Off The Record: రాప్తాడు సిద్ధం సభతో ఉలిక్కిపడ్డ టీడీపీ..! వార్నింగ్ బెల్గా మారిందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: టీడీపీలో ఇప్పుడు వైసీపీ సిద్ధం సభల గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. భీమిలిలో జరిగిన తొలి సభను లైట్గానే తీసుకుంది తెలుగుదేశం. ఆ తర్వాత దెందులూరులో జరిగిన రెండో మీటింగ్ను చూసి.. ఏముందబ్బా…. సభ చప్పగానే ఉందని భావించారట టీడీపీ నేతలు. కానీ రాప్తాడు సభతో ఒక్కసారిగా ఉలిక్కి పడిందట ఆ పార్టీ. పెద్ద ఎత్తున జనం తరలి రావడంతో పాటు.. ఆ సభకు వచ్చిన జనంలో రెస్పాన్స్ షాకింగ్గానే ఉందన్న చర్చ టీడీపీలో జరుగుతోందట. రాయలసీమలో కూడా టీడీపీ చాలా వరకు బలపడిందని.. వైసీపీ కడప లాంటి జిల్లాల్లో కూడా బలహీన పడిందనే భావనలో ఇన్నాళ్లూ ఉన్నారు సైకిల్ పార్టీ నేతలు. కానీ రాప్తాడు సిద్ధం సభతో ఓ విధంగా టీడీపీ నేతల కళ్లు బైర్లు కమ్మాయన్న చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో. ఎన్నికలకు ముందు సీఎం జగన్ సభలకు ఈ స్థాయిలో జనం రావడం ఆ పార్టీకి బాగా కలిసి వచ్చే అంశమనేది టీడీపీలో జరుగుతున్న చర్చ. చంద్రబాబు నిర్వహిస్తున్న రా.. కదలి రా.. సభలకు కూడా జనం బాగానే వస్తున్నారని ఇన్నాళ్లూ సంబర పడుతోంది తెలుగుదేశం. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జరుగుతున్న రా కదలి రా సభలకు రెస్పాన్స్ బాగుందనే సంతోషంగా ఉన్న టీడీపీ శ్రేణులకు రాప్తాడు సిద్దం సభ షాక్ ఇచ్చినట్టుగా ఉందట.
ఈ క్రమంలో వైసీపీ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే వైసీపీని టార్గెట్ చేసుకునే సందర్భాల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం టీడీపీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. దీంతో అధికార పార్టీని ఎదుర్కొనే విషయంలో వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాయట టీడీపీ శ్రేణులు. వైసీపీ ఓ పక్కన అభ్యర్థులకు క్లారిటీ ఇచ్చేసి.. సిద్దం సభలతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది. టీడీపీ ఇంకా అభ్యర్థుల ఖరారు విషయంలో వెనకబడినట్టే కన్పిస్తోంది. అభ్యర్థులను అధికారికంగా ప్రకటించకున్నా.. చంద్రబాబు లోలోపలే వ్యవహారాన్ని చక్కబెడుతున్నా.. క్షేత్ర స్థాయిలో గందరగోళం మాత్రం పార్టీ కేడర్ని ఇబ్బంది పెడుతూనే ఉందట. ఇప్పటికీ అభ్యర్థుల విషయంలో క్లారిటీ రాకపోవడం.. అటు జనసేనతో సీట్ల సర్దుబాటు ఇంకా ఓ కొలిక్కి రాలేదనే ప్రచారంతో కేడర్లో విపరీతమైన నిరాశ నిస్పృహలు పెరుగుతున్నాయన్న ఫీడ్ బ్యాక్ పార్టీ కార్యాలయానికి వస్తోందట. అయినా అధినాయకత్వం ఏం చేయలేని పరిస్థితి. బీజేపీతో పొత్తుల వ్యవహరం కొలిక్కి రాకపోవడంతో ఏం జరగబోతోందనే విషయం అర్థంగాక టీడీపీ కేడరులో ఆందోళన వ్యక్తమవుతోందంటున్నారు.
Also Read
- 5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- 8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
- IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
- ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!
మరోవైపు బీజేపీతో పొత్తు వల్ల నష్టమే తప్ప.. లాభం లేదనే చర్చ పార్టీలోని లీడర్లను కుదేలయ్యేలా చేస్తోంది. ముస్లిం ప్రభావం ఎక్కువగా ఉన్న సెగ్మెంట్లు.. రాష్ట్ర వ్యాప్తంగా 60కు పైగా ఉంటాయని.. వాటిల్లో చాలా ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తుందని అంటున్నారు. బీజేపీతో పొత్తు ఉంటుందనే ప్రచారం జోరుగా సాగుతున్న క్రమంలో టీడీపీ మీదున్న పాజిటివ్ ఇంపాక్ట్ నెమ్మదిగా తగ్గుతోందన్న అభిప్రాయం ఎక్కువ అవుతోంది. ఈ క్రమంలో సిద్దం లాంటి సభలతో వైసీపీ దూసుకెళ్లే ప్రయత్నం చేయడం.. దానికి ప్రజల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుండడంతో రాజకీయం ఎటు వైపు మళ్లుతుందో అర్థం కాని పరిస్థితి ఎక్కువ మంది టీడీపీ నేతల్ని కంగారు పెడుతోందట. ఈ క్రమంలో వీలైనంత త్వరగా అన్ని వ్యవహారాలను చక్కబెట్టుకోవాల్సిన అవసరం ఉందని, లేదంటే ఘోరంగా దెబ్బతింటామన్న సూచనలు తెలుగుదేశం హై కమాండ్కు అందుతున్నాయట. పాజిటివ్ వైబ్స్ వస్తున్న టైంలో నాన్చుడు ధోరణితో నిర్ణయాలు తీసుకోలేకపోతే మూల్యం గట్టిగానే చెల్లించుకోవాల్సి వస్తుందన్న వార్నింగ్లను పార్టీ పెద్దలు ఏ మేరకు చెవికెక్కించుకుంటారో చూడాలంటున్నారు టీడీపీ నాయకులు.
తాజావార్తలు
-
Gold and Silver Prices Today: రక్షాబంధన్ వేళ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
-
Dhananjaya de Silva: అదే మాకు పెద్ద తలనొప్పి.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kangana Ranaut: కృతి వివాదం.. కంగనా పాత రక్షాబంధన్ పోస్ట్ వైరల్.. నెటిజన్ల నుంచి ఊహించని ప్రశ్నలు!
-
R Praggnanandhaa: చరిత్ర సృష్టించిన ఆర్. ప్రజ్ఞానంద.. గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు
-
Lunar Eclipse 2026: ప్రారంభమైన చంద్రగ్రహణం (వీడియో).. సూతక కాలంపై పూర్తి వివరాలు?
ట్రెండింగ్
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!