Champions Trophy 2025: ఈ దెబ్బతో ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు పాకిస్థాన్ కోల్పోనుందా?
- ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు పాకిస్థాన్ కోల్పోనుందా?
- ట్రోఫీ కోసం సిద్ధం కానీ స్టేడియంల నిర్మాణాలు.
- ఫిబ్రవరి 19 నుండి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Champions Trophy 2025: ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి ఒక పెద్ద సమస్య ఎదురవుతోంది. ప్రపంచ క్రీడ ప్రపంచంలో పాకిస్థాన్ అవమానకరంగా నిలిచే అవకాశం రాబోతుంది. పాకిస్థాన్ త్వరలో ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీని ఆతిథ్యం కొనసాగించడం లేదా తప్పించడం అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుండి ప్రారంభం కానుంది. అయితే, ఇందుకు పాకిస్థాన్ లోని మూడు ప్రధాన క్రికెట్ స్టేడియాలు లాహోర్, రావల్పిండి, కరాచీలో ఏర్పాట్లు ఇంకా పూర్తి కాలేదు. ఈ మూడు స్టేడియాలు ఇప్పటికే అంతర్జాతీయ క్రీడలు నిర్వహించేందుకు సిద్ధం కావాల్సి ఉంది. అయితే, గడాఫీ స్టేడియం వంటి కొన్ని ప్రధాన వేదికలు ఇంకా పూర్తిగా సిద్ధం కాలేదు. ఈ వేదికలపై నిర్మాణాలు ఇంకా కొనసాగుతున్నాయి. గ్రౌండ్ లో ఫ్లడ్ లైట్లు, షెడ్లు, అభిమానుల కోసం కుర్చీలు వంటి అంశాలు సన్నాహాలు చేయాల్సి ఉన్నాయి.
Also Read: Martin Guptill: అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు చెప్పేసిన మరో స్టార్ ప్లేయర్
Also Read
- Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Tilak Varma: వైస్ కెప్టెన్ అయితే స్థానం పదిలం అనుకుంటున్నావా..? తిలక్ వర్మపై ఘాటు వ్యాఖ్యలు..
ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ఇంకా 40 రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో, వచ్చే వారం ఐసీసీ అధికారులు పాకిస్థాన్లోని వేదికలను తనిఖీ చేయనున్నారు. అయితే, ఇదివరకే పీసీబీకి సరైన సమయానికి వేదికలు సిద్ధం చేసేందుకు గడువు ఇచ్చారు. అయితే, ఈ గడువును మించితే ఐసీసీ నిర్ణీత చెక్లిస్ట్ ప్రకారం వేదికలు సిద్ధంగా లేకుంటే, ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తం పాకిస్థాన్ నుండి దూరం చేయవచ్చు. అప్పుడు, టోర్నీ మొత్తం యూఏఈలో నిర్వహించబడుతుంది.
Also Read: Aggressive Elephant: ఉత్సవాల ఊరేగింపులో రెచ్చిపోయిన గజరాజు
Gaddafi Stadium (yesterday)
Finishing deadline 25 January #ChampionsTrophy2025 pic.twitter.com/JcI32tZZ3K— Sohail Imran (@sohailimrangeo) January 7, 2025
ఇక, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీతో పెద్ద యుద్ధాన్ని చేసిన సంగతి తెలిసిందే. భారత్తో క్రికెట్ మ్యాచ్లు ఆడేందుకు పీసీబీ దర్యాప్తు చేసినా, బీసీసీఐ అందుకు నిరాకరించింది. ఆ తరువాత, పీసీబీ హైబ్రిడ్ మోడల్ను అంగీకరించి.. టీమిండియా మ్యాచ్ లు దుబాయ్లో ఆడేలా నిర్ణయించుకుంది. ఇప్పుడు, ఛాంపియన్స్ ట్రోఫీ యూఏఈకి మారితే.. పాకిస్థాన్ ప్రతిష్టను మరింతగా బలహీనపర్చే అవకాశం ఉంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ముందు ఉన్న సవాళ్లు, నిర్మాణ పనులలో ఆలస్యం, అంతర్జాతీయ క్రికెట్ సమాజంలో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే పాకిస్థాన్కు ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు కోల్పోవడం అనేది పెద్ద విషయమే అవుతుంది.
తాజావార్తలు
-
Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
-
Sharmistha Mukherjee: “రాజకీయం పార్ట్ టైమ్ కాదు”.. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
-
Srinivasa Mangapuram: ఘట్టమనేని ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. జూలై రేస్ నుంచి తప్పుకున్న జయకృష్ణ ‘శ్రీనివాసమంగాపురం’?
-
OG 2: ‘ఓజీ’ యూనివర్స్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్.. సుజీత్ ప్లాన్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
-
PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!