Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Operation Sindhu India Launches Rescue Mission To Evacuate Nationals From Iran Amid Israel Iran Conflict

Operation Sindhu: ఇరాన్‌-ఇజ్రాయిల్ యుద్ధ పరిస్థితుల్లో భారతీయులకు ఊరట.. “ఆపరేషన్ సింధు” ద్వారా భారత్ రక్షణ చర్యలు..

Published Date :June 18, 2025 , 9:41 pm
By Kothuru Ram Kumar
Operation Sindhu: ఇరాన్‌-ఇజ్రాయిల్ యుద్ధ పరిస్థితుల్లో భారతీయులకు ఊరట.. “ఆపరేషన్ సింధు” ద్వారా భారత్ రక్షణ చర్యలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Operation Sindhu: ఇరాన్‌-ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఇరాన్‌లోని భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం “ఆపరేషన్ సింధు” అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా అక్కడవున్న భారత విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకున్నాయి. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో.. తెహ్రాన్‌లో ఉన్న భారత విద్యార్థులను భారత దౌత్య కార్యాలయ సమన్వయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించింది.

Read Also: Donald Trump: “ఐ లవ్ యూ పాకిస్తాన్”.. ఆసిమ్ మునీర్‌పై ట్రంప్ ప్రశంసలు..

Also Read

  • Star Directors : బ్రేక్ తీసుకుంటోన్న స్టార్ డైరెక్టర్స్.. కారణాలు ఏంటో?
  • Michael Jackson Biopic: ఇండియాలో ‘మైఖేల్’ మేనియా.. లక్ష దాటిన టికెట్ల అమ్మకాలు
  • SA vs IND Women: వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి కసితీరా పగ తీర్చుకున్న దక్షిణాఫ్రికా.. 3-0తో భారత్ చిత్తు.!
  • Ninnu Kori: నాని ‘నిన్ను కోరి’ రొమాంటిక్ ట్రీట్.. రీ-రిలీజ్ డేట్ ఫిక్స్

అధికారుల ప్రకారం తొలి ఎవాక్యుయేషన్ విమానం ఆర్మేనియా రాజధాని యెరెవాన్ నుంచి భారత్ కు రానుంది. ఈ విమానం గురువారం (జూన్ 19) తెల్లవారుజామున 2 గంటల సమయంలో న్యూఢిల్లీలో ల్యాండ్ కానుంది. ఈ విషయమై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రంధీర్ జైస్వాల్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. భారత్ ‘ఆపరేషన్ సింధు’ ప్రారంభించింది. ఉత్తర ఇరాన్‌ నుండి 110 మంది భారతీయ విద్యార్థులను ఇరాన్‌, ఆర్మేనియాలోని మిషన్ల సమన్వయంతో ఆర్మేనియా దేశానికి తరలించాం. వారిని యెరెవాన్ నుండి ప్రత్యేక విమానంలో తరలించి జూన్ 19 తెల్లవారుజామున న్యూఢిల్లీకి తీసుకురానున్నాం అని తెలిపారు.

Read Also: Tatkal Ticket – Aadhaar: తత్కాల్ టికెట్ కు ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి.. ఆధార్ లింక్ చేయాలంటే సింపుల్ గా ఇలా చేస్తే సరి..!

ఇజ్రాయిల్ తాము ప్రారంభించిన “ఆపరేషన్ రైజింగ్ లయన్” ద్వారా ఇరాన్‌పై పలు ప్రాంతాల్లో పెద్దెత్తున దాడులు చేస్తున్నది. ఈ దాడుల వల్ల ఇరాన్ రాజధాని తెహ్రాన్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో, భారత్ తక్షణ చర్యగా తన పౌరులను బయటకు తరలించేందుకు రంగంలోకి దిగింది. వీటితో పాటు, అక్కడే ఉన్న భారతీయులకు తెహ్రాన్‌ను వదిలి వెళ్లాలని సూచనలు ఇవ్వబడ్డాయి. కొందరు భారతీయులు ఇరాన్-ఆర్మేనియా సరిహద్దు ద్వారా బయటకు వెళ్లేందుకు సహాయపడినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉర్మియా మెడికల్ యూనివర్సిటీ నుండి 110 మంది విద్యార్థులు, అందులో 90 మంది కాశ్మీర్ లోయకు చెందినవారు సురక్షితంగా ఆర్మేనియా దేశంలోకి ప్రవేశించారని తెలిపారు.

ఇరాన్‌లో పరిస్థితి ఉత్కంఠభరితంగా ఉన్నందున, తదుపరి మార్గదర్శకాలను త్వరలో జారీ చేస్తామని విదేశాంగ శాఖ తెలిపింది. భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. మొత్తంగా, ఇరాన్‌లోని భారత్ పౌరుల కోసం కేంద్ర ప్రభుత్వం “ఆపరేషన్ సింధు” ద్వారా తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలు ఇవ్వనున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • India Iran Evacuation
  • Indians in Iran
  • Indians Return from Iran
  • MEA Randhir Jaiswal
  • Operation Sindhu

తాజావార్తలు

  • Star Directors : బ్రేక్ తీసుకుంటోన్న స్టార్ డైరెక్టర్స్.. కారణాలు ఏంటో?

  • Michael Jackson Biopic: ఇండియాలో ‘మైఖేల్’ మేనియా.. లక్ష దాటిన టికెట్ల అమ్మకాలు

  • SA vs IND Women: వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి కసితీరా పగ తీర్చుకున్న దక్షిణాఫ్రికా.. 3-0తో భారత్ చిత్తు.!

  • Ninnu Kori: నాని ‘నిన్ను కోరి’ రొమాంటిక్ ట్రీట్.. రీ-రిలీజ్ డేట్ ఫిక్స్

  • KING 100 : దూసుకొస్తున్న కింగ్.. జెట్ స్పీడ్ లో సైలెంట్ గా షూటింగ్

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions