Supreme Court: ప్రజాప్రతినిధుల భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: ప్రజా ప్రతినిధుల రెచ్చగొట్టే వ్యాఖ్యలపై పరిమితులు విధించాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు వెల్లడించింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల భావ ప్రకటన స్వేచ్ఛపై పరిమితులు విధించాలని.. ప్రజా ప్రతినిధులు చేసే విద్వేష వ్యాఖ్యల వల్ల సమాజంపై తీవ్ర ప్రభావం పడుతుందని పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్పై రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధుల భావ ప్రకటన స్వేచ్ఛపై అధిక పరిమితులు విధించలేమని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) కింద నిర్దేశించినవి మినహా ఎలాంటి అదనపు ఆంక్షలను పౌరుడు ఎవరైనా సరే విధించరాదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది.
సమిష్టి బాధ్యత సూత్రాలను ప్రయోగించడం ద్వారా మంత్రి చేసిన ప్రకటనను ప్రభుత్వానికి ఆపాదించలేమని సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొంది. ప్రజాప్రతినిధుల భావ ప్రకటన స్వేచ్ఛపై అధిక పరిమితులు విధించలేమని.. వాక్ స్వాతంత్య్రం, భావప్రకటనా హక్కు దృష్ట్యా ఈ తీర్పు వెల్లడిస్తున్నామని ధర్మాసనం తీర్పు చెప్పింది.. పౌరుల హక్కులకు విరుద్ధంగా ఒక మంత్రి చేసిన ప్రకటన రాజ్యాంగ హింసగా పరిగణించబడదని పేర్కొంది.. అలాగే ఆ మంత్రి చేసిన ప్రకటనను మొత్తానికి ప్రభుత్వానికి కూడా ఆపాదించలేమని తెలిపింది.
Also Read
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
- Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో భాగమైన జస్టిస్ వి.రామసుబ్రమణియన్ మాట్లాడుతూ.. వాక్ స్వాతంత్య్రం, భావప్రకటనా హక్కుకు సంబంధించిన ప్రాథమిక హక్కుల పరిరక్షణ ప్రైవేట్ వ్యక్తులు, రాష్ట్రేతర వ్యక్తులపై కూడా ప్రభావవంతంగా ఉంటుందని అన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను రక్షించాల్సిన బాధ్యత రాష్ట్రంపై ఉందని ఆయన అన్నారు. రాజ్యాంగం కింద పేర్కొన్నవి తప్ప వాక్స్వేచ్ఛపై ఎలాంటి అదనపు ఆంక్షలు విధించలేమని ఆయన తెలిపారు.జస్టిస్ బీవీ నాగరత్నం మాట్లాడుతూ.. “ప్రజాప్రతినిధులు ప్రజలకు బాధ్యత వహిస్తారు. తోటి పౌరుల కోసం వారు చూపుతున్న ఉదాహరణలను తప్పక తెలుసుకోవాలి. వాక్ స్వాతంత్ర్య హక్కుకు వ్యతిరేకంగా ఎలాంటి అదనపు పరిమితి విధించబడదు.” అని అన్నారు.
మెజారిటీ తీర్పుతో విభేదించిన జస్టిస్ బీవీ నాగరత్నం విభేదించారు. నేతల విద్వేష పూరిత వ్యాఖ్యలపై మార్గదర్శకాలు జారీ చేయలేమన్నారు. పార్లమెంటు ఈ సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. మంత్రుల విద్వేషపూరిత వ్యాఖ్యలను నియంత్రించాల్సిన బాధ్యత పార్టీలదని… అందుకు ఒక ప్రవర్తన నియమావళి వారు రూపొందించుకోవాలన్నారు. విద్వేషపూరిత వ్యాఖ్యల వల్ల పౌరులు ఇబ్బంది పడితే సివిల్ కోర్టులను ఆశ్రయించవచ్చన్నారు. నేతల విద్వేషపూరిత ప్రసంగాలు రాజ్యాంగంలోని సోదర భావం, స్వేచ్ఛ, సమానత్వానికి పెద్ద దెబ్బ అంటూ తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మరొక పౌరుడిపై ఉందన్నారు. ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యానికి భావ ప్రకటన స్వేచ్ఛ ముఖ్యమన్నారు.
IndiGo Flight: థాయిలాండ్ వెళ్లాల్సిన ఇండిగో విమానం.. సాంకేతిక లోపంతో..
ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లో 6ఏళ్ల కిందట జరిగిన అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై నాటి యూపీ మంత్రి, ఎస్పీ నేత ఆజాం ఖాన్ స్పందిస్తూ.. ఈ ఘటన ఒక రాజకీయ కుట్ర అని, అంతకుమించి ఏం లేదని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో బాధిత కుటుంబం సుప్రీం కోర్టులో ఖాన్పై చర్యలు తీసుకోవాలంటూ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఆపై కోర్టు, ఖాన్ను క్షమాపణలు చెప్పాల్సిందిగా ఆదేశించింది. దీంతో ఆయన క్షమాపణలు చెప్పారు. ఇలాంటి ఘటన సమయంలో భావప్రకటన స్వేచ్ఛ విషయంలో ప్రభుత్వం తరపున బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి.. అలా మాట్లాడడాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. సీనియర్ న్యాయవాదులు ఫాలి ఎస్ నారిమన్, హరీష్ సాల్వే రూపొందించిన కొన్ని అభ్యంతరాల దృష్ట్యా.. 2017లో ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది.
తాజావార్తలు
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
-
Oppo Reno 16 Series: ఒప్పో రెనో 16 సిరీస్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, కొత్త మ్యాగ్నెటిక్ డిస్ప్లే
-
Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!