Off The Record : పడమరలో వైసీపీ సైడ్ ట్రాక్..కేడర్ ఉక్కిరిబిక్కిరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2019 ఎన్నికల్లో పడమరలో ఫ్యాన్ ఫుల్ స్పీడులో తిరిగింది! ఇప్పుడు ఒకటో నంబర్లో పెట్టినట్టుగా ఉంది! రెక్కలుగా ఉన్నవాళ్లంతా సైడయ్యారు! గాలిరాక కేడర్ ఉక్కిరిబిక్కిరవుతోంది! గ్రంధి రందితో పక్క చూపులు చూస్తున్నారని నియోజకవర్గంలో టాక్. ఆచంట లీడర్ ఏచెంత ఉన్నారో తెలియక అయోమయం! ఆళ్ల కాళీ కృష్ణ వెళ్లిపోయాక ఆ ప్లేస్ ఇంకా ఖాళీగానే ఉంది.
రాష్ట్ర రాజకీయాల్లో నరసాపురం పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లు చాలా కీలకమైనవి. ఇక్కడి ఓటర్లు ఎప్పుడూ వన్ సైడ్గా గెలుపును డిక్లేర్ చేస్తూ ఉంటారు. 2019 ఎన్నికల తర్వాత ఈ పార్లమెంటు పరిధిలో గెలిచిన వైసీపీ నాయకులతో పాటు నామినేటెడ్ పదవులు పొందిన నేతల సంఖ్య మిగతా పార్లమెంటు స్థానాలతో పోల్చుకుంటే చాలా ఎక్కువ. అలాంటి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ నేతలు ఇప్పుడు సైలెంటుగా ఉండటం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. మాజీ మంత్రులుగా ఉన్న ఆ నాయకులు వైసీపీలోనే కొనసాగుతారా లేక కండువా మార్చేస్తారా అనే చర్చ జరుగుతోందట. ఈ లిస్టులో భీమవరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రంధి శ్రీనివాస్ పేరు మొదటగా వినిపిస్తోందట. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై శ్రీనివాస్ సాధించిన విజయం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. కాలం కలిసిరాక 2024 ఆయన ఓడిపోయారు. కార్యక్రమాలకు మెల్లిగా దూరం జరిగారు. ఇటీవల అధినేత జగన్తో జరిగిన సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేదు. పైకి హెల్త్ బాలేదని చెబుతున్నా.. ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే ఆయన జెండా ఎత్తేలా ఉన్నారనే చర్చ మొదలయింది. 2019లో జనసేన అధినేతను ఓడించినా గుర్తింపు రాలేదని.. ఇక భవిష్యత్తులో ఇంకెక్కడ వస్తుందనే భావనలో ఆయన ఉన్నారట. పడే కష్టమేదో మరోపార్టీలో పడితే ఫ్యూచర్ మీద ఆశలైనా ఉంటాయన్న ఫీలింగులో కార్యకర్తలున్నారట. ఈ క్రమంలో ఇటీవల గ్రంధి సోదరులు సీఎం చంద్రబాబును కలిసి విజయవాడ వరద బాధితుల సాయం కోసం కోటి రూపాయల చెక్కును అందించారు. ఈ ఎపిసోడ్ కూడా ఆయన పార్టీ మార్పు చర్చకు ఆజ్యం పోసింది. ప్రస్తుతం భీమవరంలో ఏ రకంగా చూసిన తెలుగుదేశం పార్టీకి సరైన నాయకత్వం లేదు. ప్రస్తుతం జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఉన్నప్పటికీ.. గ్రంధి శ్రీనివాస్ టీడీపీలో చేరినా ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికైతే మౌనం పాటిస్తున్న గ్రంధి.. భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Also Read
- Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియల్లో "మాస్క్ మ్యాన్".. ఎవరనేది తెలిసింది
- Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
- Karnataka: ‘‘చిల్లర లేకుపోతే దిగిపో..’’ మంత్రికే షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
- Monsoon: రైతులకు గుడ్ న్యూస్.. జోరందుకోనున్న రుతుపవనాలు.. జూలై 18-25 మధ్య భారీ వర్ష సూచన
ఇక నరసాపురం పార్లమెంటు పరిధిలో వైసీపీ కార్యక్రమాలకు, అధినేత పెట్టే సమావేశాలకు దూరంగా ఉంటున్న మరో నేత చెరుకువాడ శ్రీరంగనాథ రాజు. ఆచంట నుంచి గెలిచిన ఈయన ఒకప్పుడు పార్టీలో కీలక నేత. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాగానే గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. పేదల కోసం సేకరించిన భూముల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో మంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చిందని చెబుతుంటారు. మినిస్టర్ పోస్టు పోవడంతో పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు అధినేత. కొంతకాలం తర్వాత ఆ పదవినుంచి కూడా ఆయన్ని తప్పించారు. అందుక్కారణం రాజుగారి వ్యవహార శైలే అంటారు లోకల్ జనం. నాయకులు ఎంతటిఎవరైనా తన దగ్గరికే రావాలనే యాటిట్యూడ్తో ఉంటారనే విమర్శలు రంగనాథరాజుపై ఉన్నాయి. ఆ గ్యాప్ అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. ప్రస్తుతం మాజీమంత్రి ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారని టాక్ నడుస్తోంది. ఇదిలా వుంటే పార్టీకి వీరవిధేయుడిగా ఉన్న మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అటు పదవులకు, ఇటు పార్టీకి రిజైన్ చేశారు. దాంతో అక్కడా అయోమయంగానే ఉందట పరిస్థితి.
ఇలా అనేక కారణాలతో పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ నాయకుల తీరు తలోదారి అన్నట్టు తయారయింది. 2024 ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్కసీటు కూడా జిల్లాలో గెలవకపోవడం కార్యకర్తలు నారాజ్ అయ్యారు. గోడు వెళ్లబోసుకోవడానికి కూడా స్థానిక నాయకులు అందుబాటులో లేరట. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఉండాల్సిన నేతలు కేడర్వైపు కన్నెత్తిచూడక పోవడంతో మెల్లిగా గ్రౌండ్ మారుతోందట. పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీకి మరింత నష్టం తప్పదనే అభిప్రాయం అక్కడి స్థానిక నేతల్లో వినిపిస్తోంది. మొత్తంగా రాజకీయంగా కీలకంగా నిలిచే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ కీలక నేతలు సైలెంట్ కావడంతో.. ఆ పార్టీ పెద్దలు ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకుంటారో చూడాలి.
- Tags
- ntv
- off the record
- OTR
- YSRCP
తాజావార్తలు
-
Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియల్లో “మాస్క్ మ్యాన్”.. ఎవరనేది తెలిసింది
-
Jagadish Reddy: సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి కౌంటర్
-
Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
-
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే డ్రీమ్ రోల్ ఇదేనట.. రాజమౌళి పేరు చెప్పి షాకిచ్చిన హీరోయిన్!
-
Karnataka: ‘‘చిల్లర లేకుపోతే దిగిపో..’’ మంత్రికే షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..