Padma Awards Winners: తెలుగు రాష్ట్రాల పద్మశ్రీ విజేతలు ఏమన్నారంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలను పద్మ పురస్కారాలు వరించాయి. గురువారం కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో ఏపీకి రెండు పద్మవిభూషణ్లతో పాటు ఒక పద్మశ్రీ, తెలంగాణకు ఐదు పద్మశ్రీలు లభించాయి. ఈ సందర్భంగా పద్మశ్రీ గ్రహీతలు తమ సంతోషాన్ని ఎన్టీవీతో పంచుకున్నారు.
Read Also: MLC Kavitha: తెలంగాణ జాగృతి పలు సమస్యలపై నిరంతర పోరాటం చేస్తోంది..
Also Read
- West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
- Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
- Government Jobs 2026: టెన్త్ అర్హతతోనే 23,757 పోస్టులు.. పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం.. పూర్తి వివరాలు..
- Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
పద్మశ్రీ అవార్డు రావడం సంతోషంగా ఉందని ఏపీకి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత ఉమా మహేశ్వరి తెలిపారు. ఎన్టీవీతో ఆమె మాట్లాడారు. జాతీయ స్థాయిలో హరికథకు వచ్చిన గుర్తింపు అని పేర్కొ్న్నారు. కళను గుర్తించిన కేంద్రానికి ధన్యవాదాలు చెప్పారు. తమ కుటుంబ సభ్యులంతా కళాకారులేనని తెలిపారు. కుటుంబ సభ్యుల నుంచే హరికథను నేర్చుకున్నట్లు వెల్లడించారు. ఈ తరం యువత కూడా హరికథను నేర్చుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రిని కలిసి హరికథను ప్రోత్సహించాలని కోరనున్నట్లు చెప్పుకొచ్చారు. హరికథ నేర్చుకునే విద్యార్థులకు స్కాలర్షిప్ అందిస్తే బాగుంటుందని ఉమా మహేశ్వరి అభిప్రాయపడ్డారు
Read Also: Bihar Politics: అధికారం కోసం లాలూ విశ్వప్రయత్నాలు.. మద్దతు కోసం డిప్యూటీ సీఎం పదవులు ఆఫర్..
తండా మట్టి వాసన ఢిల్లీ వరకు వెళ్లిందని పద్మశ్రీ అవార్డు గ్రహీత కేతావత్ సోమ్లాల్ ఆనందం వ్యక్తం చేశారు. భగవద్గీతను కేతావత్ సోమ్లాల్ బంజారా భాషలో అనువదించారు. ఇందుకు గాను పద్మశ్రీ అవార్డును కేంద్రం ప్రకటించింది. ఈ సందర్భంగా ఎన్టీవీతో ఆయన మాట్లాడుతూ.. తన కళను గుర్తించి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించిన కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. భాష కనుమరుగు కాకూడదనే బంజారా భాషలో పుస్తకాలు, పాటలు రాసినట్లు తెలిపారు. జీవిత సారాన్ని తెలియజేసే భగవద్గీతను బంజారా భాషలో రాసినట్లు వెల్లడించారు. తెలుగులో రాస్తే గుర్తింపు వస్తుందని చాలా మంది సూచించారు. కానీ వారి మాట వినకుండా బంజారా భాషలోనే రాసినట్లు చెప్పుకొచ్చారు. పద్మశ్రీ అవార్డుతో తన బాధ్యత మరింత పెరిగిందని సోమ్లాల్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
-
Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
-
Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా ‘సూరి’
ట్రెండింగ్
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!