Pahalgam Attack: పహల్గామ్ గాయానికి ఏడాది.. ఇప్పుడు ‘మినీ స్విట్జర్లాండ్’ పరిస్థితి ఎలా ఉందంటే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pahalgam Attack: ప్రకృతి ఒడిలో పరవశించే పర్యాటకులకు పహల్గామ్లోని బైసారన్ లోయ భూలోక స్వర్గంలాంటింది. పచ్చని పచ్చిక బయళ్లు, ఆకాశాన్ని తాకే పైన్ చెట్లతో ‘మినీ స్విట్జర్లాండ్’గా పిలవబడే ఈ లోయ నేడు నిర్మానుష్యంగా మారింది. ఒకప్పుడు పర్యాటకుల కేరింతలతో కళకళలాడిన ఈ ప్రాంతంలో ఇప్పుడు కేవలం గాలి శబ్దం, పారామిలిటరీ బలగాల పహారా మాత్రమే కనిపిస్తోంది. పహల్గామ్ గాయానికి సరిగ్గా ఏడాది అవుతున్న క్రమంలో ఇప్పుడు ‘మినీ స్విట్జర్లాండ్’ పరిస్థితి ఎలా ఉందనే దానిపై ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Gayapadda Simham Exclusive: హ్యాపెనింగ్ హీరో ఎక్స్టెండెడ్ క్యామియో.. మరో సర్ప్రైజ్ కూడా!
Also Read
- Virat Kohli: మళ్లీ టెస్టుల్లోకి విరాట్ కోహ్లీ..? జూలై 14 నుంచి మైదానంలోకి కింగ్..
- Sahan: మా బౌలర్లు బెంబేలెత్తిపోయారు.. అది బ్యాటింగ్ అంటారా..? విధ్వంసం: శ్రీలంక కెప్టెన్ సహన్
- Tilak Varma: ఫైనల్లో మేము చేసిన సీక్రెట్ ప్రణాళిక ఇదే.. అందుకే కప్ కొట్టేశాం: తిలక్ వర్మ
- JD Vance: భారతీయ భార్య, పాకిస్తానీ ఆర్మీ చీఫ్.. ఇదేం పోలిక ఉపాధ్యక్షా..
ఆ రక్తసిక్తమైన రోజు.. మారని గాయం
సరిగ్గా ఏడాది క్రితం 2025 ఏప్రిల్ 22న బైసారన్ లోయపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ మర్చిపోలేని సంఘటనలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజు చిందిన రక్తం ఈ అందమైన లోయను నిశ్శబ్దంలోకి నెట్టివేసింది. భద్రతా కారణాల దృష్ట్యా అప్పటి నుంచి ఈ లోయలో సందర్శకులకు అనుమతి లేదు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం దాడి తర్వాత మూసివేసిన 48 పర్యాటక ప్రాంతాల్లో చాలా వరకు తెరుచుకున్నప్పటికీ, బైసారన్ మాత్రం ఇప్పటికీ సాయుధ బలగాల నిఘా నీడలోనే ఉంది. గత ఏడాది దాడి నుంచి ప్రాణాలతో బయటపడిన ప్రత్యక్ష సాక్షులు ఇప్పటికీ ఆ చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుని వణికిపోతున్నారు. పహల్గామ్ నుంచి బైసారన్కు వెళ్లే మార్గం అత్యంత కఠినంగా ఉండటం, వాహనాలు వెళ్లడానికి అనుకూలమైన రోడ్డు లేకపోవడమే ప్రాణనష్టం పెరగడానికి ప్రధాన కారణమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సహాయక బృందాలు సకాలంలో చేరుకోలేకపోవడంతో, చెలరేగిన తీవ్ర రక్తస్రావం వల్ల తమ వారు కళ్ల ముందే ప్రాణాలు వదిలారని బాధితులు కన్నీళ్లతో గుర్తు చేసుకున్నారు.
మార్పు దిశగా అడుగులు..
బైసారన్ లోయకు పర్యాటక శోభను తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో స్థానిక గుర్రపు స్వారీ చేసేవారి ఉపాధి దెబ్బతింటుందనే కారణంతో రోడ్డు నిర్మాణాన్ని పక్కన పెట్టారు. కానీ భద్రతా దృష్ట్యా ఇప్పుడు పక్కా రహదారిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ప్రాజెక్టు కోసం రూ. 6.3 కోట్లు (రూ.63 మిలియన్లు) ఖర్చు చేయనున్నారు. ఈ ఏడాది మే నెలలో ఈ రహదారి పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. బైసారన్ లోయలో నిశ్శబ్దాన్ని ఛేదించి, మళ్లీ పర్యాటకులను ఆహ్వానించేలా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. రోడ్డు నిర్మాణం పూర్తయితే అత్యవసర సమయంలో భద్రతా బలగాలు, అంబులెన్స్లు త్వరగా చేరుకోవడానికి వీలవుతుంది. ప్రకృతి అందాల మధ్య భయం నీడలు తొలగిపోయి, మళ్లీ పర్యాటక సందడి మొదలవ్వాలని కశ్మీర్ లోయ ఆశిస్తోంది.
READ ALSO: Tim Cook: ఆపిల్ సీఈఓగా టిమ్ కుక్ రిటైర్మెంట్! ఆయన ఎన్ని వేల కోట్లకు అధిపతో తెలుసా?
తాజావార్తలు
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Virat Kohli: మళ్లీ టెస్టుల్లోకి విరాట్ కోహ్లీ..? జూలై 14 నుంచి మైదానంలోకి కింగ్..
-
Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
-
Sahan: మా బౌలర్లు బెంబేలెత్తిపోయారు.. అది బ్యాటింగ్ అంటారా..? విధ్వంసం: శ్రీలంక కెప్టెన్ సహన్
-
Cucumber Idli: బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్.. కేవలం నిమిషాల్లో దోసకాయ ఇడ్లీ ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!