Nvss Prabhakar: రేపు ఉప్పల్ లో బండి ప్రజాసంగ్రామయాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నగరంలో వివిధ ప్రాంతాల్లో బండి పాదయాత్రకు అనూహ్య స్పందన లభిస్తోందని బీజేపీ నేతలు అంటున్నారు. హైదరాబాద్ కాప్రా సర్కిల్ కుషాయిగూడలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ రాష్ట్రంలో ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నారని తెలిపారు.
నాలుగవ విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఉప్పల్ నియోజకవర్గంలో ప్రజా సంగ్రామ యాత్ర చేపడతారని తెలిపారు. రేపు, ఎల్లుండి ఉప్పల్ నియోజక వర్గంలో విస్తృతంగా పర్యిటిస్తారని ఆయన అన్నారు. బండి సంజయ్ కు ప్రజలు బ్రహ్మం రథం పడుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఉప్పల్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో వివిధ సామాజిక సమస్యలను ప్రజలు బండి సంజయ్ కి వివరిస్తున్నారని తెలిపారు. ఎన్నో ఆశలు పెట్టుకొని నిధులు, నీళ్ళు, నియామకాల కోసం ప్రజలు రెండో సారి సీఎం కేసీఆర్ కు అవకాశం ఇచ్చారన్నారు.
Also Read
- Modi-Meloni: హైలెట్గా ఇటలీ టూర్.. మోడీ-మెలోని ఫొటోలు వైరల్
- Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో బాధిత కుటుంబానికి కోర్టు షాక్.. నెక్ట్స్ ఏంటి?
- KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్లో హైవోల్టేజ్ పోరు: టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
- RBI: ఈఎంఐ కట్టలేదని ఫోన్ బ్లాక్ చేస్తున్నారా..? బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్.. ఇకపై అలా చేస్తే కుదరదు..
Read Also: Husband Catches Wife Red Handed: స్కూటీలో మరొకరితో భార్య.. వెంబడించిన భర్త.. వీడియో వైరల్
కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి అభివృద్ది చేయలేదన్నారు. అలాగే ఎంబీసీలకు 1000 కోట్లు కేటాయించి కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి చైర్మన్ ను నియమించి కూడా కనీసం 150 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని దుయ్యబట్టారు. ఇప్పటివరకు ఉప్పల్ నియోజకవర్గంలో అయిదుగురికి కూడా డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వలేదన్నారు. అభివృద్ది విషయంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ నాయకులు పాలనను గాలికి వదిలేశారని ఆరోపించారు. ఇంత వరకు ఉప్పల్ నియోజకవర్గంలోని ఉప్పల్, నాచారం, కాప్రా, చర్లపల్లి తదితర ప్రాంతాల్లోని ఒక్క చెరువును కూడా పర్యాటకంగా అభివృద్ది పరచలేదని తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొని స్వాగతం పలకాలని ఉప్పల్ నియోజకవర్గ బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కోరారు.
Read Also: Brutal Murder in Singareny colony: సైదాబాద్ సింగరేణి కాలనీలో వ్యక్తి దారుణ హత్య
తాజావార్తలు
-
Modi-Meloni: హైలెట్గా ఇటలీ టూర్.. మోడీ-మెలోని ఫొటోలు వైరల్
-
Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో బాధిత కుటుంబానికి కోర్టు షాక్.. నెక్ట్స్ ఏంటి?
-
KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్లో హైవోల్టేజ్ పోరు: టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
-
iQOO 15T: ఐకూ 15T విడుదల.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్
-
RBI: ఈఎంఐ కట్టలేదని ఫోన్ బ్లాక్ చేస్తున్నారా..? బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్.. ఇకపై అలా చేస్తే కుదరదు..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!