Imran Khan: ఇమ్రాన్ ఖాన్పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై సోమవారం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయబడింది. ఖాతూన్ జడ్జి జెబా చౌదరిని బెదిరించిన కేసుకు సంబంధించి సివిల్ జడ్జి జిల్లా సెషన్స్ కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది. పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ సోమవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే, ఇమ్రాన్ ఖాన్ శాంతి భద్రతల దృష్ట్యా కోర్టుకు హాజరు నుండి మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఇమ్రాన్ ఖాన్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మార్చి 29న ఇమ్రాన్ఖాన్ను కోర్టులో హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది.
గత ఏడాది ఆగస్టులో తన స్పెషల్ అసిస్టెంట్ షాబాజ్ గిల్కు సంఘీభావంగా ఇమ్రాన్ ఖాన్ రాజకీయ ర్యాలీ నిర్వహించారు. పోలీసుల కస్టడీలో గిల్ను హింసిస్తున్నారని ఆయన అప్పట్లో ఆరోపించారు. ఆ సందర్భంగా చేసిన ప్రసంగంలో.. జడ్జ్ జేబా చౌదరిని బెదిరిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆమె జాగ్రత్తగా ఉండాలని, లేనిపక్షంలో ఆమెపై తాను చర్యలు తీసుకోవలసి వస్తుందని హెచ్చరించారు. దీంతో ఆ నాడే ఆయనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పాకిస్తాన్ పీనల్ కోడ్లోని వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. అనంతరం తాను బహుశా తన పరిధిని అతిక్రమించి ఉండవచ్చునని, ఆ జడ్జికి క్షమాపణ చెప్పాలనుకుంటున్నానంటూ ఇమ్రాన్ ఖాన్.. ఇస్లామాబాద్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆయన సోమవారం కోర్టుకు హాజరు కావలసి ఉంది. కానీ ఆయన హాజరు కాకపోవడంతో కోర్టు.. ఆయనకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
Also Read
- Kalma Homework: స్కూల్లో 'కల్మా' హోంవర్క్ వివాదం.. బీజేపీ నేతల ఆగ్రహం..!
- Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
- 50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
- 144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
Read Also: Bengal Assembly: కేంద్ర ఏజెన్సీల దుర్వినియోగానికి వ్యతిరేకంగా తీర్మానం.. బెంగాల్ అసెంబ్లీ ఆమోదం
పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్ను అరెస్టు చేయాలని ఇస్లామాబాద్ కోర్టుల ఆదేశాలను అనుసరించి, మాజీ ప్రధానిని అరెస్టు చేయడానికి ఇస్లామాబాద్ పోలీసులు వచ్చే 24 గంటల్లో జమాన్ పార్క్ను సందర్శిస్తారని జియో న్యూస్ నివేదించింది.
తాజావార్తలు
-
Kalma Homework: స్కూల్లో ‘కల్మా’ హోంవర్క్ వివాదం.. బీజేపీ నేతల ఆగ్రహం..!
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
-
Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
-
PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!