TPCC Mahesh Goud : కౌశిక్‌రెడ్డిని కేసీఆర్ అదుపులో ఉంచాలి

  • కౌశిక్‌రెడ్డి వ్యవహారంపై టీపీపీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ స్పందన
  • ఒక ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యేపై దాడి చేయడం తగదని హితవు
Maheshkumargoud

Maheshkumargoud

TPCC Mahesh Goud : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తన పరిధిని దాటిన ప్రవర్తనతో తెలంగాణ ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నారని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కేసీఆర్ కౌశిక్‌రెడ్డిని అదుపులో ఉంచాలని సూచించారు. కొంపల్లి దేవరయాంజాల్‌లో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో మహేశ్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, ఒక ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యేపై దాడి చేయడం తగదని స్పష్టంచేశారు. దాడులు, దురుసుగా ప్రవర్తించడం తెలంగాణ సంస్కృతి కాదని, కేటీఆర్ మరియు కేసీఆర్ మెప్పుకోసమే కౌశిక్‌రెడ్డి ఈ రకమైన చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

Tariff Hike: ఆ కారణంతో మళ్లీ పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు!.. ఈసారి ఎంత శాతమంటే?

పరిపక్వత మరియు క్రమశిక్షణ రాజకీయ నాయకులకు అత్యవసరమని, కౌశిక్‌రెడ్డి తన ప్రవర్తన మార్చుకోవాలని మహేశ్‌కుమార్ గౌడ్ సూచించారు. ఈ రకమైన దురుసు ప్రవర్తనతో రాజకీయంగా ఎదగాలని ఆశపడడం అవివేకమని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలను ఉపేక్షించకూడదని హితవు పలికారు. బీఆర్ఎస్ నాయకులు తమ ఎమ్మెల్యేల ప్రవర్తనపై జాగ్రత్తగా ఉండాలని, ఇకనైనా కౌశిక్‌రెడ్డి తన తీరును మార్చుకుని రాజకీయాలకు శ్రేయోభిలాషిగా ఉండాలని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

Software Engineers: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు డేంజర్ బెల్స్.. జుకర్‌బర్గ్ సంచలన వ్యాఖ్యలు..