Pahalgam Attack: పహల్గామ్ గాయానికి ఏడాది.. ఇప్పుడు ‘మినీ స్విట్జర్లాండ్’ పరిస్థితి ఎలా ఉందంటే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pahalgam Attack: ప్రకృతి ఒడిలో పరవశించే పర్యాటకులకు పహల్గామ్లోని బైసారన్ లోయ భూలోక స్వర్గంలాంటింది. పచ్చని పచ్చిక బయళ్లు, ఆకాశాన్ని తాకే పైన్ చెట్లతో ‘మినీ స్విట్జర్లాండ్’గా పిలవబడే ఈ లోయ నేడు నిర్మానుష్యంగా మారింది. ఒకప్పుడు పర్యాటకుల కేరింతలతో కళకళలాడిన ఈ ప్రాంతంలో ఇప్పుడు కేవలం గాలి శబ్దం, పారామిలిటరీ బలగాల పహారా మాత్రమే కనిపిస్తోంది. పహల్గామ్ గాయానికి సరిగ్గా ఏడాది అవుతున్న క్రమంలో ఇప్పుడు ‘మినీ స్విట్జర్లాండ్’ పరిస్థితి ఎలా ఉందనే దానిపై ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Gayapadda Simham Exclusive: హ్యాపెనింగ్ హీరో ఎక్స్టెండెడ్ క్యామియో.. మరో సర్ప్రైజ్ కూడా!
Also Read
- Rahul Gandhi: అమిత్ షాను వెంటనే తొలగించండి.. ప్రధానికి రాహుల్ సలహా..
- AP Job Calendar 2026: ఏపీ జాబ్ క్యాలెండర్.. ఈసారి 10,660 ఉద్యోగాలు భర్తీ.. మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు..
- Telangana Police Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదల..
- Sonu Sood: విద్యార్థుల నిరసనపై కంగనా వ్యాఖ్యలు సిగ్గుచేటు.. సోనూ సూద్ ఘాటు స్పందన
ఆ రక్తసిక్తమైన రోజు.. మారని గాయం
సరిగ్గా ఏడాది క్రితం 2025 ఏప్రిల్ 22న బైసారన్ లోయపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ మర్చిపోలేని సంఘటనలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజు చిందిన రక్తం ఈ అందమైన లోయను నిశ్శబ్దంలోకి నెట్టివేసింది. భద్రతా కారణాల దృష్ట్యా అప్పటి నుంచి ఈ లోయలో సందర్శకులకు అనుమతి లేదు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం దాడి తర్వాత మూసివేసిన 48 పర్యాటక ప్రాంతాల్లో చాలా వరకు తెరుచుకున్నప్పటికీ, బైసారన్ మాత్రం ఇప్పటికీ సాయుధ బలగాల నిఘా నీడలోనే ఉంది. గత ఏడాది దాడి నుంచి ప్రాణాలతో బయటపడిన ప్రత్యక్ష సాక్షులు ఇప్పటికీ ఆ చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుని వణికిపోతున్నారు. పహల్గామ్ నుంచి బైసారన్కు వెళ్లే మార్గం అత్యంత కఠినంగా ఉండటం, వాహనాలు వెళ్లడానికి అనుకూలమైన రోడ్డు లేకపోవడమే ప్రాణనష్టం పెరగడానికి ప్రధాన కారణమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సహాయక బృందాలు సకాలంలో చేరుకోలేకపోవడంతో, చెలరేగిన తీవ్ర రక్తస్రావం వల్ల తమ వారు కళ్ల ముందే ప్రాణాలు వదిలారని బాధితులు కన్నీళ్లతో గుర్తు చేసుకున్నారు.
మార్పు దిశగా అడుగులు..
బైసారన్ లోయకు పర్యాటక శోభను తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో స్థానిక గుర్రపు స్వారీ చేసేవారి ఉపాధి దెబ్బతింటుందనే కారణంతో రోడ్డు నిర్మాణాన్ని పక్కన పెట్టారు. కానీ భద్రతా దృష్ట్యా ఇప్పుడు పక్కా రహదారిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ప్రాజెక్టు కోసం రూ. 6.3 కోట్లు (రూ.63 మిలియన్లు) ఖర్చు చేయనున్నారు. ఈ ఏడాది మే నెలలో ఈ రహదారి పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. బైసారన్ లోయలో నిశ్శబ్దాన్ని ఛేదించి, మళ్లీ పర్యాటకులను ఆహ్వానించేలా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. రోడ్డు నిర్మాణం పూర్తయితే అత్యవసర సమయంలో భద్రతా బలగాలు, అంబులెన్స్లు త్వరగా చేరుకోవడానికి వీలవుతుంది. ప్రకృతి అందాల మధ్య భయం నీడలు తొలగిపోయి, మళ్లీ పర్యాటక సందడి మొదలవ్వాలని కశ్మీర్ లోయ ఆశిస్తోంది.
READ ALSO: Tim Cook: ఆపిల్ సీఈఓగా టిమ్ కుక్ రిటైర్మెంట్! ఆయన ఎన్ని వేల కోట్లకు అధిపతో తెలుసా?
తాజావార్తలు
-
Rahul Gandhi: అమిత్ షాను వెంటనే తొలగించండి.. ప్రధానికి రాహుల్ సలహా..
-
AP Job Calendar 2026: ఏపీ జాబ్ క్యాలెండర్.. ఈసారి 10,660 ఉద్యోగాలు భర్తీ.. మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు..
-
Telangana Police Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదల..
-
Bhagyashri Borse: ‘ఆ విషయం చెబితే మా అమ్మ నన్ను వాట్సాప్లో బ్లాక్ చేసింది.. 6 నెలలు మాట్లాడలేదు’..
-
Sonu Sood: విద్యార్థుల నిరసనపై కంగనా వ్యాఖ్యలు సిగ్గుచేటు.. సోనూ సూద్ ఘాటు స్పందన
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!