Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story One Person Died Due To Landslides In Maharashtra Others Were Trapped Under The Debris

Landslides: మహారాష్ట్రలో కొండచరియలు విరిగిపడి ఒకరు మృతి.. శిథిలాల కింద మరికొందరు

Published Date :July 25, 2024 , 8:52 pm
By Rajesh Veeramalla
  • పూణెలోని లావాసా నగరంలో విరిగిపడ్డ కొండచరియలు
  • కూలిపోయిన 3 ఇళ్లు
  • ఓ యువకుడు మృతి.. శిథిలాల కింద చిక్కుకున్న ఇద్దరు.
Landslides: మహారాష్ట్రలో కొండచరియలు విరిగిపడి ఒకరు మృతి.. శిథిలాల కింద మరికొందరు
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పూణెలోని లావాసా నగరంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మూడు ఇళ్లు కూలిపోయాయి. అంతేకాకుండా.. ఓ యువకుడు మృతి చెందాడు. కాగా కొండచరియలు విరిగిపడిన శిథిలాల కింద ఇద్దరు చిక్కుకున్నారు. వర్షం కారణంగా పూణె, థానేలో వరదలు పొంగిపొర్లుతున్నాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.. డ్యామ్‌లలో నీటిమట్టం పెరిగింది. వర్షం కారణంగా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో.. ప్రభుత్వం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ప్రజలను రక్షించే పనిలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిరంతరం నిమగ్నమై ఉన్నాయి.

మహారాష్ట్రలోని థానే జిల్లాలో వర్షం ప్రజల ఇబ్బందులను పెంచింది. జిల్లాలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఐదు గంటల్లో 135 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 142.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గురువారం అంబర్‌నాథ్‌తో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అంబర్‌నాథ్‌లోని సాహ్వాస్ వృద్ధాశ్రమంలోని 18 మంది పెద్దలను మహర్ వృద్ధాశ్రమంలోని పై అంతస్తుకు తరలించారు. సత్కర్మ ఆశ్రమానికి చెందిన 30 మంది పిల్లలను ప్రగతి అంధుల పాఠశాలకు పంపారు. అంతే కాకుండా.. 200 మందిని BSUP భవనంలోకి తీసుకువెళ్లారు. 40 కుటుంబాలకు చెందిన 156 మందిని కళ్యాణ్ నుండి తరలించారు.

Also Read

  • Tamil Politics: విజయ్‌పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
  • PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?
  • Narendra Modi : ఏడాది పాటు బంగారం కొనద్దు.. ప్రధాని మోడీ పిలుపు.!
  • PM Modi: బెంగాల్ ఉత్సాహం తెలంగాణలో కూడా కనిపిస్తోంది..
Add as a preferred
source on google

PM Modi: శుక్రవారం లడఖ్‌లో మోడీ పర్యటన.. షింకున్ లా టన్నెల్ ప్రాజెక్ట్ ప్రారంభం

భారీ వర్షాల కారణంగా కళ్యాణ్ జిల్లాలోని బద్లాపూర్ బ్యారేజీ, జంబుల్ డ్యామ్, మోహనే డ్యామ్, ఉల్లాస్ నదిలో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో.. మోహనే, వరప్, వల్ధుని, కళ్యాణ్, అనే, భిసోల్, రైటే, ఆప్తి, దహగావ్, మంఝర్లీ, అంబర్‌నాథ్‌లోని బద్లాపూర్, ఇరంజాద్, కుద్సర్వే, కన్హేరే, కస్గావ్, ఉల్హాస్‌నగర్‌కు చెందిన షాహద్, మహరల్, భివాండికి చెందిన డైవ్ అగర్, రాజనోలి గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు.. తాంసా డ్యాంలో నీటిమట్టం 99.18 శాతానికి చేరుకోవడంతో చుట్టుపక్కల గ్రామాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. వరదల ధాటికి భివాండి, షాపూర్‌లలో ఐదు ఇళ్లు దెబ్బతిన్నాయి.

కళ్యాణ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా.. రుండే, రైతే వంతెనలపై రాకపోకలు నిలిచిపోయాయి. నది ఒడ్డున నివసించే ప్రజలను అప్రమత్తం చేశారు. అంతే కాకుండా.. చిక్లి వంతెన మునిగిపోవడంతో కళ్యాణ్-ముర్బాద్ రోడ్, ముర్బాద్-సహాపూర్ రోడ్‌లు మూసివేశారు. సహాయక చర్యల కోసం అధికారులు థానేలో రెండు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను మోహరించారు. కొండచరియలు విరిగిపడిన శిథిలాలలో చిక్కుకున్న యువకుల కోసం ఎన్డీఆర్ఎఫ్ వెతుకుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • died
  • Heavy Rain
  • Landslides
  • Maharashtra
  • one person

తాజావార్తలు

  • Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్‌గా ఇలా ట్రై చేయండి!

  • Tamil Politics: విజయ్‌పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?

  • RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!

  • PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..

  • PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions