Team India: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ జట్టు ఈరోజు ప్రకటన.. అతనికి ఛాన్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎనిమిదోసారి ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకున్న టీమిండియా ఆటగాళ్లు తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. వచ్చే నెలలో ప్రారంభమయ్యే వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు.. టీమిండియా సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభమయ్యే ఈ వన్డే సిరీస్కు జట్టును ఈరోజు రాత్రి 8:30 గంటలకు కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రకటించే అవకాశం ఉంది.
Read Also: Viral Video: పోతావురోయ్.. మొసలితోనేనా నీ ఆటలు..!
Also Read
- Vaibhav Sooryavanshi: సచిన్ కలలు చూపించాడు.. ధోనీ నమ్మకం నేర్పించాడు.. కోహ్లీ గర్జించాడు.. ఇక వైభవ్ సూర్యవంశీ యుగం ప్రారంభమైందా..?
- ఒకే కారు.. మూడు ఆప్షన్లు.. పెట్రోల్, సీఎన్జీ, ఈవీతో సరికొత్త Tata Tiago రిలీజ్.. ధర రూ. 5 లక్షల లోపే..
- US-Iran: ట్రంప్ కఠిన వైఖరితో పాక్ ప్లాన్ బోల్తా.. అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ఫెయిల్..
- Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
వన్డే ప్రపంచకప్కు ముందు జరిగే ఈ సిరీస్లో కొంతమంది కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అందరి చూపు అక్షర్ పటేల్, శ్రేయాస్ అయ్యర్ల ఫిట్నెస్పైనే ఉంది. ఆసియా కప్ 2023లో బంగ్లాదేశ్తో జరిగిన సూపర్-4 మ్యాచ్లో అక్షర్ పటేల్ గాయం కారణంగా ఫైనల్ మ్యాచ్కు దూరమయ్యాడు. వెన్ను నొప్పి సమస్య కారణంగా గ్రూప్ మ్యాచ్ల తర్వాత శ్రేయాస్ అయ్యర్ ఏ మ్యాచ్ ఆడలేకపోయాడు. వన్డే ప్రపంచకప్కు ప్రకటించిన జట్టులో ఈ ఇద్దరు ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వీరిద్దరి ఫిట్నెస్పై కూడా మీడియా సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Read Also: Whatsapp Divorce: వాట్సాప్ లో విడాకులు అడిగిన భర్త.. భార్య ఏం చేసిందంటే..?
మరోవైపు అక్షర్ పటేల్ ప్రపంచకప్కు ఫిట్గా లేకుంటే.. అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్కు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. అందుకు ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్లో సుందర్ను ప్రయత్నించవచ్చు. తద్వారా అతను ప్రపంచకప్కు పూర్తిగా సిద్ధమవుతాడు. అంతేకాకుండా.. జట్టులో మరో కీలక మార్పు చోటుచేసుకుంటుందన్న ఆశలు అందరిలోనూ ఉన్నాయి. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్ని టీమిండియా మొహాలీలో ఆడనుండగా.. సిరీస్లోని చివరి 2 మ్యాచ్లు ఇండోర్, రాజ్కోట్ మైదానాల్లో సెప్టెంబర్ 24, 27 తేదీల్లో జరగనున్నాయి.
తాజావార్తలు
-
Ajit Agarkar: “వైభవ్ ఇంకా చిన్నోడే”.. టీమిండియాలోకి బుడ్డోడి ఎంట్రీపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ సంచలన వ్యాఖ్యలు..
-
Drishyam 3 : మోహన్ లాల్ ఖాతాలో మరో రికార్డ్.. జస్ట్ 7 రోజుల్లో సెన్సేషన్
-
Vaibhav Sooryavanshi: టాప్ బౌలర్లకు చుక్కలు చూపించిన వైభవ్.. కానీ బుడ్డోడినే వణికించిన ‘ఆ ఒక్కడు’ ఎవరంటే?
-
AB de Villiers: వైభవ్ను ఆ ఆస్ట్రేలియా దిగ్గజంతో పోల్చిన డివిలియర్స్.. బుడ్డోడి మెచ్యూరిటీపై ఏబీడీ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Vaibhav Sooryavanshi: సచిన్ కలలు చూపించాడు.. ధోనీ నమ్మకం నేర్పించాడు.. కోహ్లీ గర్జించాడు.. ఇక వైభవ్ సూర్యవంశీ యుగం ప్రారంభమైందా..?
ట్రెండింగ్
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..