Rajasthan News: నిద్రపోతున్న తమ్ముడిని కత్తితో పొడిచి చంపిన అన్న.. పంట విషయంలో ఘర్షణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లోని భరత్పూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అర్థరాత్రి నిద్రిస్తున్న సమయంలో తమ్ముడిని తన అన్న కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన ఉద్యోగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తఖా గ్రామంలో జరిగింది. వీరిద్దరి మధ్య పంటల పంపిణీపై అర్థరాత్రి ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో తమ్ముడిని అన్న దారుణంగా హతమార్చాడు. మినుము పంటను కోసి ఇంటికి తీసుకువచ్చాడని.. ఈ కారణంగా మద్యం మత్తులో ఇద్దరు సోదరులు గొడవ పెట్టుకున్నారు. అయితే గొడవ జరిగిన తర్వాత కుటుంబ సభ్యులంతా నిద్రలోకి జారిపోయారు. గొడవ నేపథ్యంలో కక్ష పెట్టుకున్న అన్న లోకేశ్.. తన తమ్ముడు ధన్వీర్ తలపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన తర్వాత అన్న పరారీలో ఉన్నాడు. మరోవైపు ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులు సమాచారం ఇవ్వకుండానే.. ధన్వీర్ మృతదేహాన్ని అంత్యక్రియలు చేసేందుకు వెళ్లారు. ఆ తర్వాత మృతుడి తండ్రి పురాణ్సింగ్ పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించారు.
Bandla Ganesh: కాంగ్రెస్ అభ్యర్థిగా నిర్మాత బండ్ల గణేష్.. ఆయన రియాక్షన్ ఇదే..
Also Read
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
- Jay Shah: పాకిస్థాన్ కెప్టెన్తో 'జై షా' కరచాలనం.. ఏకిపారేస్తున్న నెటిజన్స్.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- లార్డ్స్ టెస్టులో పంజా విసిరిన ఇంగ్లండ్.. WTC 2025-27 ర్యాంకింగ్స్లో భారీ మార్పులు.! భారత్ ర్యాంక్ ఇంత ఘోరమా..
ఈ ఘటనపై మృతుడి తండ్రి స్పందించారు. అర్థరాత్రి లోకేశ్, ధన్వీర్ల మధ్య గొడవ జరిగిందని తెలిపాడు. ఈ క్రమంలో లోకేష్ పదునైన ఆయుధంతో ధన్వీర్ తలపై దాడి చేశాడని.. ఆ సమయంలో తాము నిద్రపోతున్నట్లు చెప్పాడు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. తఖా గ్రామంలో ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు కంట్రోల్ రూమ్ నుంచి సమాచారం అందిందని ఉద్యోగ్ నగర్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ రాకేష్ కుమార్ తెలిపారు. ఈ ఘటన గురించి ఎవరికీ తెలియజేయకుండా కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేస్తున్నారని.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చూడగా తలపై బలమైన గాయం ఉందన్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించామని.. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
- Tags
- brother
- Crime News
- Crop
- death
- murder
తాజావార్తలు
-
Shreyas Iyer: నేనింతే.. ఎవరి కోసం నేను మారను.. సర్పంచ్ సాబ్ సంచలన వ్యాఖ్యలు!
-
BharatPe Flex Feature: భారత్పే కొత్త ఫ్లెక్స్ ఫీచర్.. UPI ద్వారా నేరుగా రుణాలు.. 45 రోజుల వడ్డీ రహిత క్రెడిట్
-
Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
-
Korean Kanakaraju : ‘కొరియన్ కనకరాజు’ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్… మరో సర్ప్రైజ్ కూడా
-
Realme X3 SuperZoom: 64MP క్వాడ్ కెమెరాలతో.. రియల్మీ ఎక్స్3 సూపర్ జూమ్.. రూ.14 వేల కన్నా తక్కువ ధరకే
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!