Mani Shankar: పాకిస్థాన్ వద్ద అణుబాంబులున్నాయ్..వారిని గౌరవించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు వరుసగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. వారసత్వ పన్ను, భారతీయులపై జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శామ్ పిట్రోడా తర్వాత ఇప్పుడు మరో కాంగ్రెస్ నేత ప్రకటన వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్పై ఆ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘భారతదేశం పాకిస్థాన్ను గౌరవించాలి, వారి వద్ద అణుబాంబులు ఉన్నాయి.’ అని వ్యాఖ్యానించారు. మనం వారిని గౌరవించకపోతే భారత్పై అణుదాడి చేయొచ్చన్నారు. ఓ ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ… పాకిస్థాన్ వద్ద కూడా అణ్వాయుధాలు ఉన్నాయన్న విషయాన్ని భారత్ మర్చిపోకూడదన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి చర్చ చాలా ముఖ్యమన్నారు. భారత్ దురహంకారంతో చిన్నచూపు చూస్తుందని పాకిస్థాన్ భావిస్తే… పాకిస్థాన్లోని ఏ పిచ్చివాడైనా భారత్ పై బాంబులతో దాడి చేసే అవకాశం ఉందంటూ.. వ్యాఖ్యానించారు. అయితే ఈ బాంబును లాహోర్లో వేయాలని కొందరు పిచ్చివాళ్ళు నిర్ణయించుకుంటే ఎలా ఉంటుంది. ఈ రేడియేషన్ అమృత్ సర్ చేరుకోవడానికి ఎనిమిది సెకన్లు కూడా పట్టదన్నారు. మనం వారిని గౌరవిస్తే వారు ప్రశాంతంగా ఉంటారు.. చిన్న చూపు చూస్తే పిచ్చి పనులు చేయొచ్చు అన్నారు.
READ MORE: Madhyapradesh : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బయటపడ్డ నోట్ల కట్టలు.. రంగంలోకి ఐటీ శాఖ
Also Read
- 200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
- Ponnam Prabhakar: "ఆ రోజే అనుమానం వచ్చింది".. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
- Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
పాకిస్థాన్ కూడా సార్వభౌమ దేశమని, దానికి కూడా గౌరవం ఉంటుందన్నారు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. భారత్, పాక్ మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు తాము చాలా కష్టపడ్డామని అయ్యర్ అన్నారు. అయితే గత పదేళ్లుగా చర్చలన్నీ ఆగిపోయాయని తెలిపారు. పాకిస్థాన్తో యుద్ధభయంతో రాజీవ్ గాంధీ శాంతికి మార్గాన్ని కనుగొన్నారన్నారు. కానీ నేటి కాలంలో, పాకిస్థాన్తో శాంతి అవకాశాలు ఉన్నా.. మోడీ యుద్ధానికి మార్గాన్ని కనుగొంటున్నారన్నారు. కాగా.. గతంలో ఓవర్సీస్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి సమర్థించారు. ‘దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లుగా ఉంటారం’టూ కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలను మరిచిపోకముందే.. రంజన్ చౌదరి ఇవే తరహా వ్యాఖ్యలు చేశారు. దేశంలో నీగ్రోలు ఉన్నారంటూ ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Film Chamber Meeting : ‘పెద్ది’ సినిమాకు లైన్ క్లియర్: థియేటర్ల వివాదంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం!
-
Alia Bhatt :కేన్స్లో అలియాను పట్టించుకోలేదా..?
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
Ponnam Prabhakar: “ఆ రోజే అనుమానం వచ్చింది”.. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: కథే ‘పెద్ది’కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!