టాలీవుడ్ యంగ్ హీరో చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్ మరియు మాళవిక సతీశన్ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ..’పారిజాత పర్వం’. సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో ఈ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ రూపొందుతోంది.ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, కాన్సప్ట్ వీడియో, సాంగ్స్ అన్నిటికీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాని ఏప్రిల్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో మేకర్స్ తాజాగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేసారు..’కిడ్నాప్ ఈజ్ ఏన్ ఆర్ట్’ అనే లైన్ తో ప్రధాన పాత్రలను పరిచయం చేయటంతో ప్రారంభమైన ఈ ‘పారిజాత పర్వం’ టీజర్ ఆద్యంతం ఎంతో ఆసక్తకరంగా సాగింది. కథంతా కిడ్నాపుల చుట్టూనే తిరుగుతుందని తెలుస్తుంది.
అమాయకుల మధ్యలో ఓ డెవిల్ ఉన్నాడని చెప్పిన తర్వాత అసలైన డ్రామా మొదలవుతుంది. యాక్షన్, డ్రామా, ఫన్.. ఇలా అన్నీ ఎలిమెంట్స్ వున్న ఈ టీజర్ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తోంది.ఇందులో చైతన్య రావు, వైవా హర్ష కలిసి ఏదో కిడ్నాప్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. భీమవరం నుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తిగా సునీల్ ను చూపించారు. అతని చేతిపై ‘జై మెగాస్టార్’ అనే టాటూని బట్టి చూస్తే, చిరంజీవిలా స్వయంకృషితో ఎదగాలని సిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. సునీల్ ఓవైపు యాక్షన్ లో అదరగొడుతూనే, మరోవైపు ఓ గ్యాంగ్ కు లీడర్ గా కనిపిస్తున్నాడు. అలాగే గ్లామరస్ బ్యూటీ శ్రద్ధా దాస్ ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తుంది..’పారిజాత పర్వం’ టీజర్ చివర్లో ‘జై అంటూ పని మనిషిని తీసుకొచ్చామా’ అంటూ వైవా హర్ష, చైతన్య రావుల మధ్య వచ్చే సన్నివేశం నవ్వులు పూయిస్తుంది.మొత్తానికి దర్శకుడు సంతోష్ కంభంపాటి ఓ హిలేరియస్ క్రైమ్ కామెడీని ప్రేక్షకులకు అందించబోతున్నారని ఈ వీడియో చూస్తే అర్ధమౌతుంది. ఈ చిత్రానికి రీ మ్యూజిక్ అందిస్తుండగా బాల సరస్వతి సినిమాటోగ్రఫీ నిర్వహించారు.