Odisha Flight Crash: ఒడిశాలోని రూర్కెలా నుంచి భువనేశ్వర్కు వెళ్తున్న తొమ్మిది సీట్ల చార్టర్డ్ విమానం శనివారం మధ్యాహ్నం కూలిపోయింది. ఇండియావన్ ఎయిర్ యాజమాన్యంలోని ఈ విమానం రూర్కెలా నుంచి టేకాఫ్ అయి 17 కిలోమీటర్ల తర్వాత కూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ ఈ ప్రమాదంలో పైలట్ సహా తొమ్మిది మంది గాయపడ్డారు. వారిని వెంటనే స్థానికులు సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతానికి ఈ ప్రమాదానికి గల కారణం తెలియరాలేదు.
READ ALSO: Panjiri Laddu: ప్రసవం తర్వాత బాలింతల శరీరం త్వరగా కోలుకోవాలంటే ఈ ఒక్క లడ్డూ చాలు..
రూర్కెలా నుంచి దాదాపు 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో విమానం కూలిపోయిందని స్థానికులు తెలిపారు. ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే, స్థానిక అధికారులు, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని, ప్రయాణికులందరినీ సమీపంలోని ఆస్పత్రికి స్థానికుల సహాయంతో తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విమానంలో కెప్టెన్ నవీన్ కడంగా, కెప్టెన్ తరుణ్ శ్రీవాస్తవతో సహా నలుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది కూలిపోయిన విమానంలో ఉన్నారు. ప్రమాద స్థలం నుంచి అందరినీ సురక్షితంగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.
READ ALSO: The Raja Saab: “ది రాజాసాబ్” సినిమాకు మరో ఎదురుదెబ్బ.. 24 గంటల్లోనే ఆన్లైన్లో HD ప్రింట్