Congress leader booked: ప్రధాని మోడీపై విమర్శలు.. కాంగ్రెస్ నేతపై కేసు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కాంగ్రెస్ నేతపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సచిన్ చౌదరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఒక కాంగ్రెస్ నాయకుడిపై బీజేపీ యువజన విభాగం నాయకుడు చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు ఫైల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ నాయకుడు కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడని సంభాల్ ఏఎస్పీ శ్రీష్ చంద్ర తెలిపారు. ప్రధాని మోడీపై కాంగ్రెస్ అసభ్యకర, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వీడియో కూడా అందడంతో త్వరలో చర్యలు తీసుకుంటామని ఆచప తెలిపారు.
Also Read : Steroids selling: జిమ్కు వెళ్లే యువకులే టార్గెట్.. స్టెరాయిడ్స్ విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
Also Read
- US-Israel: అమెరికాకు ఇజ్రాయిల్ భయం.. "నిఘా"పై పెంటగాన్ హెచ్చరిక..
- Nag Ashwin: కమల్ హాసన్ మిస్ చేసుకున్న కథతో.. నాన్-స్టాప్ మ్యూజికల్ వింతగా ‘సింగ్ గీతం’
- Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
- CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తమ సంస్థను 21వ శతాబ్దపు కౌరవులుగా అభివర్ణించినందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్త హరిద్వార్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఆర్ఎస్ఎస్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు తన క్లయింట్ ఐసీసీ 499,500 సెక్షన్ల కింద కోర్టులో ఫిర్యాదు చేశారని ఆర్ఎస్ఎస్ కార్యకర్త కమల్ భదౌరియా తరపు న్యాయవాది తెలిపారు. ఈ విషయంలో న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు.
Also Read : malladi vishnu: మంత్రివర్గ విస్తరణ నిర్ణయం ఆయనకు మాత్రమే తెలుసు…
ఈ ఏడాది జనవరి 9న హరియాణాలో భారత్ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్ నేత 21వ శతాబ్దానికి చెందిన కౌరవులు ఖాకీ హాఫ్ ప్యాంటు ధరించి శాఖలు నడుపుతున్నారని ఆరోపించారు. వీరితో పాటు దేశంలోని ఇద్దరు ముగ్గురు ధనవంతులు ఉన్నారు అని అన్నారు. ఇదిలా ఉండగా.. మోడీ ఇంటి పేరు ప్రస్తావనకు సంబంధించిన పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రాహల్ గాంధీని దోషిగా తేల్చింది. ఈ క్రమంలోనే ఆయనను పార్లమెంట్ సభ్యుడిగా అనర్హుడిగా ప్రకటించారు. ఇది జరిగిన తర్వాత రాహుల్ గాంధీపై రెండవ పరువు నష్టం కేసు కూడా నమోదైంది.
తాజావార్తలు
-
Mumaith Khan: తలలో 9 టైటానియం వైర్లు, ఫిట్స్, డిప్రెషన్.. చావు అంచుల దాకా వెళ్లి ఎలా బ్రతికిందంటే?
-
US-Israel: అమెరికాకు ఇజ్రాయిల్ భయం.. “నిఘా”పై పెంటగాన్ హెచ్చరిక..
-
Fish Prasadam 2026 : ఈనెల 8న రాత్రి 9 గంటల నుంచి ‘చేప ప్రసాదం’ పంపిణీ..
-
Varansi: అదంతా ఫేకు.. వారణాసి బడ్జెట్’పై స్టార్ యాక్టర్ సంచలనం!
-
Kalki 2: వచ్చే నెల నుంచే ‘కల్కి 2’ నాన్-స్టాప్ షూటింగ్!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!