ఆర్బీఐ పాలసీ వచ్చేసింది. వడ్డీ రేట్లను ఆర్బీఐ యథతథంగా ఉంచింది. రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదు. రేపో రేటు మార్చలేదని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధాన కమిటీ.. 2026 క్యాలెండర్ ప్రకారం మొదటి ద్రవ్య విధాన సమీక్ష శుక్రవారం నిర్వహించింది. సమీక్ష అనంతరం రెపోరేటును 5.25 శాతం దగ్గరే ఉంచినట్లుగా ఆర్బీఐ పేర్కొంది. దీంతో ఈఎంఐల్లో ఎలాంటి మార్పు జరగలేదు. దీంతో లోన్ వినియోగదారులకు ఎలాంటి ఊరట లభించలేదు.