Operation Garuda: డ్రోన్ లతో పెట్రోలింగ్ ప్రారంభించిన పోలీస్ బాసులు.. “ఆపరేషన్ గరుడ..” అంటూ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రామగుండం పోలీస్ కమిషనరేట్ అధికారులు. ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో డ్రోన్ లతో పెట్రోలింగ్ మొదలు పెట్టారు అధికారులు. పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఆపరేషన్ మొదలుపెట్టి దశల వారీగా కమిషనరేట్ వ్యాప్తంగా అమలు చేస్తామని సిపి శ్రీనివాస్ తెలిపారు. ఇందులో భాగంగా సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పెద్దపల్లిలో జరిగే అసాంఘిక శక్తుల నిర్మూలనకు, అలాగే ప్రజల పద్ధతులు కొరకు ఈ సేవలు మొదలు పెట్టామని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తాము విధి నిర్వహణలో కొన్ని సమయాల్లో ప్రత్యేకంగా దృష్టి పెట్టడం కాస్త ఇబ్బందిగా ఉండటంతో తమ ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని డ్రోన్ ద్వారా ఏరియల్ సర్వే చేయాలనే ఉద్దేశ్యంతో “ఆపరేషన్ గరుడ” కార్యక్రమం మొదలు పెట్టమని ఆయన తెలిపారు.
Also read: Anjali : నాకు నాలుగు పెళ్లిళ్లు చేశారు.. అంజలి అంత మాట అనేసిందేంటి?
Also Read
- Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
- CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
- Monsoon: దేశంలో వర్ష మేఘాల బెల్ట్.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు.. ఇక భారీ వర్షాలే!
- CJP Protest: సీజేపీ ఉద్యమానికి ఖలిస్తాన్ ఉగ్రవాది మద్దతు..? వైరల్ అవుతున్న వీడియో..
ఇందులో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ లోని ప్రాంతాన్ని అతి తక్కువ సమయంలో పూర్తిస్థాయిగా డ్రోన్ ద్వారా పరిస్థితులను పర్యవేక్షించడం సాధ్యమవుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఇకపోతే ఎవరైనా గొడవలకు పాల్పడిన చట్ట వ్యతిరేకమైన చర్యలు చేస్తున్న వారికి సంబంధించిన ఫోటోలు, వీడియోల ఆధారంతో వారి కేసులు అమలు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోబోతామని ఆయన చెప్పుకొచ్చారు. ఇకపోతే ఈ డ్రోన్ లకు కావలసిన ఆర్థిక సహాయం అందించడానికి జిల్లాలోని లీడ్ బ్యాంక్ మేనేజర్ చెగొండ వెంకటేష్ ఆర్థిక సాయం అందించారని అధికారులు తెలిపారు.
Also read: Ganja: గంజాయి మత్తులో ఊగిపోతున్న యువత.. పోలీసుల అదుపులో యువకులు..
ఇందులో భాగంగా లీడ్ బ్యాంకు మేనేజర్ ను పట్టణ పోలీసులతో సహా ప్రముఖులు కూడా అభినందించారు. ఇక ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసిబి రాఘవేంద్రరావు, ఎడిషన్ డిసిపి అడ్మిన్ రాజు, సిఐ కృష్ణ, పెద్దపల్లి ఏసిపి కృష్ణ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ లు పాల్గొన్నారు. కొత్త టెక్నాలజీ ఉపయోగించడం ద్వారా నిందితులను త్వరగా గుర్తించి వారిపై చర్యలు చేపట్టేందుకు వీలుగా ఉంటుందని అధికారులు తెలుపుతున్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu : భూములకు బ్లాక్చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం
-
Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
-
The India Story : కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరీ’కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
-
KTR : గ్లోబరీనా వివాదం.. రేవంత్కు కేటీఆర్ డిఫమేషన్ నోటీసు
-
CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?