Off The Record: అక్కడ తొక్కుడు పాలిటిక్స్ నడుస్తున్నాయా..? పాత నాయకుల్ని కొత్త లీడర్స్ తొక్కేస్తున్నారా?
- సీఎం కార్యక్రమంలో ఎక్కడా కనిపించని ఘన్పూర్ ఇందిర..
- ఉమ్మడి జిల్లా నేతలంతా వచ్చినా.. లోకల్ లీడర్ ఆబ్సెంట్..
- ఎన్నికల్లో కడియం మీద పోటీ చేసి ఓడిపోయిన ఇందిర..
- బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరి..
- మొదట్నుంచి కలవలేకపోతున్న రెండు వర్గాలు..
- తనకిచ్చిన హామీలేవీ నెరవేరలేదని ఇందిరకు అసహనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి తొలిసారిగా వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన గ్రాండ్ సక్సెస్ అయింది. దాదాపు 800కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయి. సభకు ఊహించినదానికంటే ఎక్కువ సంఖ్యలో జనం రావడంతో ఆల్ హ్యాపీస్ అనుకున్నారు కాంగ్రెస్ నాయకులు. అలా అనుకుంటుండగానే… వాళ్ళకో లోటు కనిపించిందట. నియోజకవర్గ కాంగ్రెస్లో కీలక నాయకురాలు ఇందిర ఈ కార్యక్రమలో ఎక్కడా ఎందుకు కనిపింలేదన్న చర్చ మొదలైంది పార్టీ వర్గాల్లో. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 9 మంది ఎమ్మెల్యేలతో పాటు.. ఎమ్మెల్సీలు, పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కానీ… గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘనపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం మీదే పోటీ చేసిన ఇందిర మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీనిమీద రకరకాల విశ్లేషణలు నడుస్తున్నాయి.
ఇక్కడ కడియం, ఇందిర వర్గాల మధ్య విభేదాలు ఏ మాత్రం పోలేదని ఈ మీటింగ్తో అర్దమవుతోందని అంటున్నారు కొందరు. మొదట్నుంచి పార్టీలో ఉన్న ఇందిర వర్గం పార్టీ మారిన వచ్చిన కడియం అండ్కో కలవలేకపోతోందట. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి పార్లమెంట్ ఎన్నికల నాటికి కాంగ్రెస్లో చేరిపోయారు. ఇక అప్పటినుంచి వర్గ విభేదాలు మరింత పెరిగిపోయాయట. కడియం శ్రీహరి చేరిక సమయంలో ఇందిరకి కాంగ్రెస్ అధిష్టానం రక రకాల హామీలు ఇచ్చిందట. నామినేటెడ్ పదవులతో పాటు ఇందిరమ్మ ఇళ్ల కమిటీల్లో ప్రాధాన్యత ఇస్తామన్న హామీలేవి చాలా రోజులుగా అమలు కావడం లేదని, దీనికి తోడు నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు సంబంధించి కనీస సమాచారం కూడా ఉండటం లేదని అసంతృప్తిగా ఉన్నారట ఆమె. అలాగే తనకు కార్పొరేషన్ ఛైర్మన్ ఇస్తామన్న హామీ కూడా అమలవలేదన్న బాధ ఉందట ఇందిరకు. చివరికి సీఎం సభ నిర్వహణకు సంబంధించి కూడా తనకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదన్నది ఆమె అటెండ్ అవకపోవడానికి మరో కారణంగా తెలుస్తోంది. ఉద్దేశ్యపూర్వకంగానే మొక్కుబడి సమాచారం ఇచ్చి… సభకు రాకుండా కడియం ఎత్తుగడ వేశారన్నది లోకల్గా ఉన్న ఇంకో వెర్షన్. సీఎం సభకి ఒకరోజు ముందు ఇందిర తన ముఖ్య అనుచరులతో మంతనాలు జరిపి… డుమ్మా నిర్ణయం తీసుకున్నారట. అలా చేయడం ద్వారా శ్రీహరి ఎత్తుగడల్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాలనుకున్నట్టు తెలిసింది. సుమారు 20 రోజుల నుంచి ఈ సభ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు కడియం. కనీసం సీఎంని ఆహ్వానించడానికి వెళ్ళేటప్పుడు కూడా ఏ దశలోనూ తనను పట్టించుకోలేదని ఆ వర్గం అసహనంగా ఉన్నట్టు తెలిసింది.
Also Read
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
తాను సహకరిస్తేనే… కడియంను కాంగ్రెస్ లోకి తీసుకున్నారని, అలాంటిది ఇప్పుడు తన పేరు పలకడానికి కూడా ఆయనకు అంత నామోషీ ఎందుకని సన్నిహితులతో ఘాటుగానే అంటున్నారట ఇందిర. పదేళ్ళ నుంచి కష్ట కాలంలో పార్టీకి అండగా ఉన్న వాళ్ళని వదిలేసి… ఇప్పుడు కడియం శ్రీహరితో పార్టీ మారి వచ్చినవాళ్శకు నామినేటెడ్ పోస్ట్లు ఇస్తున్నారని, ఇప్పుడు సీఎం సభ విషయంలోనూ అవమానించరని, ఈ తొక్కేసే పాలిటిక్స్ పార్టీకి కూడా అంత మంచిది కాదని అంటోందట పాత కాంగ్రెస్ వర్గం. ఈ పాత కొత్త వివాదాన్ని పార్టీ పెద్దలు ఎలా పరిష్కరిస్తారో చూడాలి మరి.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!