Off The Record: సంక్రాంతి నుంచి మైలవరంలో జోగి రమేష్ రాజకీయం
- వైసీపీ ప్రభుత్వ హయాంలో అటు చంద్రబాబు
- ఇటు పవన్ కళ్యాణ్పై హద్దులు దాటి మాట్లాడారు
- రాజీవ్ మీద కూడా అగ్రిగోల్డ్ భూముల కేసులు
- దూకుడును పక్కన పెట్టారంటోన్న ఆయన వర్గం
- మళ్లీ యాక్టివ్ అవ్వాలని డిసైడయిన జోగి రమేష్
- వైఎస్సార్ శిష్యుడినని.. వైసీపీలోనే ఉంటానని క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ప్రతి ఎన్నికల్లో నియోజకవర్గం మారుతున్న…ఆ మాజీ మంత్రి ఈ సారి ముందుగానే ఫిక్సయ్యారా ? వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచి నియోజకవర్గంలో పాలిటిక్స్ చేయాలని నిర్ణయించుకున్నారా ? ఓడిన నియోజకవర్గంలోనే…గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్నారా ? సంక్రాంతి పండుగ తర్వాత…పార్టీ కార్యాలయం తెరిచేందుకు రెడీ అయిపోయారా ? ఇంతకీ ఎవరా మాజీ మంత్రి…ఏంటా నియోజకవర్గం. ?
జోగి రమేష్…వైసీపీ హయాంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏకైక మంత్రిగా చక్రం తిప్పారు. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన…రెండుసార్లు గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అటు చంద్రబాబు…ఇటు పవన్ కళ్యాణ్లను హద్దులు దాటి మరీ అనరాని మాటలు అన్నారు. మంత్రి అవకముందే చంద్రబాబు ఇంటిపై తన అనుచర వర్గంతో దాడికి యత్నించారు. కూటమి అధికారంలోకి రాగానే జోగిపైనే కాకుండా జోగి కుమారుడు రాజీవ్ మీద కూడా అగ్రిగోల్డ్ భూముల కేసులు నమోదయ్యాయి. జోగి కొన్ని రోజులు అజ్జాతంలోకి వెళ్ళగా…ఆయన కుమారుడు జైలుకి వెళ్ళి వచ్చారు. తాజా ఘటనలతో జోగి రమేశ్… తన సహజశైలిగా ఉన్న దూకుడును పక్కన పెట్టినట్టు ఆయన వర్గమే చెబుతోంది. అయితే ఇప్పుడు జోగి రమేష్ మళ్ళీ యాక్టివ్ అవ్వాలని డిసైడయ్యారట. ప్రధానంగా జోగి రమేష్ టీడీపీ లేదా జనసేనలోకి వెళ్తారని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. దీంతో దీన్ని ఖండించటంతోపాటు పూర్తి స్థాయిలో తన ఉద్దేశాలను కూడా పార్టీ క్యాడర్కు చెప్పాలని నిర్ణయించుకున్నారట. రెండు రోజుల క్రితం మైలవరంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఇందులో పార్టీ మార్పు ప్రచారంపై క్లారిటీ ఇచ్చేశారు. తాను వైఎస్సార్ శిష్యుడినని వైసీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. వచ్చే సంక్రాంతి నుంచి నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం ప్రారంభిస్తానని…అన్ని విధాలుగా సిద్ధంగా ఉంటానని క్యాడర్కు భరోసా ఇచ్చారట. ఇకపై తాను మైలవరం నుంచే రాజకీయాలు చేస్తానని, వైసీపీలో ఉంటానని జోగి క్లారిటీగా చెప్పటంతో మైలవరం నియోజక వర్గ రాజకీయాలు వేడెక్కాయట.
Also Read
- AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
- Kailash Mansarovar Yatra 1981: కైలాసానికి దారి మూసేసిన చైనా.. తెరిపించిన సుబ్రహ్మణ్యస్వామి.. 1981 నాటి ఆసక్తికర కథ..
- CM Chandrababu: ఉద్యోగుల సమస్యలపై ఫోకస్.. నేడు 11 సంఘాలతో సీఎం భేటీ.. పీఆర్సీ, ఐఆర్, డీఏపై కీలక చర్చ..
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై పిల్ కొట్టేయండి.. హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్
జోగి రమేష్ నాలుగు సార్లు పోటీ చేసి మూడు నియోజకవర్గాల నుంచి పోటీకి దిగారు. అందులో పెడన నుంచి రెండుసార్లు, మైలవరం నుంచి ఒకసారి, పెనమలూరు నుంచి మరోసారి పోటీ చేశారు. జోగి సొంత నియోజకవర్గం మైలవరం. కానీ అక్కడ నుంచి 2014లో పోటీ చేసి ఓడి పోయిన ఆయన…2019లో పెడన వెళ్లారు. అక్కడ గెలిచి మంత్రి కూడా అయ్యారు. ఇదే సమయంలో ఇక్కడ నుంచి వైసీపీ తరపున వసంత కృష్ణప్రసాద్ పోటీ చేసి గెలిచారు. ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. వసంత, జోగిలు చెరో నియోజకవర్గం నుంచి గెలిచారు. అయితే మైలవరంలో తనను పని చేయనీయకుండా జోగి ఆయన వర్గం ఇబ్బంది పెడుతోందని…వసంత పార్టీకి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో టీడీపీలో చేరి మళ్ళీ మైలవరం నుంచి గెలిచారు. అప్పట్లో కూడా ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇప్పుడు వైసీపీ అధిష్టానం కూడా జోగిని మైలవరం నియోజకవర్గం ఇన్చార్జిగా నియమించటం…అక్కడ నుంచి పోటీకి సై అని క్లారిటీ ఇవ్వటంతో పాత శత్రువుల మధ్య పోరు మళ్ళీ మొదలైనట్టైంది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి వసంత, జోగి ప్రత్యర్థులుగా మారనున్నారు. ఇప్పటికే పలుమార్లు జోగి తీరును వసంత కృష్ణప్రసాద్ ఎండకట్టారు. తాజా సమావేశంలో వసంత టార్గెట్ గా జోగి మాట్లాడారు. దీంతో ఇద్దరి మధ్య పోరు మొదలైందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోందట. గతంలో వసంత గెలుపుకు సహకరించిన జోగి…ఆ తర్వాత శత్రువులుగా మారిపోయారు. ఇప్పుడు రెండు వేర్వేలు పార్టీల్లో ఉన్నారు. రానున్న రోజుల్లో వసంత వర్సెస్ జోగి వ్యవహారం ఎలాంటి రాజకీయ రచ్చ రేపుతాయో చూడాలి మరి.
తాజావార్తలు
-
Irumudi success: పాన్ ఇండియా మోజుకు ‘ఇరుముడి’ నేర్పిన పాఠం ఇదేనా ?
-
New World Map: వరల్డ్ మ్యాప్ లో భారీ మార్పు.. దేశాల అసలు పరిమాణాలు చూపించే కొత్త మ్యాప్కు UN ఆమోదం
-
Oppo A7 Pro: ఒప్పో A7 Pro లాంచ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్, IP69K రేటింగ్!
-
AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
-
KAAKA: మెగా అభిమానులకు మాస్ ట్రీట్.. సంక్రాంతి రేసులోనే చిరు! క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!