Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Pahalgam Baisaran Valley Attack Anniversary Mini Switzerland Status

Pahalgam Attack: పహల్గామ్ గాయానికి ఏడాది.. ఇప్పుడు ‘మినీ స్విట్జర్లాండ్’ పరిస్థితి ఎలా ఉందంటే!

Published Date :April 21, 2026 , 3:29 pm
By Shiva Ganesh
Pahalgam Attack: పహల్గామ్ గాయానికి ఏడాది.. ఇప్పుడు ‘మినీ స్విట్జర్లాండ్’ పరిస్థితి ఎలా ఉందంటే!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Pahalgam Attack: ప్రకృతి ఒడిలో పరవశించే పర్యాటకులకు పహల్గామ్‌లోని బైసారన్ లోయ భూలోక స్వర్గంలాంటింది. పచ్చని పచ్చిక బయళ్లు, ఆకాశాన్ని తాకే పైన్ చెట్లతో ‘మినీ స్విట్జర్లాండ్’గా పిలవబడే ఈ లోయ నేడు నిర్మానుష్యంగా మారింది. ఒకప్పుడు పర్యాటకుల కేరింతలతో కళకళలాడిన ఈ ప్రాంతంలో ఇప్పుడు కేవలం గాలి శబ్దం, పారామిలిటరీ బలగాల పహారా మాత్రమే కనిపిస్తోంది. పహల్గామ్ గాయానికి సరిగ్గా ఏడాది అవుతున్న క్రమంలో ఇప్పుడు ‘మినీ స్విట్జర్లాండ్’ పరిస్థితి ఎలా ఉందనే దానిపై ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Gayapadda Simham Exclusive: హ్యాపెనింగ్ హీరో ఎక్స్టెండెడ్ క్యామియో.. మరో సర్ప్రైజ్ కూడా!

Also Read

  • Tamil Nadu: గవర్నర్‌ను కలిసిన విజయ్.. ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందజేత
  • Uttar Pradesh: బీజేపీ "మిషన్ యూపీ 2027" స్టార్ట్ .. యోగీ సర్కార్ కీలక చర్య..
  • Tamil Nadu: గవర్నర్ యూటర్న్.. కేరళం టూర్ రద్దు.. విజయ్‌కు అపాయింట్‌మెంట్
  • BJP Bengal Win: సరిహద్దుల్లో బీజేపీ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ రాజకీయాలతో సంబంధం..
Add as a preferred
source on google

ఆ రక్తసిక్తమైన రోజు.. మారని గాయం
సరిగ్గా ఏడాది క్రితం 2025 ఏప్రిల్ 22న బైసారన్ లోయపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ మర్చిపోలేని సంఘటనలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజు చిందిన రక్తం ఈ అందమైన లోయను నిశ్శబ్దంలోకి నెట్టివేసింది. భద్రతా కారణాల దృష్ట్యా అప్పటి నుంచి ఈ లోయలో సందర్శకులకు అనుమతి లేదు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం దాడి తర్వాత మూసివేసిన 48 పర్యాటక ప్రాంతాల్లో చాలా వరకు తెరుచుకున్నప్పటికీ, బైసారన్ మాత్రం ఇప్పటికీ సాయుధ బలగాల నిఘా నీడలోనే ఉంది. గత ఏడాది దాడి నుంచి ప్రాణాలతో బయటపడిన ప్రత్యక్ష సాక్షులు ఇప్పటికీ ఆ చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుని వణికిపోతున్నారు. పహల్గామ్ నుంచి బైసారన్‌కు వెళ్లే మార్గం అత్యంత కఠినంగా ఉండటం, వాహనాలు వెళ్లడానికి అనుకూలమైన రోడ్డు లేకపోవడమే ప్రాణనష్టం పెరగడానికి ప్రధాన కారణమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సహాయక బృందాలు సకాలంలో చేరుకోలేకపోవడంతో, చెలరేగిన తీవ్ర రక్తస్రావం వల్ల తమ వారు కళ్ల ముందే ప్రాణాలు వదిలారని బాధితులు కన్నీళ్లతో గుర్తు చేసుకున్నారు.

మార్పు దిశగా అడుగులు..
బైసారన్ లోయకు పర్యాటక శోభను తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో స్థానిక గుర్రపు స్వారీ చేసేవారి ఉపాధి దెబ్బతింటుందనే కారణంతో రోడ్డు నిర్మాణాన్ని పక్కన పెట్టారు. కానీ భద్రతా దృష్ట్యా ఇప్పుడు పక్కా రహదారిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ప్రాజెక్టు కోసం రూ. 6.3 కోట్లు (రూ.63 మిలియన్లు) ఖర్చు చేయనున్నారు. ఈ ఏడాది మే నెలలో ఈ రహదారి పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. బైసారన్ లోయలో నిశ్శబ్దాన్ని ఛేదించి, మళ్లీ పర్యాటకులను ఆహ్వానించేలా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. రోడ్డు నిర్మాణం పూర్తయితే అత్యవసర సమయంలో భద్రతా బలగాలు, అంబులెన్స్‌లు త్వరగా చేరుకోవడానికి వీలవుతుంది. ప్రకృతి అందాల మధ్య భయం నీడలు తొలగిపోయి, మళ్లీ పర్యాటక సందడి మొదలవ్వాలని కశ్మీర్ లోయ ఆశిస్తోంది.

READ ALSO: Tim Cook: ఆపిల్ సీఈఓగా టిమ్ కుక్ రిటైర్మెంట్! ఆయన ఎన్ని వేల కోట్లకు అధిపతో తెలుసా?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Baisaran Valley road construction
  • Baisaran Valley Terror Attack
  • Baisaran Valley tragedy survivor stories.
  • Jammu Kashmir Tourism News 2026
  • Kashmir 48 tourist spots reopen

తాజావార్తలు

  • UFO Files: ఏలియన్ల గుట్టు రట్టు.. చరిత్రలో తొలిసారిగా ‘UFO’ రహస్య పత్రాలను బయటపెట్టిన అమెరికా!

  • Milk: ఈ 8 ఆహారాలను పాలతో కలిపి తీసుకుంటే రిస్క్‌లో పడ్డట్లే..

  • Veerabhadrudu : అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా సూర్య ‘వీరభద్రుడు’ రిలీజ్

  • Tamil Nadu: గవర్నర్‌ను కలిసిన విజయ్.. ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందజేత

  • Terror Threat to Delhi BJP HQ: ఢిల్లీ బీజేపీ కార్యాలయానికి ఉగ్ర ముప్పు.. రాజధానిలో హై అలర్ట్ ప్రకటించిన భద్రతా సంస్థలు!

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions