిడాలో మంగళవారం నుంచి ప్రారంభమైన భారీ వర్షం.. శుక్రవారం వరకు కొనసాగే అవకాశం ఉంది. ఫ్లోరిడాలో వరదల కారణంగా ఫోర్ట్ లాడర్డేల్లో ‘ఎమర్జెన్సీ’ ప్రకటించారు. సౌత్ ఫ్లోరిడా విమానాశ్రయాలకు వెళ్లాల్సిన వందలాది విమానాలను స్థానిక అధికారులు నిలిపివేశారు. దీంతో ప్రస్తుతం టీ20 ప్రపంచకప్లో పాల్గొంటున్న శ్రీలంక క్రికెట్ జట్టు నగరంలోనే చిక్కుకుపోయింది. టీ20 ప్రపంచ కప్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వడానికి USAలోని మూడు వేదికలలో ఫోర్ట్ లాడర్డేల్ ఒకటి. ఈ స్టేడియం భారతదేశం, పాకిస్తాన్, అమెరికా పాల్గొనే మూడు ముఖ్యమైన గేమ్లకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇంతకుముందు ఈ స్టేడియంలో జరగాల్సిన శ్రీలంక-నేపాల్ మ్యాచ్ రద్దు అయింది.
Also Read
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
CM Chandrababu Naidu: సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. తొలి ఐదు సంతకాలు వీటిపైనే..
ఫోర్ట్ లాడర్డేల్లోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ ఈ వారం కీలకమైన గేమ్లకు ఆతిథ్యం ఇవ్వనుంది. గ్రూప్ A నుండి తదుపరి రౌండ్లో స్థానం కోసం పాకిస్తాన్- అమెరికా తలపడనున్నాయి. శుక్రవారం ఐర్లాండ్తో అమెరికా ఆడగా, ఆదివారం అదే ప్రత్యర్థులతో పాకిస్థాన్ తలపడనుంది. అమెరికా ఐర్లాండ్ను ఓడించినట్లయితే లేదా మ్యాచ్ వాష్ అవుట్ చేసినట్లయితే.. వారు సూపర్ 8కి అర్హత సాధిస్తారు. ఇప్పటికే సూపర్-8కు చేరిన భారత్.. రెండవ స్థానం కోసం పాకిస్తాన్, అమెరికా చూస్తున్నాయి. అందుకు నికర రన్ రేట్ ముఖ్యం. నెట్ రన్ రేట్ ప్రకారం అమెరికా కంటే పాకిస్థాన్ ముందుంది. పాకిస్థాన్ 0.191, యునైటెడ్ స్టేట్స్ 0.127 ఉంది.
అయితే.. పాకిస్తాన్ తర్వాత మ్యాచ్ లలో ఐర్లాండ్, అమెరికాను ఓడించాలి.. అలా అయితేనే పాకిస్తాన్ జట్టు సూపర్-8 కు చేరుతుంది. మరోవైపు అమెరికా కూడా ఒక పాయింట్ వస్తే అర్హత సాధించే అవకాశం ఉంది. ఐర్లాండ్ వర్సెస్ అమెరికా మ్యాచ్ వర్షం కారణంగా రద్దయినా.. అమెరికా జట్టు సూపర్-8కి చేరుకుంటుంది. అదే సమయంలో.. పాకిస్తాన్-ఐర్లాండ్ మ్యాచ్ రద్దు చేయబడితే, పాకిస్తాన్ జట్టు కేవలం ఒక పాయింట్ మాత్రమే వస్తుంది. దీంతో పాకిస్తాన్ జట్టు సూపర్ -8కు చేరుకోలేదు. అమెరికా సూపర్-8కు వెళ్తుంది.
తాజావార్తలు
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!