One Nation One Election: ‘ఒక దేశం-ఒకే ఎన్నికల’ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తాం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Elections 2024: ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి వస్తే ‘ఒక దేశం-ఒకే ఎన్నికల’ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈ భూమి మీద డైనోసార్లు కనుమరుగైనట్లే దేశంలోని రాజకీయ రంగం నుంచి పురాతన పార్టీ కనుమరుగవుతుందని కాంగ్రెస్పై మండిపడ్డారు. పదేళ్ల తర్వాత ఏ పిల్లాడిని అడిగినా కాంగ్రెస్ పార్టీ ఏంటో చెబుతాడన్నారు. రాహుల్ గాంధీని పాకిస్థాన్లో అభిమానిస్తున్నారని ఆరోపించిన ఆయన.. గాంధీ కుటుంబానికి భారతదేశంలో రాజకీయాలు చేసే నైతిక హక్కు లేదన్నారు.
Read Also: Uttarakhand : అడవుల్లో చల్లారని మంటలు.. హిమాలయాలు కరిగే ప్రమాదం
Also Read
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
అయితే, కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి మద్దతు ఇవ్వలేదని రాజ్నాథ్ సింగ్ అన్నారు. కానీ, బీజేపీ మాత్రం ఆయనకు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో సత్కరించిందన్నారు. మోడీ ప్రధాని అయ్యాక భారత్ ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని తెలిపారు. మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా దేశం అడుగులు వేస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. మోడీ నాయకత్వంలో దేశంలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం నాలుగైదు గంటల పాటు ఆగిపోయిందని.. తద్వారా భారత్ తన 22,000 మంది పౌరులను ఖాళీ చేయగలిగామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు.
Read Also: IPL 2024 Orange Cap: ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ కోహ్లీకి దక్కేనా..?
గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉండేవని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. అయితే, అటల్ బిహారీ వాజ్పేయి లేదా మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాలపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని చెప్పారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు వంటి హామీలను బీజేపీ నెరవేర్చిందని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్గా..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!