England: దారుణం.. నవజాత శిశువులను చంపుతున్న నర్సు
- దారుణానికి పాల్పడుతున్న నర్సు లూసీ లెట్బీ నవజాత శిశువులను చంపుతున్న నర్సు
- ఇంతకుముందు పలువురు శిశువులను చంపిన నర్సు
- మరోసారి శిశువును చంపడానికి ప్రయత్నం
బ్రిటన్లో ఓ నర్సు దారుణ ఘటనకు పాల్పడుతుంది. అప్పుడే పుట్టిన నవజాత శిశువులను చంపేస్తుంది. ఇంతకుముందు కూడా ఆ నర్సుపై పిల్లలను చంపుతున్న ఆరోపణలపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. 2016 ఫిబ్రవరిలో వాయువ్య ఇంగ్లండ్లోని కౌంటెస్ ఆఫ్ చెస్టర్ హాస్పిటల్లో నెలలు నిండని నవజాత శిశువును చంపడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా మరోసారి విషయం బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. లూసీ లెట్బీ అనే నర్సు తాను పనిచేస్తున్న ఆసుపత్రిలో నవజాత శిశువును చంపడానికి ప్రయత్నించింది. దీంతో.. నర్సు లూసీ లెట్బీపై పిల్లలను చంపిన ఆరోపణలపై మళ్లీ కేసు నమోదైంది.
Bandi Sanjay : హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశం కావడంతో.. న్యాయవాది నిక్ జాన్సన్ తన కేసుపై దర్యాప్తు చేపట్టారు. నర్సు ఒక నవజాత శిశువుకు ఉన్న శ్వాస గొట్టాన్ని తొలగిస్తుండగా సీనియర్ కన్సల్టెంట్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారని ఆరోపించారు.
నర్సు పిల్లవాడిని ఊపిరి పీల్చుకోకుండా.. వెంటిలేటర్ కట్ చేసిందని, అంతేకాకుండా గుండె స్థాయిని నియంత్రించే మరో యంత్రాన్ని కట్ చేసిందని చెప్పారు. పిల్లల గుండె స్థాయి లేదా రక్తంలో ఆక్సిజన్ స్థాయి నిర్దిష్ట స్థాయి కంటే తక్కువగా ఉంటే.. అలారం మోగుతుందని.. అయితే అలారం మోగలేదని లాయర్ చెప్పారు.
Bihar: విరిగిన కాలుకు ప్లాస్టర్ బదులుగా అట్టపెట్టె.. ఇదేం వైద్యం రా.. బాబు
కొంత సమయం తర్వాత శిశువైద్యుడు రవి జయరామ్ వార్డుకు వెళ్లి చూడగా.. లెట్బీ అక్కడే ఉందని, అలారం మోగకుండా చేసిందని చెప్పారు. న్యాయవాది కోర్టులో వాదనలు వినిపిస్తూ.. నర్సు అక్కడ నిలబడి అలారం మోగకుండా అడ్డుకుంటోందని తెలిపారు. దీన్ని బట్టి లూసీ ఈ కేసులో దోషి అని మీరు ఊహించవచ్చన్నారు. మరోవైపు.. ఇంతకుముందు అదే ఆస్పత్రిలో 2015-2016 మధ్యకాలంలో ఏడుగురు శిశువులను హత్య చేసిందని.. ఆ కేసులో లూసీ లెట్బీ దోషిగా ఉందని లాయర్ తెలిపారు. పిల్లలను చంపేందుకు ఇన్సులిన్ ఇంజెక్ట్ చేయడం, నరాల్లోకి గాలి నింపడం, అధిక మోతాదులో పాలు ఇవ్వడం వంటి పద్ధతులను ఉపయోగించినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Marcus Stoinis: 4, 6, 6, 4, 4.. స్టోయినిస్ డెత్ ఓవర్ బీభత్సం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
-
Vaibhav Sooryavanshi: పొలార్డ్ రికార్డుకు ఎసరు.. ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో వైభవ్ సూర్యవంశీ..
-
West Bengal Assembly Election 2026: చివరి దశ ఓటింగ్కు సిద్ధమైన బెంగాల్.. భవానీపుర్లో మమతా-సువేందు ఫేస్ ఆఫ్
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో