ప్రముఖ మొబైల్ కంపెనీ ఒప్పో నుంచి మరో అదిరిపోయే స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చెయ్యనున్నారు.. మొన్న వచ్చిన రెనో 11 సిరీస్లో భాగంగా రెండు ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకురానున్నారు.. ఒప్పో K11 5జీ.. ఈ ఫోన్ గురించి ఇప్పుడు వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
8GB RAM మరియు 128GB స్టోరేజ్తో Oppo K11 5G వచ్చింది. ఇందులో MediaTek డైమెన్సిటీ 810 SoCతో విడుదల అయ్యింది. ఇందులో 33W వైర్డ్ SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్తో 5,000mAh బ్యాటరీ ఈ ఫోన్లో కలదు.. ఈ ఫోన్ ఫీచర్స్ విషయానికొస్తే.. మీ ఫోన్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వచ్చే అవకాశం ఉంది. ఇది NFC కనెక్టివిటీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది మరియు X-యాక్సిస్ హాప్టిక్ మోటార్, ఒక IR బ్లాస్టర్ మరియు డ్యూయల్ స్పీకర్లతో అమర్చబడి ఉంటుంది.ఈ హ్యాండ్సెట్ 8.23mm స్లిమ్గా మరియు 184 గ్రాముల బరువు కలిగి ఉన్నట్లు తెలుస్తుంది..
అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఫోన్ మార్కెట్ లోకి సంవత్సరం ద్వితియార్థంలో ఇండియాలోకి కూడా ప్రవేశించే అవకాశం ఉంది. ఇక అదిరిపోయే ఫీచర్స్ ను కలిగి ఉన్న ఈ ఫోన్ కొనసాగింపుగా రాబోయే Oppo K11 5G హ్యాండ్సెట్గా రానుంది. రాబోయే Oppo K11 5గ్ మన ఇండియాలో దాదాపుగా రూ. 22,000 ఉంటుందని అంచనా..