Off The Record : భూ కబ్జా ఆరోపణల పటంలో గెలిచేది ఎవరు..? తగ్గేది ఎవరు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిర్మల్ రాజకీయాలను భూకబ్జాల బాగోతం హీటెక్కిస్తోంది. భూ ఆక్రమణలు నిరూపిస్తానంటూ మాజీ మంత్రిపై తాజా ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణల పర్వం కొత్తకొత్త మలుపులు తిరుగుతోంది. ఇంతకీ భూకబ్జా ఆరోపణల పంతంలో నెగ్గేదెవరు? తగ్గేదెవరు? నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రస్తుతం కబ్జాల ముచ్చట కాకరేపుతోంది. ఎక్కడ విన్నా కబ్జాలు..దానిపై లోకల్ ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణలపై చర్చవినిపిస్తోంది. ఎంపీ ఎన్నికల కంటే ముందు రాజకీయంగా రచ్చకు దారితీస్తుండగా , కబ్జాల కథ తేల్చాలంటూ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పట్టుబడుతున్నారంటా…నిర్మల్ కు వచ్చిన ప్రతిసారి డీమార్ట్ స్థలం ప్రభుత్వం భూమి అంటూ ఆరోపించడమే కాకుండా దేవాదాయశాఖ కు చెందిన 8.32 కుంటల భూమిని ప్లాట్లుగా మార్చి విక్రయించేందుకు సిద్దం అయ్యారంటూ బీజేపీ ఎమ్మెల్యే బాంబ్ పేల్చారు. ఇదే కాదు డీ వన్ పట్టాల ఇష్యూ తోపాటు నిర్మల్ లో చెరువులు,కుంటలు,విలువైన సర్కార్ భూములను బీఆర్ఎస్ వాళ్లు, ఓ మాజీ మంత్రి ప్రధాన అనుచరులు కాజేశారనేది ఎమ్మెల్యే ప్రతిసారి చేస్తున్న ఆరోపణలే. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్మల్ కబ్జాలకు గురైందనేది ఆయన వాదన.
గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం మహేశ్వర్ రెడ్డి ఇలాంటి ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఎన్నికల సమయంలో అప్పుడు మంత్రిగా వున్న ఇంద్రకరణ్ రెడ్డి తాను కబ్జా చేసినట్టు నిరూపించాలనే సవాల్ విసిరారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇంద్రకరణ్ ఓటమి పాలుకాగా బీజేపి అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే గా గెలిచారు…ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కబ్జాల కథ తేల్చుతా…కబ్జాకోరుల ఆటకట్టిస్తా….అక్రమ నిర్మాణాల పై ఉక్కుపాదం మోపడమే కాదు బుల్డోజర్ ప్రయోగిస్తా అంటూ హెచ్చరిస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడంలేదని ఆయన వాపోతున్నారు. సోఫీనగర్ , గాజులపేట తోపాటు వెంకటాపూర్, అయ్యప్ప టెంపుల్ ప్రాంతాల్లో ప్రభుత్వ, దేవాదాయ భూముల విషయంలోనూ అధికారుల తీరు నిర్లక్ష్యంగా ఉన్నారంటూ ఫైర్ అవుతున్నారు. తాజాగా నిర్మల్ పట్టణం శాంతినగర్ లో కబ్జాకు గురైన FSCS రైతు సహకార సంఘం స్థలంలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు. ఇదొక్కటే తప్ప బీజేఎల్పీ లీడర్ ఇచ్చిన ఫిర్యాదులు, చేస్తున్న ఆరోపణలను యంత్రాంగం మాత్రం పట్టించుకోవడం లేదనేది బీజేపీ నేతల ఆరోపణ.
Also Read
- Annamalai: బీజేపీతో అన్నామలైకి ఎక్కడ చెడింది, కారణాలేంటి.?
- Twisha Sharma: కోర్టు హాల్లో ఘర్షణ.. అత్త గారు అరుపులు.. భర్త చెంపపై కొట్టిన ట్విషా శర్మ లాయర్.. ఏం జరిగిందంటే..!
- Amaravati Farmers: జగన్ను కలిసిన రాజధాని ప్రాంత రైతులు.. తమను వేధిస్తున్నారని ఆవేదన
- Annamalai: బీజేపీకి గుడ్బై చెప్పనున్న అన్నామలై.. సొంత పార్టీపై ఫోకస్
అటు మాజీ మంత్రి పార్టీ మార్పు విషయంలో హైదరాబాద్ కే పరిమితం అవుతుండగా…బీఆర్ఎస్ క్యాడర్ ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరిపోయింది..ఇక మాజీ మంత్రి హస్తం పార్టీలో చేరాలని ప్రయత్నాలు ముమ్మరం చేయగా…నిర్మల్ ఎమ్మెల్యే మాత్రం ఈపోరాటం తీవ్రతరం చేయడంపై ప్రెస్ మీట్ లతో శపథం చేస్తున్నారు. మొత్తానికి ఎవరి పంతం నెరవేరుతుందో…ఎవరి భూకబ్జా బాగోతాలు ఎవరు నిరూపిస్తారో కాలమే తేల్చాలని అంటున్నారు లోకల్ జనం.
తాజావార్తలు
-
Annamalai: బీజేపీతో అన్నామలైకి ఎక్కడ చెడింది, కారణాలేంటి.?
-
Twisha Sharma: కోర్టు హాల్లో ఘర్షణ.. అత్త గారు అరుపులు.. భర్త చెంపపై కొట్టిన ట్విషా శర్మ లాయర్.. ఏం జరిగిందంటే..!
-
Trump VS Netanyahu: ఫోన్ కాల్లో నెతన్యాహును బండబూతులు తిట్టిన ట్రంప్..! స్నేహితుడితో అమెరికా ప్రెసిడెంట్కు ఎక్కడ చెడింది?
-
MUFG Fund India: భారతీయ స్టార్టప్ సామ్రాజ్యంపై జపాన్ కన్ను.. రూ.2400 కోట్ల భారీ ఫండ్తో సరికొత్త విప్లవం!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
ట్రెండింగ్
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!