Mani Shankar: పాకిస్థాన్ వద్ద అణుబాంబులున్నాయ్..వారిని గౌరవించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు వరుసగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. వారసత్వ పన్ను, భారతీయులపై జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శామ్ పిట్రోడా తర్వాత ఇప్పుడు మరో కాంగ్రెస్ నేత ప్రకటన వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్పై ఆ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘భారతదేశం పాకిస్థాన్ను గౌరవించాలి, వారి వద్ద అణుబాంబులు ఉన్నాయి.’ అని వ్యాఖ్యానించారు. మనం వారిని గౌరవించకపోతే భారత్పై అణుదాడి చేయొచ్చన్నారు. ఓ ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ… పాకిస్థాన్ వద్ద కూడా అణ్వాయుధాలు ఉన్నాయన్న విషయాన్ని భారత్ మర్చిపోకూడదన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి చర్చ చాలా ముఖ్యమన్నారు. భారత్ దురహంకారంతో చిన్నచూపు చూస్తుందని పాకిస్థాన్ భావిస్తే… పాకిస్థాన్లోని ఏ పిచ్చివాడైనా భారత్ పై బాంబులతో దాడి చేసే అవకాశం ఉందంటూ.. వ్యాఖ్యానించారు. అయితే ఈ బాంబును లాహోర్లో వేయాలని కొందరు పిచ్చివాళ్ళు నిర్ణయించుకుంటే ఎలా ఉంటుంది. ఈ రేడియేషన్ అమృత్ సర్ చేరుకోవడానికి ఎనిమిది సెకన్లు కూడా పట్టదన్నారు. మనం వారిని గౌరవిస్తే వారు ప్రశాంతంగా ఉంటారు.. చిన్న చూపు చూస్తే పిచ్చి పనులు చేయొచ్చు అన్నారు.
READ MORE: Madhyapradesh : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బయటపడ్డ నోట్ల కట్టలు.. రంగంలోకి ఐటీ శాఖ
Also Read
- Jos Buttler: "నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం".. వైభవ్పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- 540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
పాకిస్థాన్ కూడా సార్వభౌమ దేశమని, దానికి కూడా గౌరవం ఉంటుందన్నారు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. భారత్, పాక్ మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు తాము చాలా కష్టపడ్డామని అయ్యర్ అన్నారు. అయితే గత పదేళ్లుగా చర్చలన్నీ ఆగిపోయాయని తెలిపారు. పాకిస్థాన్తో యుద్ధభయంతో రాజీవ్ గాంధీ శాంతికి మార్గాన్ని కనుగొన్నారన్నారు. కానీ నేటి కాలంలో, పాకిస్థాన్తో శాంతి అవకాశాలు ఉన్నా.. మోడీ యుద్ధానికి మార్గాన్ని కనుగొంటున్నారన్నారు. కాగా.. గతంలో ఓవర్సీస్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి సమర్థించారు. ‘దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లుగా ఉంటారం’టూ కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలను మరిచిపోకముందే.. రంజన్ చౌదరి ఇవే తరహా వ్యాఖ్యలు చేశారు. దేశంలో నీగ్రోలు ఉన్నారంటూ ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Jos Buttler: “నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం”.. వైభవ్పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Smart TV: ఆఫర్.. ఆఫర్.. ఆఫర్.. 43-ఇంచెస్ బ్రాండెడ్ LED స్మార్ట్ టీవీలు సగం ధరకే.. త్వరపడండి
-
Makutam Release Date: దర్శకుడిగా విశాల్కు తొలి పరీక్ష.. ‘మకుటం’ రిలీజ్ డేట్ ఫిక్స్, ట్రైలర్కు కౌంట్డౌన్!
ట్రెండింగ్
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!