Off The Record: చంద్రబాబు అరెస్ట్పై ఏపీ బీజేపీ స్టాండ్ ఏంటి..? సడన్గా మౌన వ్రతం ఎందుకు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. నాలుగు రోజుల నుంచి హై డ్రామా నడుస్తూనే ఉంది. అరెస్ట్, అనంతర పరిణామాలపై ఏపీ విపక్షాలు స్పందిస్తున్నాయి. జనసేన, లెఫ్ట్ పార్టీలు చంద్రబాబు అరెస్ట్ని ఖండించాయి. కానీ… రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు దీని మీదే ఆసక్తికర చర్చ జరుగుతోంది. నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన వెంటనే…. పార్టీ స్టాండ్ తీసుకున్నాకే స్పందించాలని, అప్పటి వరకు ఏం మాట్లాడవద్దని శ్రేణులకు వాట్సాప్ గ్రూపులో సందేశాలు పంపారు అధ్యక్షురాలు పురంధేశ్వరి. తర్వాత కాసేపటికే… అరెస్ట్ చేసిన విధానం సరైంది కాదంటూ రియాక్ట్ అయ్యారామె. కానీ… దానికి కొనసాగింపు మాత్రం లేదు. పురంధేశ్వరి వైపు నుంచి ఆ ఒక్క ప్రకటన తప్ప వేరే ఏ రియాక్షన్ లేదు. రిమాండ్కు పంపినా.. పురంధేశ్వరే కాదు..ఏపీ బీజేపీ నుంచి ఒక్కరు కూడా స్పందించలేదు. ఒకే ఒక్క స్టేట్మెంట్ ఇచ్చి పురంధేశ్వరి సైతం సైలెంట్ మోడ్లోకి వెళ్లడం వెనక ఏం జరిగి ఉంటుందన్న చర్చ మొదలైంది. పార్టీ అధిష్టానమే ఆమెను తగ్గమందా? లేక మరే కారణం ఏదైనా ఉందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. పురంధేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జగన్ ప్రభుత్వం మీద.. వైసీపీ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.
పవర్, లిక్కర్, శాండ్, ల్యాండ్ వంటి అంశాల్లో ఒకింత గట్టిగానే రియాక్ట్ అయ్యారు బీజేపీ నేతలు. ఇటీవల బీజేపీ చేస్తున్న విమర్శల్లో చాలా వరకు టీడీపీ తరహా విమర్శలే ఉండడంతో ప్రత్యర్థి వైసీపీకి కూడా బీజేపీ.. మరీ ముఖ్యంగా పురంధేశ్వరి టార్గెట్గా మారారు. మరిది చంద్రబాబు బాటలోనే వదిన పురంధేశ్వరి నడుచుకుంటున్నారంటూ విమర్శలు కూడా చేశారు వైసీపీ నేతలు. ఈ పరిస్థితుల్లో టీడీపీ-బీజేపీ మధ్య కూడా గ్యాప్ నెమ్మదిగా తగ్గుతోందని అందరూ అనుకున్నారు. దీనికి తగ్గట్టే చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానాన్ని కూడా తప్పు పట్టారు పురంధేశ్వరి. కానీ చంద్రబాబును రిమాండ్కు పంపిన దగ్గర్నుంచి కనీసం మాట్లాడలేదు. పురంధేశ్వరే కాదు.. ఏపీ బీజేపీ నేతలెవ్వరూ మాట్లాడలేదు. ఓ వైపు తెలంగాణ బీజేపీ నేతలు ఒక్కొక్కరు మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఆంధ్రలో జరుగుతున్న పరిణామాలపై ఇక్కడి నేతలు మాట్లాడకపోవడం ఏంటన్న ప్రశ్నకు సమాధానం వెదుకుతున్నారు పొలిటికల్ పండిట్స్. ఇప్పటికే చంద్రబాబుకు వంతపాడుతూ.. ఆయనకు సహకరించేందుకు పురంధేశ్వరి శక్తి వంచన లేకుండా పని చేస్తున్నారని వైసీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.
Also Read
అలాగే ఏపీ బీజేపీ అధ్యక్షురాలి మీద టీడీపీ అనుకూలంగా ఉన్నారనే ఫిర్యాదులు అధినాయకత్వానికి వెళ్లినట్టు సమాచారం. కారణాలేమైనా.. రిమాండ్ విధించిన తర్వాత మాత్రం పురంధేశ్వరి సైలెంట్ అయిపోయారు. ఈ క్రమంలో తనపై మరింతగా టీడీపీ ముద్ర పడకూడదనే భావనతో ముందు జాగ్రత్తగానే ఆమె కామ్గా ఉన్నారనేది ప్రస్తుతం పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఇదే సందర్భంలో మరో చర్చా ఉంది. ఈ ఎపిసోడ్కు సంబంధించి ఏపీ బీజేపీ నేతలు కానీ.. పురంధేశ్వరి కానీ సైలెంటుగా ఉండడానికి కారణం ఢిల్లీ పెద్దలే అంటున్నారు. బీజేపీ ఢిల్లీ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు చంద్రబాబు రిమాండ్ విషయంలో పురంధేశ్వరి సైలెంట్ అయ్యారని అంటున్నారు. అయితే… పార్టీ తెలంగాణ నేతలకు లేని ఆదేశాలు ఏపీ లీడర్స్కు మాత్రమే ఎలా ఉంటాయన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. మొత్తం మీద చంద్రబాబు ఎపిసోడ్లో బీజేపీ మౌనంపై రాజకీయవర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోంది.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!