Noida dowry murder: నాన్నే అమ్మను లైటర్తో కాల్చి చంపాడు… నోయిడాలో దారుణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Noida dowry murder: అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యను.. ఓ భర్త అతికిరాతంగా చంపేసిన ఘటన గ్రేటర్ నోయిడాలోని సిర్సా గ్రామంలో వెలుగుచూసింది. నాన్నే అమ్మను లైటర్తో కాల్చి చంపాడని చెప్తున్న చిన్నారి బాలుడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ హత్య వరకట్నం కోసం జరిగిందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు భర్తతో పాటు, అత్తమామలపై కేసు నమోదు చేశారు.
READ ALSO: Sahasra M*rder Case : We want Justice.. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న సహస్ర పేరెంట్స్
Also Read
- Sanae Takaichi: భారత్ టూర్కు జపాన్ ప్రధాని సనే తకైచి.. 3 రోజులు పర్యటన
- AP Cabinet: ఉద్యోగులకు గుడ్న్యూస్.. రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్లకు పెంపు.. కేబినెట్లో కీలక నిర్ణయాలు..
- Stock Market: స్టాక్ మార్కెట్లో రక్తపాతం.. భారీ నష్టాలతో ముగిసిన సూచీలు.. కారణాలివే..
- Pakistan: "మాది సింధు నాగరికత".. నీటి కోసం పాకిస్తాన్ కొత్త వాదన..
రూ.35 లక్షల కోసం నూరేళ్ల ప్రాణాన్ని తీశారు..
గ్రేటర్ నోయిడాలోని కస్నా పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన బాధితురాలికి డిసెంబర్ 2016లో వివాహం జరిగింది. బాధితురాలి సోదరి కాంచన్ మాట్లాడుతూ.. తాను, నిక్కీ ఇద్దరం ఒకే కుటుంబానికి చెందిన సోదరులను వివాహం చేసుకున్నామన్నారు. తాను రోహిత్ను వివాహం చేసుకోగా, నిక్కీ డిసెంబర్ 2016లో విపిన్ను పెళ్లి చేసుకుందని తెలిపారు. పెళ్లి జరిగిన నాటి నుంచే తమ అత్తమామలు నిక్కీని రూ.35 లక్షల వరకట్నం కోసం వేధించే వారని, నిక్కీ వరకట్నం తీసుకురాకపోవడంతో ఆగస్టు 21న తన భర్త విపిన్, కుటుంబ సభ్యులు తనను దారుణంగా కొట్టి, మెడపై దాడి చేశారని తెలిపింది. తను స్పృహ కోల్పోయిన తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించారని కన్నీటిపర్యంతం అయ్యింది. స్థానికుల సహాయంతో ముందుగా ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించి, మెరుగైన చికిత్స ఢిల్లీకి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మరణించింది. మృతురాలి బాబు మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ చిన్నారి పిల్లవాడు వీడియోలో మాట్లాడుతూ.. తన నాన్న అమ్మను లైటర్తో కాల్చి చంపాడని చెప్పాడు.
వివాహంలో స్కార్పియో కారుతో సహా చాలా వస్తువులు ఇచ్చామని మృతిరాలి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతం అయ్యారు. అయినప్పటికీ నిక్కీ అత్తమామలు నిరంతరం రూ.35 లక్షల అదనపు వరకట్నం కోసం తమ బిడ్డను హింసలకు గురి చేయడమే కాక, హత్య చేశారని కుప్పకూలిపోయారు. పంచాయితీ ద్వారా రాజీకి రావడానికి చాలా ప్రయత్నాలు చేశామని, కానీ తన అత్తమామలు అంగీకరించలేదని వాపోయారు.
నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు..
బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కాస్నా పోలీస్ స్టేషన్ పోలీసులు భర్త విపిన్, బావమరిది రోహిత్, అత్తగారు దయా, మామ సత్వీర్లపై కేసు నమోదు చేశారు. ఈసందర్భంగా గ్రేటర్ నోయిడా ADCP సుధీర్ కుమార్ మాట్లాడుతూ.. నిందితులను అరెస్టు చేయడానికి రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, త్వరలో వారందరినీ అరెస్టు చేస్తామని చెప్పారు.
READ ALSO: Dharmasthala case: సంచలన ‘ధర్మస్థల’లో అంతా తూచ్.. కంప్లైంట్ చేసిన వ్యక్తి అరెస్ట్..
తాజావార్తలు
-
Vastu Tips: ఇంట్లో చనిపోయిన వారి ఫోటోలు ఎక్కడ పెట్టాలి.? వాస్తు శాస్త్రం చెబుతుంది ఇదే..
-
Book My Show Fine: ఆ డిజాస్టర్ సినిమా చూడలేదని కేసు వేస్తే.. రూ.12 వేలు వచ్చాయి! బుక్ మై షో హిస్టరీలోనే బిగ్గెస్ట్ ట్విస్ట్..
-
Sanae Takaichi: భారత్ టూర్కు జపాన్ ప్రధాని సనే తకైచి.. 3 రోజులు పర్యటన
-
AP Cabinet: ఉద్యోగులకు గుడ్న్యూస్.. రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్లకు పెంపు.. కేబినెట్లో కీలక నిర్ణయాలు..
-
Stock Market: స్టాక్ మార్కెట్లో రక్తపాతం.. భారీ నష్టాలతో ముగిసిన సూచీలు.. కారణాలివే..
ట్రెండింగ్
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi Jersey: వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. బుడ్డోడికి దిగ్గజాల జెర్సీ నంబర్!
-
Vaibhav Suryavanshi: అది మంచి పద్ధతి కాదు.. వైభవ్ అలా చేయాల్సింది కాదు!