Video Viral: ఏ ఆటోనో, బస్సో కాదు.. ఏకంగా రైలునే నెడుతున్నారు.. వీడియో వైరల్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ రైల్వే ప్రజా రవాణా వ్యవస్థకు వెన్నెముకగా చెబుతుంటారు. రైల్వే.. ప్రపంచంలోనే నాల్గవ-అతిపెద్ద నెట్వర్క్ గా ఉంది. ప్రతిరోజూ రైళ్లల్లో కోట్లాది మంది ప్రయాణం చేస్తుంటారు. ఐతే ఇటీవలి వైరల్ వీడియోలో ఉపయోగంలో ఉన్న రైళ్ల పరిస్థితిపై సందేహాన్ని కలిగిస్తుంది. ఆగి ఉన్న రైలును పునఃప్రారంభించమని ఆరోపిస్తూ ప్రయాణీకులు రైలును నెట్టడం ఓ వీడియోలో కనపడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపడంతో పలువురు భారతీయ రైల్వేపై విమర్శలు గుప్పిస్తున్నారు.
Virat Kohli: విరాట్ కోహ్లీని మళ్లీ టీమిండియాకు కెప్టెన్గా చేయొచ్చుగా..
Also Read
- Rishabh Agarwal: రూ.8.5 కోట్ల జాబ్కు నో చెప్పిన భారతీయ కుర్రాడు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా?
- Musi Riverfront Project: రూ.7,345 కోట్ల పరిపాలనా అనుమతి.. 21 కి.మీ. మేర అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్.!
- CM Chandrababu: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ.. భువివాదాలు లేకుండా చేస్తాం..
- Dy. CM Bhatti Vikramaraka: ఎన్ని సమస్యలు ఉన్నా రైతు భరోసా ఇచ్చాం..
మార్గమధ్యలో ఆగిపోయిన రైలును పలువురు అధికారులు మరియు ప్రయాణికులు నెట్టడం ఆ వీడియోలో కనపడుతుంది. లోకో పైలట్ రైలును ప్రారంభించడంలో ఆర్మీ జవాన్లు, పోలీసులు మరియు ప్రయాణికులు సహాయపడుతారు. ఈ ఘటన దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రూట్లో జరిగింది. “రైలు అకస్మాత్తుగా ఆగిపోవడంతో జవాన్లు మరియు ప్రయాణీకులు రైలును నెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. 70 ఏళ్లలో, ఇలాంటి ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడైనా చూశారా?” అనే టెక్స్ట్తో ఈ వీడియో షేర్ చేశారు.
High Court: కోర్టు ధిక్కరణ కేసు.. ఐఏఎస్ అధికారికి జైలు శిక్ష, జరిమానా
ఐతే ఈ ఘటనపై రైల్వే మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. రైలులో అగ్నిప్రమాదం వల్లే ఆ పరిస్థితి ఏర్పడిందని రైల్వే మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి ట్వీట్లో తెలిపింది. మంటలు మరింత వ్యాప్తి చెందకుండా.. ఇతర కోచ్లను వేరు చేయడానికి ఇంజిన్ను పంపినట్లు ఆయన వెల్లడించారు. అయితే ఆర్మీ సిబ్బంది మరియు ఇతర అధికారులు ఇంజిన్ వచ్చే వరకు వేచి ఉండకుండా దానిని వేరు చేయడానికి నెట్టారని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఘటన 7 జూలై 2023న రైలు నం. 12703 (HWH-SC)న జరిగింది. రైల్వే సిబ్బంది మరియు స్థానిక పోలీసుల చర్య వెనుక కోచ్ల్లో మంటలు వ్యాపించకుండా ఉండటానికి సహాయపడిందని రైల్వే వెల్లడించింది. తక్షణమే స్పందించినందుకు అప్రమత్తమైన పోలీసు సిబ్బందికి మా కృతజ్ఞతలు అని రైల్వే ప్రతినిధి తెలిపారు.
https://twitter.com/B5001001101/status/1678258008512667648
తాజావార్తలు
-
PM Modi: భారత్కు రూ.3,311 కోట్ల భారీ పెట్టుబడులు.. ఆస్ట్రేలియన్ సూపర్ ప్రకటనను స్వాగతించిన ప్రధాని మోడీ
-
Rishabh Agarwal: రూ.8.5 కోట్ల జాబ్కు నో చెప్పిన భారతీయ కుర్రాడు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా?
-
Musi Riverfront Project: రూ.7,345 కోట్ల పరిపాలనా అనుమతి.. 21 కి.మీ. మేర అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్.!
-
CM Chandrababu: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ.. భువివాదాలు లేకుండా చేస్తాం..
-
Dy. CM Bhatti Vikramaraka: ఎన్ని సమస్యలు ఉన్నా రైతు భరోసా ఇచ్చాం..
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!