కరీంనగర్ జిల్లాలోని కమలాపూర్ లో కల్యాణ లక్ష్మీ చెక్కులని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. పెద్ద పోరాటంతో శాసనసభ్యునిగా కోర్టులో జీవో తో కమలాపూర్ మండలంలో 80 మందికి చెక్కులు పంచామన్నారు. దయచేసి నా మీద కోపం ఉంటే నా మీద తీర్చుకోండి.కానీ నా నియోజకవర్గ ప్రజల మీద తీర్చుకోకండని, నా ప్రజల జోలికి వస్తే ఎంత వరకైనా వస్తా.ఊరుకునేది లేదన్నారు. ఈ చెక్కులు కేసీఆర్ ఇచ్చిన చెక్కులు అని, డిసెంబర్ 9 తరువాత తులం బంగారం ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఎమ్మార్వో కార్యాలయంలో తులం బంగారం వచ్చిందా అంటే రాలేదు అన్నారని, మళ్ళీ 108 మంది లబ్ది దారులకు తులం బంగారం రావాలని డిమాండ్ చేస్తున్నానన్నారు.
ఇప్పటి వరకు చెక్కులు ఇచ్చిన లబ్ది దారులకు తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 5 మండలాల్లో దాదాపు 400 వందల చెక్కులు లాప్స్ అయ్యాయని, తిరిగి మళ్ళీ రేన్యూవల్ చేస్తాం అని అధికారులు తెలిపారన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డికి, పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు జాగ్రత్త అని ఆయన వ్యాఖ్యానించారు. కొందరు చాలా కాంట్రవర్సీ మాటలు మాట్లాడుతున్నారు ఈటెల రాజేందర్ ఉన్నప్పుడు చెక్కులు కౌశిక్ రెడ్డి పంచలేదా…. అని ఆయన ప్రశ్నించారు.
మళ్ళీ చెప్తున్న ఆ రోజు ఈటల రాజేందర్ ను పిలిచాను, తను రాకపోతే నేనేం చేయాలని, ఒక్కటి చెప్తున్న నేను చెక్కులు పంపిణీ చేస్తా అంటే ప్రభుత్వ కార్యాలయంలోనే ఇవ్వాలి అని అన్నారు ఇచ్చాను. కౌశిక్ రెడ్డి గొంతు నొక్కాలి అని చూస్తున్నారు.. మీ తరం కాదు.. మీబిడ్డ చెప్తున్న తప్పకుండా ప్రజల్లోకి వస్తాను. నా గళం వినిపిస్తాను.’ అని కౌశిక్ రెడ్డి అన్నారు.