Asia Cup 2023: మీ వల్లే భారీగా నష్టపోయాం.. పరిహారం కావాలంటూ జై షాను డిమాండ్ చేస్తున్న పాకిస్తాన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PCB demands compensation from ACC over Asia Cup Loss: ఆసియా కప్ 2023 విషయంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ), పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మధ్య గొడవ ఇంకా సమసిపోలేదు. శ్రీలంకలో వర్షాల వల్ల ఆసియా కప్ పెద్దగా సక్సెస్ కాక తాము నష్టపోతున్నామని, తమకు ఏసీసీ నష్టపరిహారం చెల్లించాలని పీసీబీ డిమాండ్ చేస్తోందట. తమకు పరిహారం కావాలంటూ పీసీబీ చీఫ్ జకా అష్రాఫ్.. ఏసీసీ అధ్యక్షుడు జై షాకు మెయిల్ రాశారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నిజానికి ఆసియా కప్ 2023 టోర్నీ పాకిస్తాన్లో జరగాల్సింది. అయితే పాక్కు తమ జట్టును పంపడం కుదరదని బీసీసీఐ తేల్చి చెప్పింది. ఎన్నో చర్చల అనంతరం చివరకు హైబ్రీడ్ మోడల్లో పాక్, శ్రీలంక వేదికగా టోర్నీని పీసీబీ నిర్వహిహిస్తోంది. రెండో వేదికగా యూఏఈని ఎంపిక చేయాలని అప్పటి పీసీబీ చీఫ్ నజాం సేథీ కోరినా.. దానికి ఏసీసీ ఒప్పుకోలేదట. బీసీసీఐ ఒత్తిడితోనే శ్రీలంకలో సగం టోర్నీ నిర్వహించాలని ఏసీసీ నిర్ణయం తీసుకుందని సేథీ ఆరోపణలు చేశాడు.
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
ఆసియా కప్ 2023లో భారత్ ఇప్పటివరకు రెండు మ్యాచ్లు ఆడగా.. రెండు మ్యాచ్లకు వర్షం అంతరాయం కలిగింది. పాకిస్తాన్, భారత్ మ్యాచ్లో ఒక్క ఇన్నింగ్స్ మాత్రమే జరగ్గా.. నేపాల్, భారత్ మధ్య మ్యాచ్లో డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఫలితం వచ్చింది. నేపాల్, భారత్ మ్యాచ్కు పెద్దగా జనాలు రాలేదు. టిక్కెట్లు తక్కువగా అమ్ముడుకావడంతో టోర్నీ అంతగా ఆకట్టుకోలేకపోతోంది. మరోవైపు ప్రతికూల వాతావరణం కారణంగా సూపర్-4 మ్యాచులను కొలంబో నుంచి హంబంతోటకు మార్చాలని ఏసీసీ డిసైడ్ అయిందట. చివరకు ఎవరికీ చెప్పకుండా కొలంబోనే మ్యాచులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుందని పీసీబీ చీఫ్ జాకా అష్రాఫ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Also Read: Digene Gel: డైజీన్ సిరఫ్ తాగుతున్నారా తస్మాత్ జాగ్రత్త.. మార్కెట్ నుంచి కోట్ల బాటిళ్ల రీకాల్
ఏసీసీ సొంత నిర్ణయాలతో కలత చెందిన పీసీబీ.. కొలంబోలో టోర్నమెంట్ను కొనసాగించడానికి ఎవరు నిర్ణయం తీసుకున్నారనేది స్పష్టంగా తెలియలేదని, ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉందంటూ ఏసీసీ అధ్యక్షుడు జై షాకు మెయిల్ చేసినట్లు చేస్తోంది. ఆసియా కప్ టోర్నీ ఆసాంతం తమను ఏసీసీ లెక్కచేయలేదని, కీలక విషయాల్లో నిర్ణయాలు తీసుకునేప్పుడు తమకు కనీసం సమాచారం ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేసిందట. వర్షాల కారణంగా తమకు జరిగిన నష్టంకు పరిహారం కావాలంటూ పీసీబీ డిమాండ్ చేస్తోందట.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!