Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రవాదులకు ఆశ్రయం.. ఇద్దరిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేసింది. అతికిరాతకంగా పర్యాటకులను ఉగ్రవాదులు చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. తాజాగా ఎన్ఐఏ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూశాయి. పహల్గాం ఉగ్రవాద దాడిలో కేవలం ముగ్గురు ఉగ్రవాదులు మాత్రమే పాల్గొన్నారని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఇక్కడ మరో సంచలన విషయం ఏమిటంటే ఆ ముగ్గురికి ఆశ్రయం ఇచ్చిన స్థానికులకు వారు రూ.3 వేలు మాత్రమే ఇచ్చారు. వారికి సాయం చేసిన ఇద్దరు స్థానికులను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు.
READ ALSO: Pawan kalyan: ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ భేటీ.. మూడు తీర్మానాలకు ఆమోదం!
Also Read
- TVK: కర్ణాటకలో కుదిరినప్పుడు.. తమిళనాడులో ఎందుకు కుదరదు.. గవర్నర్పై ఆగ్రహంతో టీవీకే కార్యకర్తలు..
- Age Relaxation: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు పదేళ్లు వయోపరిమితి పెంపు..?
- Abhishek Sharma: రికార్డుల వేటలో అభిషేక్ శర్మ.. ఆ క్లబ్లోకి కూడా చేరిన అభిషేక్.
- Heinrich Klaasen: ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న కాటేరమ్మ పెద్ద కొడుకు.. టాప్ 5లో ముగ్గురు హైదరాబాద్ ఆటగాళ్లే..
ఇలా బయటపడ్డారు..
జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) షాకింగ్ రహస్యాలను వెల్లడించింది. ఈ కుట్ర రహస్యాన్ని డిజిటల్ ఆధారాలు బయటపెట్టాయి. ఈసందర్భంగా పలువురు ఎన్ఐఏ అధికారులు మాట్లాడుతూ.. ఈ దాడిలో ముగ్గురు ఉగ్రవాదులు మాత్రమే ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఈ ఉగ్రవాదులకు స్థానిక స్థాయిలో కూడా సహాయం లభించింది. దీని కోసం వారు కేవలం రూ.3000 మాత్రమే ఖర్చు చేశారు. భద్రతా దళాల ప్రతిస్పందనలో జాప్యాన్ని సద్వినియోగం చేసుకోవడం, ప్రజల్లో భయాన్ని వ్యాప్తి చేయడమే ఈ దాడి లక్ష్యమని అన్నారు. NIA అధికారులు ఉగ్రవాదుల నుంచి అనేక డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీనితో పాటు దాడి చేసిన స్థలం నుంచి లభించిన ఆధారాలు ఉగ్రవాదుల దగ్గర ఉన్న పరికరాలతో సరిపోలుతున్నాయి. ఈ సాంకేతిక ఆధారాలు దాడి చాలా బాగా ప్రణాళికాబద్ధంగా జరిగిందని రుజువు చేస్తున్నాయని చెప్పారు. ఉగ్రవాదులు పహల్గాంను లక్ష్యంగా చేసుకోడానికి వెనుక కారణం.. ఈ ప్రాంతం నగరానికి దూరంగా ఉండటం, పర్యాటకులతో నిండి ఉండటం అని అన్నారు.
ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన ఇద్దరు స్థానికులకు ఈ పని కోసం కేవలం రూ. 3000 మాత్రమే లభించిందని దర్యాప్తులో వెల్లడైంది. నిందితులిద్దరినీ NIA అరెస్టు చేసి ప్రశ్నిస్తోంది. స్థానికుల సహాయం లేకుండా ఉగ్రవాదులు ఇంత పెద్ద దాడి చేసి ఉండేవారు కాదని ఎన్ఐఏ అధికారులు అంటున్నారు. ఉగ్రవాది హషీం మూసా పాత్రపై కూడా ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. హషీం ప్రస్తుతం లోయలో చురుకైన ఉగ్రవాద ముఠాకు నాయకుడు. ఈ దాడి కుట్ర, ప్రణాళికలో అతను ముఖ్యమైన పాత్ర పోషించి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం, హషీం ముసా పాత్ర, డిజిటల్ ఆధారాల ఆధారంగా మొత్తం కుట్రను బట్టబయలు చేయడంలో NIA బిజీగా ఉంది. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని దర్యాప్తు సంస్థ చెబుతోంది.
READ ALSO: Kim Jong Un’s Bulletproof Train: ఇది కదిలే కమాండ్ సెంటర్.. ఉత్తర కొరియా నియంత స్పెషల్ ట్రైన్
తాజావార్తలు
-
SRH Playoffs Chances: టాప్ లేపిన సన్రైజర్స్ హైదరాబాద్.. ఇంకా ఒకే ఒక్క విజయం!
-
NBK 111 : రొమాంటిక్ సింహం.. బాలయ్యతో బాలీవుడ్ హీరోయిన్ ఐటం సాంగ్
-
TVK: కర్ణాటకలో కుదిరినప్పుడు.. తమిళనాడులో ఎందుకు కుదరదు.. గవర్నర్పై ఆగ్రహంతో టీవీకే కార్యకర్తలు..
-
Vaibhav Suryavanshi: అది బుడ్డోడి రేంజ్.. వైభవ్ సూర్యవంశీ కోసం వేలం వ్యూహాన్ని మార్చుకున్న రాజస్థాన్..!
-
Age Relaxation: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు పదేళ్లు వయోపరిమితి పెంపు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!