NTR Fan Raju: ఎన్టీఆర్ వీరాభిమాని ‘ఎన్టీఆర్ రాజు’ ఇకలేరు!
- ఎన్టీఆర్ వీరాభిమాని ఎన్టీఆర్ రాజు ఇకలేరు
- బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన రామచంద్రరాజు
- ఎన్టీఆర్ రాజు మృతికి సంతాపం వ్యక్తం చేసిన బాలయ్య బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్ వీరాభిమాని, టీడీపీ సీనియర్ నాయకులు, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు రామచంద్రరాజు (ఎన్టీఆర్ రాజు) ఈరోజు ఉదయం కన్నుమూశారు. తిరుపతిలోని తన నివాసంలో బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఎన్టీఆర్ రాజు మరణంతో టీడీపీలో విషాదం చోటుచేసుకుంది. ఆయన మృతిపట్ల సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రగాఢ సంతాపం తెలిపారు.
మహానేత ఎన్టీఆర్ గారిపై ఉన్న అపారమైన అభిమానంతో ఆయన పేరునే రామచంద్రరాజు తన ఇంటిపేరుగా (ఎన్టీఆర్ రాజు) మార్చుకుని నిజమైన వీరాభిమాని అనిపించుకున్నారు. రెండు పర్యాయాలు టీటీడీ బోర్డు సభ్యులుగా ఎంతో అంకితభావంతో సేవలందించారు. ఎన్టీఆర్కి ఆల్ ఇండియా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించి.. పార్టీకి, ప్రజలకు నిస్వార్థంగా సేవలందించారు. శాసనసభ సభ్యునిగా అవకాశం వచ్చినా.. ఎన్టీఆర్ అభిమాని గానే ఉంటా అని చెప్పిన మహోన్నత వ్యక్తిత్వం ఆయనది. ఆచరణతోనే ఆదర్శంగా నిలిచిన ఎన్టీఆర్ రాజు జీవితం.. తరతరాల వారికి మార్గదర్శకంగా నిలుస్తుంది.
Also Read
- Jeep Compass 85th Anniversary Edition లాంచ్.. ధర రూ.26.70 లక్షలు, కేవలం 85 యూనిట్లే!
- Votes Cancelled: రాజధానిలో 43 లక్షల ఓట్లు గల్లంతు.. మీ ఓటు ఉందా..? లేదా..? తెలుసుకోండిలా..
- Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!
- AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదం?
Also Read: SRH Team 2026: మాన్స్టర్ వచ్చేశాడు.. సన్రైజర్స్ హైదరాబాద్ రాత మారేనా?
ఎన్టీఆర్ రాజు మరణంపై సీనియర్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సంతాపం ప్రకటించారు. ‘తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అన్న ఎన్టీఆర్ గారి వీరాభిమాని, మూడు సార్లు టీటీడీ బోర్డు సభ్యులుగా అన్నగారు నియమించిన పెద్దలు శ్రీ రామచంద్రరాజు (ఎన్టీఆర్ రాజు) గారు ఇవాళ ఉదయం కన్నుమూశారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అని బాలకృష్ణ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Captain India: కార్తీక్ ఆర్యన్ మూవీకి హీరోయిన్ ఫిక్స్.. 9 ఏళ్ల తర్వాత బాలీవుడ్లోకి రీఎంట్రీ!
-
Explainer: గల్ఫ్లో కొత్త ముసలం మొదలైందా? శత్రువులగా మారిన ప్రాణ స్నేహితులు!
-
Jeep Compass 85th Anniversary Edition లాంచ్.. ధర రూ.26.70 లక్షలు, కేవలం 85 యూనిట్లే!
-
Votes Cancelled: రాజధానిలో 43 లక్షల ఓట్లు గల్లంతు.. మీ ఓటు ఉందా..? లేదా..? తెలుసుకోండిలా..
-
Anaswara : టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లో సాలిడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న యంగ్ హీరోయిన్
ట్రెండింగ్
-
Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!
-
రూ.8,499కే ఇంట్లోనే థియేటర్.! 200 అంగుళాల స్క్రీన్, స్మార్ట్ ఫీచర్లతో XElectron Techno Plus ప్రొజెక్టర్ లాంచ్.!
-
Jio Prime Membership: గుడ్న్యూస్.. Jio Prime రీలాంచ్.. ఏడాది పాటు రీఛార్జ్ ధర టెన్షన్ ఉండదు..!
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!