Ajit Pawar: ఏక్నాథ్ షిండే రాజీనామాను డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajit Pawar: శివసేన, సేన పోరుపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే రాజీనామా చేయాలని డిమాండ్ చేయాల్సిన అవసరం లేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత అజిత్ పవార్ శుక్రవారం అన్నారు. “నైతికతతో సీఎం, డిప్యూటీ సీఎంలు రాజీనామా చేస్తారని కలలో కూడా ఊహించవద్దు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి మరియు ప్రస్తుత ప్రజలకు మధ్య చాలా తేడా ఉంది.” ప్రస్తుత సీఎం రాజీనామా కోసం ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ గురించి అడిగినప్పుడు పవార్ విలేకరులతో అన్నారు. ఏక్నాథ్ షిండే తిరుగుబాటు తర్వాత ఉద్ధవ్ ఠాక్రే మెజారిటీ కోల్పోయారని అప్పటి మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ తప్పు చేశారని గురువారం సుప్రీంకోర్టు పేర్కొంది. ఫ్లోర్ టెస్ట్కు పిలవడానికి గవర్నర్ వద్ద ఆబ్జెక్టివ్ మెటీరియల్స్ లేవని కూడా పేర్కొంది. ఉద్ధవ్ ఠాక్రేను ప్రస్తావిస్తూ, షిండే వర్గం తిరుగుబాటు తర్వాత తన పదవికి ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేయకుండా ఉండి ఉంటే తిరిగి ముఖ్యమంత్రిగా నియమించబడేవారని సుప్రీంకోర్టు పేర్కొంది.”శివసేన షిండే గ్రూపు విప్ చట్టవిరుద్ధమని.. ప్రస్తుత ప్రభుత్వం చట్టవిరుద్ధమని, రాజ్యాంగానికి విరుద్ధంగా ఏర్పాటైందని సుప్రీం కోర్టు పేర్కొంది” శివసేన (యూబీటి) ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు.
154 మంది ఎమ్మెల్యేల మెజారిటీ సభలో ఉన్నంత కాలం షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదని అజిత్ పవార్ అత్యున్నత న్యాయస్థానం తీర్పుకు ముందు ధీమా వ్యక్తం చేశారు. “చాలా మంది ఈ ప్రభుత్వాన్ని రాజ్యాంగ విరుద్ధం అని పిలుస్తారు. కానీ వారికి 145 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నంత వరకు ప్రమాదం లేదు” అని ఆయన అన్నారు. జులైలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో 16 మంది ఎమ్మెల్యేల అనర్హత అంశంపై ప్రతిపక్ష ఎంవీఏ కూటమి ఏం చేయగలదో చూస్తామని ఆయన అన్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వంపై కూడా ఆయన మండిపడ్డారు. “నైతిక కారణాలతో ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే రాజీనామా చేయాలని డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన కలలో కూడా రాజీనామా చేయరని మాకు తెలుసు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి, ప్రస్తుత నేతలకు చాలా తేడా ఉంది” అని పవార్ అన్నారు.
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్ అధ్యక్షుడు షహాబుద్దీన్ రాజీనామా.. ఫోన్ సంభాషణే కారణమా?
- Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరు.. స్పష్టం చేసిన కేంద్రం..!
- Himachal Pradesh: ఘోర విషాదం.. కొండచరియలు విరిగిపడి 13 మంది మృతి
- Imran Khan: ‘‘1100 రోజులుగా జైలులో ఉన్నాడు, కాపాడండి’’.. ఇమ్రాన్ ఖాన్ కుమారుడి వేడుకోలు..
Read Also: Madhyapradesh: చిక్కిన అవినీతి తిమింగలం.. జీతం రూ.30వేలు.. ఆస్తులు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను సంప్రదించకుండానే కాంగ్రెస్ నాయకుడు నానా పటోలే స్పీకర్ పదవికి రాజీనామా చేశారని, వెంటనే కొత్త స్పీకర్ను ఎన్నుకుని ఉంటే షిండే క్యాంపుకు చెందిన 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేదని కూడా ఆయన అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి నైతిక కారణాలతో షిండే ప్రభుత్వం రాజీనామా చేయాలని మహా వికాస్ అఘాడీ కూటమిలోని సభ్యులు పేర్కొన్నారు. మాజీ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ అప్పటి పరిస్థితులకు అనుగుణంగానే వ్యవహరించారని ముఖ్యమంత్రి షిండే గురువారం అన్నారు. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సుప్రీంకోర్టు తీర్పును “ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య ప్రక్రియ విజయం”గా అభివర్ణించారు. ఇది ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య ప్రక్రియ విజయం అని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల సంతృప్తిగా ఉన్నామని ఫడ్నవీస్ అన్నారు.
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్ అధ్యక్షుడు షహాబుద్దీన్ రాజీనామా.. ఫోన్ సంభాషణే కారణమా?
-
Prabhas Srinu: ‘ప్రభాస్ శ్రీను’ పేరు వెనుక అసలు కథ ఇదే.. ఎవరు పెట్టారో చెప్పిన నటుడు!
-
Rainy Season Fridge Tips: వర్షాకాలంలో ఫ్రిజ్ ఇలా వాడండి.. కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది.!
-
Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరు.. స్పష్టం చేసిన కేంద్రం..!
-
Himachal Pradesh: ఘోర విషాదం.. కొండచరియలు విరిగిపడి 13 మంది మృతి
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!