Pakistan – Afghanistan: ఆ రెండు ముస్లిం దేశాల మధ్య ఆగని పోరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan – Afghanistan: పాకిస్థాన్ – ఆఫ్ఘనిస్థాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. శుక్రవారం రాత్రి ఇరు దేశాల సైన్యాలు సరిహద్దు వెంబడి ఒకరి సైన్యంపై మరొకరు కాల్పులు జరిపారు. పలు నివేదికల ప్రకారం.. ఈ కాల్పులలో ఇరువైపుల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ ఈ సంఘటన తర్వాత రెండు నెలలుగా అమలులో ఉన్న కాల్పుల విరమణపై అనేక ప్రశ్నలు లేవనెత్తినట్లు అయ్యాయి. కాల్పుల విరమణను ఉల్లంఘించారని ఇరు వర్గాలు ఒకరినొకరు నిందించుకున్నాయి.
READ ALSO: Sonia Gandhi: నెహ్రూను కించపరచడమే బీజేపీ లక్ష్యం..
Also Read
- Sheikh Hasina: షేక్ హసీనా వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. బంగ్లాదేశ్కు స్పష్టం చేసిన భారత్..
- Modi-Shinde: ప్రధాని మోడీతో ఏక్నాథ్ షిండే భేటీ.. సరికొత్త ఊహాగానాలు
- Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు.. ఈ నెలలోనే నల్లమల సాగర్కు కృష్ణా జలాలు
- Kochi Flight: గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం.. హడలెత్తిపోయిన ప్రయాణికులు
పాకిస్థాన్ – ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులోని చమన్, స్పిన్ బోల్డాక్ ప్రాంతాలలో కాల్పులు జరిగాయి. పాకిస్థాన్ పోలీసు అధికారి మొహమ్మద్ సాదిక్ మాట్లాడుతూ.. ముందుగా కాల్పులు ఆఫ్ఘన్ వైపు నుంచి ప్రారంభమయ్యాయని, దీంతో పాకిస్థాన్ దళాలు ప్రతీకారం తీర్చుకున్నాయని పేర్కొన్నారు. ఇదే సమయంలో కాబూల్లోని తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ మొదటి దాడిని ప్రారంభించిందని, అలాగే ఆఫ్ఘన్ దళాలు కాల్పులకు ప్రతీకారం తీర్చుకోవాలని బలవంతం చేసిందని ఆరోపించారు. ఆఫ్ఘన్ సరిహద్దు పోలీసు ప్రతినిధి అబ్దుల్లా ఫరూఖీ మాట్లాడుతూ.. పాకిస్థాన్ దళాలు మొదట హ్యాండ్ గ్రెనేడ్ విసిరాయని, దీనితో ఆఫ్ఘన్ దళాలు ప్రతి చర్య తీసుకోవలసి వచ్చిందని అన్నారు. ఆఫ్ఘనిస్థాన్ కాల్పుల విరమణకు కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.
వాస్తవానికి అక్టోబర్లో రెండు దేశాల మధ్య జరిగిన భీకర ఘర్షణల్లో డజన్ల కొద్దీ సైనికులు, పౌరులు మరణించారు. అదే సమయంలో వందలాది మంది గాయపడ్డారు. ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇరుదేశాల మధ్య అక్టోబర్లో కాల్పుల విరమణ అమలులోకి వచ్చింది. ఇది ఇరు దేశాల మధ్య పరిస్థితిని కొంతవరకు శాంతపరిచింది. అయితే ఇస్తాంబుల్లో శాంతి చర్చలు ఒక నిర్దిష్ట ఒప్పందానికి రాలేకపోయాయి, ఇది నిరంతర సరిహద్దు ఉద్రిక్తతలకు దారి తీస్తుందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.
READ ALSO: Team India: వరుసగా 20 ఓటముల తర్వాత టీమిండియాకు విజయం.. ఎందులోనే తెలుసా!
తాజావార్తలు
-
Sheikh Hasina: షేక్ హసీనా వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. బంగ్లాదేశ్కు స్పష్టం చేసిన భారత్..
-
Vishwanath and Sons Trailer: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ టాక్.. సూర్య-మమితా కెమిస్ట్రీ అదుర్స్.!
-
Modi-Shinde: ప్రధాని మోడీతో ఏక్నాథ్ షిండే భేటీ.. సరికొత్త ఊహాగానాలు
-
Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు.. ఈ నెలలోనే నల్లమల సాగర్కు కృష్ణా జలాలు
-
Ritika Nayak : ‘కొరియన్ కనకరాజు’తో జాక్పాట్.. టాలీవుడ్కు కొత్త గోల్డెన్ లెగ్గా రితికా నాయక్.!
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!