Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Over Congress Brs And Bjp

Off The Record : అటవీ అధికారులకు పొలిటికల్ సంకటాలు

Published Date :July 15, 2025 , 9:34 pm
By Gogikar Sai Krishna
Off The Record : అటవీ అధికారులకు పొలిటికల్ సంకటాలు
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

అక్కడ రాజకీయ నాయకులు అంతా తెలిసే… కావాలని కెలుకుతున్నారా? ఓట్‌ బ్యాంక్‌ పాలిటిక్స్‌లో అటవీ శాఖ బకరా అవుతోందా? ఆ పార్టీ… ఈ పార్టీ… అని లేదు, ఏ పార్టీ అయినా సరే… అదే తీరా? అధికారుల్ని జనంలో తిట్టేసి తాము హీరోలైపోదామని రాజకీయ నేతలు అనుకుంటున్నారా? పాత వ్యవహారాలకు కొత్త హంగులు అద్దుతున్న ఆ నాయకులు ఎవరు? ఏంటా ఫారెస్ట్‌ పాలిటిక్స్‌?ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల… పార్టీ ఏదైనా సరే… రాజకీయ నేత ఎవరైనా సరే… ఛాన్స్‌ దొరికితే చాలు అటవీశాఖను టార్గెట్ చేస్తున్నారు. గ్రామ, మండలం లేదా జిల్లాలో ఏ స్థాయి సమావేశమైనా అటవీ అధికారులను తిట్టిపోస్తున్నారట. కారణం మాత్రం పోడు పేరు చెబుతున్నారు. అడవుల్లో ఇసుకంటారు. ఎంక్రోచ్‌మెంట్స్‌ కాకుండా చూసే అధికారులు వెళ్తే…మందిలోనే తిట్టేస్తున్నారు లేదా వాదిస్తున్నారట. కొందరైతే వార్నింగ్‌లదాకా వెళ్తున్నట్టు సమాచారం. ఇలాంటి పరిస్థితులుగొడవలు, దాడులకు దారి తీస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. వారు ఏది చేసినా దానికి పెట్టే మాత్రం పోడు వ్యవసాయం. ఆ భూములకు పట్టాలు కావాలనేది వారి డిమాండ్. వాస్తవానికి పోడు వ్యవసాయం అనేది ఏజెన్సీ ప్రాంతాల్లో నివాసం ఉండే ఆదివాసీలకు మాత్రమే హక్కు. ట్రైబల్స్ భూములు సాగు చేసుకుంటే వాళ్లకు చట్ట ప్రకారం ప్రభుత్వమే హక్కులు కల్పిస్తుంది.

2006 అటవీహక్కుల చట్టం ప్రకారం 2005 డిసెంబర్ 31కి ముందు సాగులో ఉండాలి. అలాంటి వారు మాత్రమే హక్కుదారులు. అలా లక్షల ఎకరాలకు హక్కులు కల్పించారు. కానీ ప్రస్తుతం ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరం భీం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పోడు భూముల పేరుతో రాజకీయ నాయకులు అటవీశాఖ అధికారులను మందిలో వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపుతోంది. రూల్ ప్రకారం ఈ జిల్లాల్లోని చాలా ఏరియాల్లో నాన్ ట్రైబల్స్‌కు ఏహక్కులు ఉండవు. వారికి భూమి కాదు కదా… కనీసం ఇంటి నిర్మాణానికి కూడా అనుమతులివ్వరు. ఒక వేళ బీసీ లేదా ఎస్సీలు ఎవరైనా ఉంటే… మూడు నాలుగు తరాలకు సంబంధించిన ఆధారాలు చూపించాలి. అవేవీ లేని వారికి ఎలాంటి హక్కులు ఉండవు. ఇదంతా తెలిసి కూడా…. నాయకులు అధికారుల మీద చిందులేయడం ఓట్‌ బ్యాంక్‌ రాజకీయం కాక మరేంటన్న చర్చ నడుస్తోంది జిల్లాలో. తాజాగా ఓ ఎమ్మెల్యే తాను చెప్పినట్టు చేస్తే సరి… లేదంటే బదిలీ చేయిస్తానంటూ అందరి ముందు ఫారెస్ట్ ఆఫీసర్‌ని హెచ్చరించారట. మరో ఎమ్మెల్యే అయితే… ఎక్కడ మీటింగ్ జరిగినా తన ప్రతాపం అటవీశాఖ అధికారుల మీద చూపెడతారనే టాక్ నడుస్తోంది.

Also Read

  • Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
  • TVK Vijay: విజయ్‌కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్‌లపై వామపక్షాలు గుర్రు!
  • CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
  • US-Iran Talks: హార్ముజ్‌పై గుడ్‌న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
Add as a preferred
source on google

వాస్తవానికి షెడ్యూల్డ్‌ ఏరియాలో గిరిజనేతరులు హక్కులు కావాలన్నారంటే.. అది చట్ట విరుద్ధం. ఇప్పుడు మాత్రం ఎలాంటి పట్టాలిచ్చే అస్కారం ఉండదు. అటవీ భూములు కబ్జా చేస్తే అధికారులు చర్యలు తీసుకోవడం తప్పుకాదు. ఇదంతా తెలిసి కూడా రాజకీయ నాయకులు కొత్త రాగం అందుకుంటున్నారట. పోడు అనగానే ఆదివాసీలనే అభిప్రాయం అందరిలో వస్తుంది..కానీ అది పోడు కాదు కబ్జా అంటున్నారు అధికారులు.. బీఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీ ఏదైనా అందరి అస్త్రం మాత్రం పోడే. కబ్జా అయిన అటవీ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి సంబంధిత శాఖ అధికారులు వెళితే రాజకీయ నేతలే ముందు అడ్డుపడుతున్నారనేది వాస్తవం. అలా ఎందుకు చేస్తున్నారంటే… అక్కడే ఓట్ల రాజకీయం ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరుల ఓట్ల శాతం పెరుగుతోంది. అందుకు అనుగుణంగానే…. గ్రామాల్లో అటవీభూముల కబ్జాలు పెరిగాయనేది అటవీశాఖ అధికారుల లెక్కలు. కొన్ని చోట్ల మొక్కలు నాటేందుకు అటవీ సిబ్బంది వెళ్తే… తాము పోడు చేసుకుంటున్నామని అడ్డుకోవడం, నిరసనలకు దిగడం, లేదా నేతల దగ్గరికెళ్ళడం పరిపాటిగా మారింది.

ఇదే అటవీ అధికారులకు ఇబ్బందిగా మారుతోందట. గ్రామస్థాయి లీడర్ నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం దీనికి మినహాయింపు కాదంటున్నారు. సెన్సిటివ్‌ ఇష్యూ కాబట్టి పోడు అంటే అంతా తమకే జై అంటారనేది నేతల లెక్కగా తెలుస్తోంది. టైగర్ జోన్ పరిధిలో ఓవర్గం వద్ద ఒకే మండలంలోసుమారు 20 వేల ఎకరాల అటవీభూములు కబ్జాలో ఉన్నాయట. మరో రేంజ్‌ పరిధిలో 5 వేల ఎకరాలు నాన్ ట్రైబల్స్ చేతుల్లోకి వెళ్ళాయి.ఇలా ఉమ్మడి జిల్లాలో గిరిజనేతరుల చేతుల్లో సుమారు 70 నుంచి 80వేల ఎకరాల వరకు ఉన్నట్లుగా అధికారుల లెక్కలు చెబుతున్నాయి. బడాబాబులు అడవులను కబ్జాలు చేసిన చరిత్ర ఉమ్మడి జిల్లాలో ఎలాగూ ఉంది. అయితే వీటన్నింటిని అధికారులు స్వాధీనం చేసుకోవాలని చూస్తే మాత్రం రాజకీయ స్వార్థంతో కొంతమంది నాయకులే అడ్డుతగుతున్నారని చెబుతున్నారు. మొత్తంగా ఓట్‌ బ్యాంక్‌ పాలిటిక్స్‌ అటవీ భూముల పాటిట శాపం అయ్యాయన్నది విస్తృతాభిప్రాయం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • BRS
  • congress
  • NTV Telugu
  • off the record

తాజావార్తలు

  • Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..

  • TVK Vijay: విజయ్‌కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్‌లపై వామపక్షాలు గుర్రు!

  • CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

  • US-Iran Talks: హార్ముజ్‌పై గుడ్‌న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!

  • Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions