Jammu & Kashmir: జమ్మూ కాశ్మీర్లో తొలిసారి ఎన్ని లక్షల మంది ఓటు వేయనున్నారో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu And Kashmir: జమ్మూ కాశ్మీర్లో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 3. 4 లక్షల మంది తొలిసారిగా ఓటు వేయనున్నారని ఎన్నికల కమిషన్ తెలిపింది. అలాగే, మొత్తం 86.9 లక్షల మంది ఓటర్లు అర్హులని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంతంలో ఒక్కో పోలింగ్ కేంద్రానికి సగటున 747 మంది ఓటర్లు ఉండేలా 11,629 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. ఇందులో 77,290 మంది 85 ఏళ్లు పైబడిన ఓటర్లు ఉండగా అందులో 2,886 మంది 100 ఏళ్లకు పైబడిన వారున్నారు.
Read Also: Tiger attack: పెద్ద పులి దాడి చేసినా బెదరలేదు, ఎలా ప్రాణాలు కాపాడుకున్నాడంటే..
Also Read
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు గుడ్న్యూస్.. మరో స్మార్ట్ ఫీచర్.. మరింత భద్రత..
- Astrology: జూన్ 29 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
ఇక, ఎన్నికల సంసిద్ధతను సమీక్షించేందుకు జమ్మూ కాశ్మీర్లో మూడు రోజుల సుదీర్ఘ పర్యటన ముగింపు సందర్భంగా ఇక్కడ విలేకరులతో మాట్లాడిన ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్.. జమ్ము అండ్ కాశ్మీర్ లో శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా ఉత్సాహంగా పాల్గొనాలని ఓటర్లను, రాజకీయ పార్టీలను ఆయన అభ్యర్థించారు. మేము ఎన్నికల సంసిద్ధతను సమీక్షించడానికి దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శిస్తున్నాము.. ఇదే మా చివరి పర్యటన అని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.
Read Also: Paytm : పేటీఎం మాస్టర్ ప్లాన్.. తన పార్టనర్ గా రంగంలోకి ఎస్బీఐ
అయితే, శాంతియుతంగా, ప్రలోభాలకు గురికాకుండా ఎన్నికలు జరిగేలా చూడాలని.. ఓటర్లు గరిష్ఠంగా ఓటింగ్ జరిగేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లో 44. 34 లక్షల మంది పురుషులు ఉండగా.. 42. 55 లక్షల మంది మహిళలు సహా మొత్తం 86.9 లక్షల మంది ఓటర్లు ఉన్నారని సీఈసీ తెలిపింది. వీరిలో 67,400 మంది వికలాంగులు, 158 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారని తెలిపారు.
Read Also: Jamili Elections: నేడు జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి నివేదిక..
కాగా, జమ్ము అండ్ కాశ్మీర్ లో మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.. 18-19 ఏళ్లలోపు మహిళా ఓటర్లు 1.56 లక్షల మంది ఉండగా, కొత్త మహిళా ఓటర్లు 1.35 లక్షల మంది ఉన్నారని సీఈసీ రాజీవ్ కుమార్ చెప్పారు. మొత్తం 11629 పోలింగ్ కేంద్రాలకు గాను గ్రామీణ ప్రాంతాల్లో 9307, పట్టణ ప్రాంతాల్లో 2322 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 52 శాతం పోలింగ్ కేంద్రాల్లో (5814) వెబ్కాస్టింగ్ సదుపాయం ఉంది.. 267 మోడల్ పోలింగ్ కేంద్రాలుగా ఉంటాయని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. మొత్తం మహిళలే నిర్వహించే పోలింగ్ స్టేషన్లు 93, వికలాంగుల ద్వారా 83 పోలింగ్ స్టేషన్లు ఉంటాయన్నారు. అలాగే, అంతర్ రాష్ట్ర- అంతర్జాతీయ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘాలో భాగంగా మొత్తం 47 అంతర్రాష్ట్ర చెక్పోస్టులు.. 385 అంతర్గత పోలీసు చెక్పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు.
తాజావార్తలు
-
Suriya : రాజకీయాల్లోకి తమిళ స్టార్ హీరో సూర్య ఎంట్రీ.?
-
Jai Moondra: రెండు మ్యాచ్లకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అండ్ ‘సిరీస్’.. టీమిండియాపై ఈ అవార్డులు వస్తాయనుకోలేదు!
-
Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
-
Unbeaten Directors of Tollywood : ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుల సినిమాలపై భారీ అంచనాలు
-
Shraddha Kapoor: శ్రద్ధా కపూర్ ‘ఈత’ సినిమాకు ఊహించని చిక్కు.. కోర్టు మెట్లు ఎక్కనున్న కుటుంబం
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!