NTR-Neel : ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ మూవీ లేటెస్ట్ అప్డేట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ హీరో ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో రాబోతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ (వర్కింగ్ టైటిల్: డ్రాగన్) షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలిచిపోయేలా ప్రశాంత్ నీల్ ఎంతో కష్టపడుతున్నారట. ఇప్పటివరకు నీల్ తీసిన సినిమాలన్నింటికంటే ఇది ది బెస్ట్ అనిపించేలా యాక్షన్ సీక్వెన్స్లను ప్లాన్ చేసినట్లు టాక్. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ పవర్ ఫుల్ మ్యూజిక్ ఇస్తున్నారు. కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
Also Read : Rakul Preet: బాలీవుడ్లో నెపోటిజం కారణంగా.. చాలా అవమానాలు ఎదురుకున్న
Also Read
- Mothers Day Special: మాతృత్వానికి ప్రణామం.. సృష్టికి ప్రతిరూపం.. సహనానికి నిలువుటద్దం "అమ్మ"
- Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
- PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
- Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ షెడ్యూల్ హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో పూర్తయ్యింది. ఈ షెడ్యూల్లో ఎక్కువగా నైట్ ఎఫెక్ట్లోనే కీలకమైన సీన్లను చిత్రీకరించినట్లు సమాచారం. ఈ విషయాన్ని సినిమాటోగ్రఫీ టీమ్కు చెందిన ప్రజ్వల్ గౌడ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తదుపరి షెడ్యూల్ కూడా త్వరలోనే ప్రారంభం కానుందట. ఇక అన్నీ కుదిరితే ఈ ఏడాది జూన్ 25న థియేటర్లలో విడుదల చేసే అవకాశం ఉందట. దీంతో ఎన్టీఆర్ మాస్ మేనియాకు, ప్రశాంత్ నీల్ ఎలివేషన్లు తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
తాజావార్తలు
-
Mothers Day Special: మాతృత్వానికి ప్రణామం.. సృష్టికి ప్రతిరూపం.. సహనానికి నిలువుటద్దం “అమ్మ”
-
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్