Delhi Court: విమానంలో మహిళపై మూత్ర విసర్జన.. నిందితుడికి బెయిల్ నిరాకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Court: ఎయిర్ ఇండియా విమానంలో వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేసిన శంకర్ మిశ్రాకు ఢిల్లీ కోర్టు బెయిల్ నిరాకరించింది. ఈ దశలో బెయిల్పై విడుదల చేయడం సరికాదని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోమల్ గార్గ్ మిశ్రా బెయిల్ దరఖాస్తును తోసిపుచ్చారు. న్యాయస్థానం తన తీర్పులో ఆరోపించిన చర్య స్త్రీల ఆగ్రహానికి సంబంధించిందని పేర్కొంది.
పోలీసుల కస్టడీని నిరాకరిస్తూ మిశ్రాను 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్కు మెజిస్టీరియల్ కోర్టు శనివారం పంపింది. గతేడాది న్యూయార్క్-ఢిల్లీ విమానంలో శంకర్ మిశ్రా 70 ఏళ్ల వృద్ధురాలికి మూత్ర విసర్జన చేశాడని ఆరోపించారు. అతని దారుణమైన చర్యకు ఆరు వారాల తర్వాత గత వారం బెంగళూరులో అరెస్టు చేశారు.
Also Read
Delhi: ఢిల్లీ వాసులకు అలర్ట్.. ఆటో, ట్యాక్సీ ఛార్జీలు పెంపు.. కొత్త ధరలు ఎంతంటే?
ఇటీవల విమానాల్లో మూత్ర విసర్జన చేసిన ఘటనలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. గత ఏడాది నవంబర్ 26న న్యూయార్క్ నుండి ఢిల్లీకి వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలోని బిజినెస్ క్లాస్లో మద్యం మత్తులో సహ ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. ఎయిర్ ఇండియాకు మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు జనవరి 4న అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుడిని బెంగళూరులో అరెస్టు చేశారు. అనంతరం కోర్టు అతడిని 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్కు పంపింది. బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం నిరాకరించింది.
తాజావార్తలు
-
Chhattisgarh Congress: ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ ఆఫీస్లో వింతైన ఘటన.. నల్లాలు దొంగిలించి.. నేలపై ‘లవ్ యూ’ నోట్!
-
Iran: మసీదుల్లో ఆయుధ శిక్షణ.. 3 కోట్ల మంది పేర్లు నమోదు..
-
Bhojshala Case: “భోజ్శాల ఆలయం కాదు”.. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు..
-
Full Body Checkup : 30 ఏళ్లు దాటాయా? ఈ టెస్టులు మిస్ అయితే రిస్క్.!
-
Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..