Andhra Pradesh: బదిలీలకు అప్పటి వరకు దరఖాస్తు పెట్టుకోవాలి.. ఇవి కీలకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త చెబుతూ.. వారి బదిలీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదం తెలిపిన విషయం విదితమే.. జూన్ 10వ తేదీ వరకు గ్రామ సచివాలయ ఉద్యోగుల బదిలీలకు అవకాశం కల్పించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని ప్రొబేషన్ డిక్లేర్ అయిన ఉద్యోగులందరూ బదిలీలకు అర్హులుగా పేర్కొన్నారు.. జిల్లా పరిధిలో బదిలీలతో పాటు అంతర్ జిల్లాల బదిలీలకు కూడా అవకాశం కల్పించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జిల్లాల్లో రిక్వెస్ట్ చేసుకున్న ఉద్యోగులందరికీ బదిలీలకు అవకాశం కల్పించనున్నారు.. ఇక, అంతర్ జిల్లా బదిలీలలో స్పౌజు కేసు మ్యూచువల్ ట్రాన్స్ఫర్లకు అవకాశం ఇవ్వనున్నారు.. ఇక, ఉద్యోగుల బదిలీలకు సంబంధించి జూన్ 3వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు.. సోమవారం నుంచి ఉద్యోగులు అన్లైన్ పోర్టల్లో తమ బదిలీ దరఖాస్తుల నమోదుకు వీలు కల్పిస్తారు. ఈ మేరకు బదిలీల ప్రక్రియ షెడ్యూల్ను ఖరారు చేసింది ప్రభుత్వం.
అయితే, సచివాలయాల ఉద్యోగులు ప్రస్తుతం రోజు వారీ హాజరును నమోదు చేసే హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లోనే బదిలీల దరఖాస్తుల నమోదుకు ప్రత్యేక లింకును అందుబాటులో ఉంచనున్నారు. ఆన్లైన్లో బదిలీల దరఖాస్తు నమోదు సమయంలో వారి దరఖాస్తుకు అవసరమైన ధృవీకరణ పత్రాలపై సొంత ధృవీకరణతో కూడిన సంతకాలు చేసి, వాటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. బదిలీల ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్ విషయానికి వస్తే..
* జిల్లాల్లో సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ఖాళీల వివరాల నమోదు తేదీ మే 28
* ఆన్లైన్లో దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ జూన్ 3వ
* ఆన్లైన్లో అందిన దరఖాస్తుల పరిశీలనకు చివరి తేదీ జూన్ 6
* వెబ్ ర్యాంకు లిస్టుతో పాటు బదిలీలో ఉద్యోగికి కేటాయించిన మండలం లేదా పట్టణం వివరాలు తెలిపే తేదీ జూన్ 6
* బదిలీ అయిన ఉద్యోగులకు కేటాయించిన మండలం లేదా పట్టణంలో వ్యక్తిగత కౌన్సెలింగ్ తేదీలు జూన్ 8, 9, 10
* బదిలీలపై కలెక్టర్లకు అభ్యంతరాలు తెలిపేందుకు చివరి తేదీ జూన్ 10గా ప్రకటించారు..
Also Read
- Tamil Nadu: మతం మారినా రిజర్వేషన్లు ఇవ్వాలి.. సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్..
- NATO: ఇరాన్పై దాడులు సమర్థనీయమే.. ట్రంప్కు నాటో చీఫ్ మార్క్ రుట్టే మద్దతు
- Hyderabad: యూట్యూబ్ చూసి ఇంట్లోనే వైన్ తయారీ.. వృద్ధుడి అక్రమ దందా బట్టబయలు
- PM Modi: ఇండోనేషియాలో వెయ్యేళ్ల నాటి హిందూ దేవాలయాన్ని సందర్శించిన మోడీ
మరోవైపు.. వేరే జిల్లాకు బదిలీ కోరుకునే వారికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే..
* జిల్లాల్లో సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ఖాళీల వివరాలు నమోదు తేదీ మే 28
* ఆన్లైన్లో దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ జూన్ 3
* జిల్లాకు బదిలీకి వీలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసే తేదీ జూన్ 8
* బదిలీ అయ్యాక ఉద్యోగులకు వ్యక్తిగత కౌన్సెలింగ్ తేదీ జూన్ 8, 9, 10
* కొత్తగా కేటాయించిన సచివాలయం వివరాలతో బదిలీ సర్టిఫికెట్లు జారీ తేదీ జూన్ 8, 9, 10
* బదిలీలకు సంబంధించి కలెక్టర్లకు అభ్యంతరాలు తెలిపేందుకు చివర తేదీ జూన్ 10
తాజావార్తలు
-
Swathi: తన సినిమా దర్శకుడిని సైలెంటుగా రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్
-
Tamil Nadu: మతం మారినా రిజర్వేషన్లు ఇవ్వాలి.. సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్..
-
NATO: ఇరాన్పై దాడులు సమర్థనీయమే.. ట్రంప్కు నాటో చీఫ్ మార్క్ రుట్టే మద్దతు
-
Hyderabad: యూట్యూబ్ చూసి ఇంట్లోనే వైన్ తయారీ.. వృద్ధుడి అక్రమ దందా బట్టబయలు
-
PM Modi: ఇండోనేషియాలో వెయ్యేళ్ల నాటి హిందూ దేవాలయాన్ని సందర్శించిన మోడీ
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..