Telangana Congress : తెలంగాణలో పోస్టుల భర్తీకి జాప్యం దేనికి..? అసలు కారణాలేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్ విషయంలో ఏఐసీసీ పెద్దలకు క్లారిటీ లేకుండా పోయిందా? తొమ్మిది నెలల నుంచి పోస్ట్ల భర్తీలో ఎందుకు కన్ఫ్యూజ్ అవుతోంది? అరకొర కమిటీతో ఇంకెన్నాళ్ళు బండి లాగిస్తారు? అత్యంత కీలకమైన పదవుల భర్తీకి ఇంకెన్నేళ్ళు పడుతుంది? పార్టీ పెద్దల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదా? లెట్స్ వాచ్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా….మహేష్ గౌడ్ను నియమించిన ఏఐసీసీ ఆయనకి టీంని సమకూర్చడానికి తొమ్మిది నెలలు పట్టింది. అయినాసరే… ఇప్పటికీ పూర్తి స్థాయిలో పీసీసీ కమిటీ నియామకం జరగలేదు. కేవలం ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను మాత్రమే నియమించి చేతులు దులుపుకుంది పార్టీ అధిష్టానం. ఇంకా సీనియర్ వైస్ ప్రెసిడెంట్స్, వర్కింగ్ ప్రెసిడెంట్స్, కార్యదర్శుల్ని నియమించాల్సి ఉంది. ప్రచార కమిటీ చైర్మన్ని కూడా నియమిస్తారని చెప్పుకున్నా… అదికూడా పెండింగ్లోనే ఉంది. ఈ పోస్ట్లన్నిటినీ ఎప్పుడు భర్తీ చేస్తారో కూడా ఇప్పటికీ క్లారిటీ లేదు. అటు అతి ముఖ్యమైన వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఎంపిక కూడా పేచీలతో ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. పార్టీ నాయకత్వానికి, సీనియర్ లీడర్స్కు మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో….వర్కింగ్ ప్రెసిడెంట్స్ నియామకం కొలిక్కి రావడం లేదట.
పార్టీ రాష్ట్ర నాయకత్వం సూచించిన ఓ పేరును ఆమోదించేందుకు ఇన్ఛార్జ్… ససేమిరా అంటున్నట్టు సమాచారం. అటు పార్టీ వర్కింగ్ ప్రెసిడింగ్ పోస్టుల్లో కూడా సామాజిక న్యాయం కోసం ప్రయత్నిస్తోందట అధిష్టానం. ఈ క్రమంలో ఎస్టీల నుంచి ఎంపీ బలరాం నాయక్, మరోనేత బెల్లయ్య నాయక్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. మాదిగ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ పేర్లు పరిశీలనలో ఉన్నాయట. ఇక రెడ్ల నుంచి రోహిణ్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్టు సమాచారం. ఇప్పుడు పేచీ అంతా మైనార్టీ విభాగం నుంచి ఎవరిని తీసుకోవాలన్న దగ్గరేనట. అట్నుంచి ఫయీం, ఫిరోజ్ ఖాన్తో పాటు మరో ఇద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల్ని వీలైనంత త్వరగా భర్తీ చేసి ప్రజల్లోకి వెళితేనే… పార్టీకైనా, ప్రభుత్వానికైనా ఉపయోగమని, ఇక ఎంత ఆలస్యం అయితే… అంత నష్టం జరిగినట్టేనని అంటున్నాయి తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు.
Also Read
- HYDRA Operation: హస్మత్పేటలో ఆపరేషన్.. రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
- Cyber Crime Recovery Mela: సైబర్ క్రైమ్ రికవరీ మేళా.. 310 మంది బాధితులకు రూ.6 కోట్ల రికవరీ చెక్కులు..
- NEET Paper Leak: నీట్ పేపర్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆందోళన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్!
- Ayodhya Donation Theft Case: నిందితులకు షాక్.. వాదిస్తే రూ.5 లక్షల జరిమానా.. బార్ అసోసియేషన్ సంచలన నిర్ణయం
తాజావార్తలు
-
HYDRA Operation: హస్మత్పేటలో ఆపరేషన్.. రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
-
Smartphone Theft: ఫోన్ పోయిందా? మొదటి 15 నిమిషాల్లో ఈ పనులు చేయకపోతే డేటా, డబ్బు రెండూ పోవచ్చు
-
Cyber Crime Recovery Mela: సైబర్ క్రైమ్ రికవరీ మేళా.. 310 మంది బాధితులకు రూ.6 కోట్ల రికవరీ చెక్కులు..
-
Tollywood First Half Results : టాలీవుడ్ ఫస్ట్ హాఫ్.. అదరగొట్టిన చిరు.. ఆదుకున్న సమంత
-
NEET Paper Leak: నీట్ పేపర్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆందోళన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్!
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!