Delhi: ఢిల్లీ వాసులకు అలర్ట్.. ఆటో, ట్యాక్సీ ఛార్జీలు పెంపు.. కొత్త ధరలు ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Auto, Taxi Fares Increased In Delhi: ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎన్జీ ధరలు పెరగడంతో దేశ రాజధాని నగరం పరిధిలో ఆటో, ట్యాక్సీ ధరలను పెంచేందుకు కేజ్రీవాల్ సర్కార్ ఆమోదం తెలిపింది. సవరించిన ధరలపై అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఢిల్లీ ప్రభుత్వ రవాణా శాఖ జనవరి 9న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఢిల్లీలో ఆటో-రిక్షా, టాక్సీ ఛార్జీలను పెంచారు. సవరించిన ధరల ప్రకారం.. ఇకపై ఆటో ఎక్కిన ప్రయాణికుడు తొలి 1.5 కి.మీలకు (మీటర్ డౌన్ ఛార్జి) రూ.30లు (గతంలో రూ.25లు) చెల్లించాల్సి ఉంటుంది. ఆపై ప్రతి కి.మీకు చెల్లించాల్సిన ఛార్జి గతంలో రూ.9.50లుగా ఉండగా.. దాన్ని తాజాగా రూ.11కు పెంచారు. ఢిల్లీ ప్రభుత్వం సవరించిన రేట్లను నోటిఫై చేయడంతో ఢిల్లీలో టాక్సీలు, ఆటో-రిక్షాలను అద్దెకు తీసుకోవడానికి ఇప్పుడు మరింత ఖర్చు అవుతుంది.
America: భారీ సాంకేతిక లోపం.. అమెరికా అంతటా నిలిచిన విమానాలు
Also Read
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
- Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
ఇక ట్యాక్సీ విషయానికి వస్తే ఏసీ, నాన్ ఏసీ వాహనాలకు వేర్వేరు ధరలను నిర్ణయించారు. ఏసీ వాహనాలకు మీటర్ డౌన్ తర్వాత ప్రతి కిలోమీటరుకు కనీస ఛార్జీని రూ.16 నుంచి రూ.20కి పెంచగా.. నాన్ ఏసీ వాహనాలకు రూ.14 నుంచి రూ.17కి పెంచారు. ఆటో ఛార్జీలు చివరి సారిగా 2020లో సవరించగా.. ట్యాక్సీల ఛార్జీలను 2013లో సవరించారు. అయితే, ఛార్జీలు పెంచాలంటూ ఆటో రిక్షా, ట్యాక్సీ అసోసియేషన్ల నుంచి దిల్లీ రవాణా మంత్రి కైలాశ్ గహ్లోత్కు పెద్ద సంఖ్యలో విజ్ఞాపనలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఛార్జీలను పెంచుతూ సర్కారు నిర్ణయం తీసుకుంది. నగరంలో సీఎన్జీ ధరలు పెరగడంతో ఛార్జీల ఫిక్సేషన్ కమిటీ సిఫారసుల మేరకు ప్రభుత్వం ఛార్జీలను సవరించింది.
తాజావార్తలు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..