Delhi: ఢిల్లీ వాసులకు అలర్ట్.. ఆటో, ట్యాక్సీ ఛార్జీలు పెంపు.. కొత్త ధరలు ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Auto, Taxi Fares Increased In Delhi: ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎన్జీ ధరలు పెరగడంతో దేశ రాజధాని నగరం పరిధిలో ఆటో, ట్యాక్సీ ధరలను పెంచేందుకు కేజ్రీవాల్ సర్కార్ ఆమోదం తెలిపింది. సవరించిన ధరలపై అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఢిల్లీ ప్రభుత్వ రవాణా శాఖ జనవరి 9న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఢిల్లీలో ఆటో-రిక్షా, టాక్సీ ఛార్జీలను పెంచారు. సవరించిన ధరల ప్రకారం.. ఇకపై ఆటో ఎక్కిన ప్రయాణికుడు తొలి 1.5 కి.మీలకు (మీటర్ డౌన్ ఛార్జి) రూ.30లు (గతంలో రూ.25లు) చెల్లించాల్సి ఉంటుంది. ఆపై ప్రతి కి.మీకు చెల్లించాల్సిన ఛార్జి గతంలో రూ.9.50లుగా ఉండగా.. దాన్ని తాజాగా రూ.11కు పెంచారు. ఢిల్లీ ప్రభుత్వం సవరించిన రేట్లను నోటిఫై చేయడంతో ఢిల్లీలో టాక్సీలు, ఆటో-రిక్షాలను అద్దెకు తీసుకోవడానికి ఇప్పుడు మరింత ఖర్చు అవుతుంది.
America: భారీ సాంకేతిక లోపం.. అమెరికా అంతటా నిలిచిన విమానాలు
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ఇక ట్యాక్సీ విషయానికి వస్తే ఏసీ, నాన్ ఏసీ వాహనాలకు వేర్వేరు ధరలను నిర్ణయించారు. ఏసీ వాహనాలకు మీటర్ డౌన్ తర్వాత ప్రతి కిలోమీటరుకు కనీస ఛార్జీని రూ.16 నుంచి రూ.20కి పెంచగా.. నాన్ ఏసీ వాహనాలకు రూ.14 నుంచి రూ.17కి పెంచారు. ఆటో ఛార్జీలు చివరి సారిగా 2020లో సవరించగా.. ట్యాక్సీల ఛార్జీలను 2013లో సవరించారు. అయితే, ఛార్జీలు పెంచాలంటూ ఆటో రిక్షా, ట్యాక్సీ అసోసియేషన్ల నుంచి దిల్లీ రవాణా మంత్రి కైలాశ్ గహ్లోత్కు పెద్ద సంఖ్యలో విజ్ఞాపనలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఛార్జీలను పెంచుతూ సర్కారు నిర్ణయం తీసుకుంది. నగరంలో సీఎన్జీ ధరలు పెరగడంతో ఛార్జీల ఫిక్సేషన్ కమిటీ సిఫారసుల మేరకు ప్రభుత్వం ఛార్జీలను సవరించింది.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!