Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రవాదులకు ఆశ్రయం.. ఇద్దరిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేసింది. అతికిరాతకంగా పర్యాటకులను ఉగ్రవాదులు చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. తాజాగా ఎన్ఐఏ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూశాయి. పహల్గాం ఉగ్రవాద దాడిలో కేవలం ముగ్గురు ఉగ్రవాదులు మాత్రమే పాల్గొన్నారని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఇక్కడ మరో సంచలన విషయం ఏమిటంటే ఆ ముగ్గురికి ఆశ్రయం ఇచ్చిన స్థానికులకు వారు రూ.3 వేలు మాత్రమే ఇచ్చారు. వారికి సాయం చేసిన ఇద్దరు స్థానికులను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు.
READ ALSO: Pawan kalyan: ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ భేటీ.. మూడు తీర్మానాలకు ఆమోదం!
Also Read
- Vaibhav Sooryavanshi: సూపర్ ఓవర్ వివాదం తర్వాత వైభవ్కు మరో అవకాశం.. మళ్లీ బేబీ బాస్పైనే అందరి కళ్లు..!
- Air India: తక్కువ ధరకే విమాన ప్రయాణం.. కొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన ఎయిర్ ఇండియా.. ఓ లుక్కేయండి..
- Sonam Raghuvanshi: ఆ వార్తలు అబద్ధం.. హనీమూన్ నిందితురాలు సోనమ్ సంచలన ఇంటర్వ్యూ
- Vaibhav Sooryavanshi: వైభవ్తో గొడవకు దిగిన ఆటగాడి తిక్క కుదిర్చిన శ్రీలంక బోర్డు.. సూర్యవంశీతో పెట్టుకుంటే అంతే మరి..
ఇలా బయటపడ్డారు..
జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) షాకింగ్ రహస్యాలను వెల్లడించింది. ఈ కుట్ర రహస్యాన్ని డిజిటల్ ఆధారాలు బయటపెట్టాయి. ఈసందర్భంగా పలువురు ఎన్ఐఏ అధికారులు మాట్లాడుతూ.. ఈ దాడిలో ముగ్గురు ఉగ్రవాదులు మాత్రమే ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఈ ఉగ్రవాదులకు స్థానిక స్థాయిలో కూడా సహాయం లభించింది. దీని కోసం వారు కేవలం రూ.3000 మాత్రమే ఖర్చు చేశారు. భద్రతా దళాల ప్రతిస్పందనలో జాప్యాన్ని సద్వినియోగం చేసుకోవడం, ప్రజల్లో భయాన్ని వ్యాప్తి చేయడమే ఈ దాడి లక్ష్యమని అన్నారు. NIA అధికారులు ఉగ్రవాదుల నుంచి అనేక డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీనితో పాటు దాడి చేసిన స్థలం నుంచి లభించిన ఆధారాలు ఉగ్రవాదుల దగ్గర ఉన్న పరికరాలతో సరిపోలుతున్నాయి. ఈ సాంకేతిక ఆధారాలు దాడి చాలా బాగా ప్రణాళికాబద్ధంగా జరిగిందని రుజువు చేస్తున్నాయని చెప్పారు. ఉగ్రవాదులు పహల్గాంను లక్ష్యంగా చేసుకోడానికి వెనుక కారణం.. ఈ ప్రాంతం నగరానికి దూరంగా ఉండటం, పర్యాటకులతో నిండి ఉండటం అని అన్నారు.
ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన ఇద్దరు స్థానికులకు ఈ పని కోసం కేవలం రూ. 3000 మాత్రమే లభించిందని దర్యాప్తులో వెల్లడైంది. నిందితులిద్దరినీ NIA అరెస్టు చేసి ప్రశ్నిస్తోంది. స్థానికుల సహాయం లేకుండా ఉగ్రవాదులు ఇంత పెద్ద దాడి చేసి ఉండేవారు కాదని ఎన్ఐఏ అధికారులు అంటున్నారు. ఉగ్రవాది హషీం మూసా పాత్రపై కూడా ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. హషీం ప్రస్తుతం లోయలో చురుకైన ఉగ్రవాద ముఠాకు నాయకుడు. ఈ దాడి కుట్ర, ప్రణాళికలో అతను ముఖ్యమైన పాత్ర పోషించి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం, హషీం ముసా పాత్ర, డిజిటల్ ఆధారాల ఆధారంగా మొత్తం కుట్రను బట్టబయలు చేయడంలో NIA బిజీగా ఉంది. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని దర్యాప్తు సంస్థ చెబుతోంది.
READ ALSO: Kim Jong Un’s Bulletproof Train: ఇది కదిలే కమాండ్ సెంటర్.. ఉత్తర కొరియా నియంత స్పెషల్ ట్రైన్
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: సూపర్ ఓవర్ వివాదం తర్వాత వైభవ్కు మరో అవకాశం.. మళ్లీ బేబీ బాస్పైనే అందరి కళ్లు..!
-
Air India: తక్కువ ధరకే విమాన ప్రయాణం.. కొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన ఎయిర్ ఇండియా.. ఓ లుక్కేయండి..
-
Sonam Raghuvanshi: ఆ వార్తలు అబద్ధం.. హనీమూన్ నిందితురాలు సోనమ్ సంచలన ఇంటర్వ్యూ
-
Vaibhav Sooryavanshi: వైభవ్తో గొడవకు దిగిన ఆటగాడి తిక్క కుదిర్చిన శ్రీలంక బోర్డు.. సూర్యవంశీతో పెట్టుకుంటే అంతే మరి..
-
Jaypee Associates: సున్నాకి పడిపోయిన ఆ కంపెనీ షేర్ వాల్యూ.. రోడ్డున పడిన 6 లక్షల మంది ఇన్వెస్టర్లు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?