Champions Trophy 2025: ఈ దెబ్బతో ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు పాకిస్థాన్ కోల్పోనుందా?
- ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు పాకిస్థాన్ కోల్పోనుందా?
- ట్రోఫీ కోసం సిద్ధం కానీ స్టేడియంల నిర్మాణాలు.
- ఫిబ్రవరి 19 నుండి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Champions Trophy 2025: ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి ఒక పెద్ద సమస్య ఎదురవుతోంది. ప్రపంచ క్రీడ ప్రపంచంలో పాకిస్థాన్ అవమానకరంగా నిలిచే అవకాశం రాబోతుంది. పాకిస్థాన్ త్వరలో ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీని ఆతిథ్యం కొనసాగించడం లేదా తప్పించడం అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుండి ప్రారంభం కానుంది. అయితే, ఇందుకు పాకిస్థాన్ లోని మూడు ప్రధాన క్రికెట్ స్టేడియాలు లాహోర్, రావల్పిండి, కరాచీలో ఏర్పాట్లు ఇంకా పూర్తి కాలేదు. ఈ మూడు స్టేడియాలు ఇప్పటికే అంతర్జాతీయ క్రీడలు నిర్వహించేందుకు సిద్ధం కావాల్సి ఉంది. అయితే, గడాఫీ స్టేడియం వంటి కొన్ని ప్రధాన వేదికలు ఇంకా పూర్తిగా సిద్ధం కాలేదు. ఈ వేదికలపై నిర్మాణాలు ఇంకా కొనసాగుతున్నాయి. గ్రౌండ్ లో ఫ్లడ్ లైట్లు, షెడ్లు, అభిమానుల కోసం కుర్చీలు వంటి అంశాలు సన్నాహాలు చేయాల్సి ఉన్నాయి.
Also Read: Martin Guptill: అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు చెప్పేసిన మరో స్టార్ ప్లేయర్
Also Read
- IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
- రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
- Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ఇంకా 40 రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో, వచ్చే వారం ఐసీసీ అధికారులు పాకిస్థాన్లోని వేదికలను తనిఖీ చేయనున్నారు. అయితే, ఇదివరకే పీసీబీకి సరైన సమయానికి వేదికలు సిద్ధం చేసేందుకు గడువు ఇచ్చారు. అయితే, ఈ గడువును మించితే ఐసీసీ నిర్ణీత చెక్లిస్ట్ ప్రకారం వేదికలు సిద్ధంగా లేకుంటే, ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తం పాకిస్థాన్ నుండి దూరం చేయవచ్చు. అప్పుడు, టోర్నీ మొత్తం యూఏఈలో నిర్వహించబడుతుంది.
Also Read: Aggressive Elephant: ఉత్సవాల ఊరేగింపులో రెచ్చిపోయిన గజరాజు
Gaddafi Stadium (yesterday)
Finishing deadline 25 January #ChampionsTrophy2025 pic.twitter.com/JcI32tZZ3K— Sohail Imran (@sohailimrangeo) January 7, 2025
ఇక, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీతో పెద్ద యుద్ధాన్ని చేసిన సంగతి తెలిసిందే. భారత్తో క్రికెట్ మ్యాచ్లు ఆడేందుకు పీసీబీ దర్యాప్తు చేసినా, బీసీసీఐ అందుకు నిరాకరించింది. ఆ తరువాత, పీసీబీ హైబ్రిడ్ మోడల్ను అంగీకరించి.. టీమిండియా మ్యాచ్ లు దుబాయ్లో ఆడేలా నిర్ణయించుకుంది. ఇప్పుడు, ఛాంపియన్స్ ట్రోఫీ యూఏఈకి మారితే.. పాకిస్థాన్ ప్రతిష్టను మరింతగా బలహీనపర్చే అవకాశం ఉంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ముందు ఉన్న సవాళ్లు, నిర్మాణ పనులలో ఆలస్యం, అంతర్జాతీయ క్రికెట్ సమాజంలో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే పాకిస్థాన్కు ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు కోల్పోవడం అనేది పెద్ద విషయమే అవుతుంది.
తాజావార్తలు
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
-
Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
-
రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
-
Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!