Nita Ambani: కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించిన నీతా అంబానీ..
- కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించిన నీతా అంబానీ
- తన కొడుకు వివాహానికి ఆశీస్సుల కోసం వచ్చినట్లు తెలిపిన నీతా అంబానీ
- జూలై 12న రాధిక మర్చంట్తో అనంత్ అంబానీ వివాహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, బిలియనీర్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ సోమవారం వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించారు. తన కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల వివాహానికి ఆశీస్సులు పొందేందుకు ఆలయానికి వచ్చినట్లు ఆమె తెలిపారు. రాధిక మర్చంట్తో అనంత్ అంబానీ వివాహం జూలై 12న జరుగనుంది. ఈ సమయంలో మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమంలో భారత్తో పాటు విదేశాలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు. తన కొడుకు, కాబోయే కోడలు కోసం బాబా విశ్వనాథ్ ఆశీస్సులు కోరిన తర్వాత.. నీతా అంబానీ గంగా హారతిలో పాల్గొన్నారు.
Kishan Reddy: ఖనిజ రంగంలో ఆత్మనిర్భరత సాధిస్తాం.. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారతాం
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
దాదాపు అరగంట పాటు నీతా అంబానీ ఆలయంలోనే ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. గుడిలో తన అనుభవాన్ని పంచుకుంది. దర్శనం తర్వాత చాలా బాగుందని చెప్పారు. హిందూ మతంలో ఏదైనా శుభ కార్యం చేసే ముందు భగవంతుని ఆశీస్సులు తీసుకుంటారు. ఈ క్రమంలో.. అనంత్, రాధికల పెళ్లికి సంబంధించిన ఆహ్వాన పత్రికను కాశీ విశ్వనాథ్ ముందుంచారు. పదేళ్ల తర్వాత ఆలయాన్ని సందర్శించే అవకాశం వచ్చిందని నీతా అంబానీ తెలిపారు. ఇక్కడి మార్పు, అభివృద్ధిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆలయ కారిడార్తో పాటు నమో ఘాట్, ఫిల్లింగ్ స్టేషన్లను అద్భుతంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. పెళ్లి తర్వాత మళ్లీ అనంత్, రాధికతో కలిసి ఇక్కడకు వస్తానని నీతా అంబానీ తెలిపింది. అనంత్, రాధికల వివాహం జరిగిన తర్వాత కాశీలో తప్పకుండా ఒక ఫంక్షన్ నిర్వహించాలనుకుంటున్నాను, నేను వారితో కలిసి కాశీకి వస్తాను అని ఆమె చెప్పింది.
Ananya Nagalla : సైబర్ మోసగాళ్ల వలలో టాలీవుడ్ నటి.. చిక్కనట్టే చిక్కి..
ముకేష్, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ.. పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో వివాహం చేసుకోనున్నారు. అనంత్ అంబానీ, రాధిక పెళ్లి వేడుక మూడు రోజుల పాటు జరగనుందని సమాచారం. మీడియా కథనాల ప్రకారం.. మొదటి రోజు జూలై 12 న వివాహం జరగనుంది. అనంతరం రెండు రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!