Nita Ambani: కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించిన నీతా అంబానీ..
- కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించిన నీతా అంబానీ
- తన కొడుకు వివాహానికి ఆశీస్సుల కోసం వచ్చినట్లు తెలిపిన నీతా అంబానీ
- జూలై 12న రాధిక మర్చంట్తో అనంత్ అంబానీ వివాహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, బిలియనీర్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ సోమవారం వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించారు. తన కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల వివాహానికి ఆశీస్సులు పొందేందుకు ఆలయానికి వచ్చినట్లు ఆమె తెలిపారు. రాధిక మర్చంట్తో అనంత్ అంబానీ వివాహం జూలై 12న జరుగనుంది. ఈ సమయంలో మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమంలో భారత్తో పాటు విదేశాలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు. తన కొడుకు, కాబోయే కోడలు కోసం బాబా విశ్వనాథ్ ఆశీస్సులు కోరిన తర్వాత.. నీతా అంబానీ గంగా హారతిలో పాల్గొన్నారు.
Kishan Reddy: ఖనిజ రంగంలో ఆత్మనిర్భరత సాధిస్తాం.. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారతాం
Also Read
- IND Vs AFG: చరిత్ర స్పష్టించిన భారత్.. కొత్త రికార్డు నమోదు..
- Lakshadweep: లక్షద్వీప్లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్.. 47 ఏళ్ల నిషేధానికి తెర.. కారణం ఇదే..
- Putin: పుతిన్ భద్రతపై రష్యా సంచలన నిర్ణయం.. నిఘా వ్యవస్థలపై తాత్కాలికంగా..!
- Iran-US War: 100 రోజులు పూర్తి చేసుకున్న యుద్ధం.. హార్ముజ్ తెరుచుకోకపోతే తీవ్ర సంక్షోభమే!
దాదాపు అరగంట పాటు నీతా అంబానీ ఆలయంలోనే ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. గుడిలో తన అనుభవాన్ని పంచుకుంది. దర్శనం తర్వాత చాలా బాగుందని చెప్పారు. హిందూ మతంలో ఏదైనా శుభ కార్యం చేసే ముందు భగవంతుని ఆశీస్సులు తీసుకుంటారు. ఈ క్రమంలో.. అనంత్, రాధికల పెళ్లికి సంబంధించిన ఆహ్వాన పత్రికను కాశీ విశ్వనాథ్ ముందుంచారు. పదేళ్ల తర్వాత ఆలయాన్ని సందర్శించే అవకాశం వచ్చిందని నీతా అంబానీ తెలిపారు. ఇక్కడి మార్పు, అభివృద్ధిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆలయ కారిడార్తో పాటు నమో ఘాట్, ఫిల్లింగ్ స్టేషన్లను అద్భుతంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. పెళ్లి తర్వాత మళ్లీ అనంత్, రాధికతో కలిసి ఇక్కడకు వస్తానని నీతా అంబానీ తెలిపింది. అనంత్, రాధికల వివాహం జరిగిన తర్వాత కాశీలో తప్పకుండా ఒక ఫంక్షన్ నిర్వహించాలనుకుంటున్నాను, నేను వారితో కలిసి కాశీకి వస్తాను అని ఆమె చెప్పింది.
Ananya Nagalla : సైబర్ మోసగాళ్ల వలలో టాలీవుడ్ నటి.. చిక్కనట్టే చిక్కి..
ముకేష్, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ.. పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో వివాహం చేసుకోనున్నారు. అనంత్ అంబానీ, రాధిక పెళ్లి వేడుక మూడు రోజుల పాటు జరగనుందని సమాచారం. మీడియా కథనాల ప్రకారం.. మొదటి రోజు జూలై 12 న వివాహం జరగనుంది. అనంతరం రెండు రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తాజావార్తలు
-
IND Vs AFG: చరిత్ర స్పష్టించిన భారత్.. కొత్త రికార్డు నమోదు..
-
Lakshadweep: లక్షద్వీప్లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్.. 47 ఏళ్ల నిషేధానికి తెర.. కారణం ఇదే..
-
Iran Vs Israel: యుద్ధం మళ్లీ మొదలు..! ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల వెనుక ఉన్న కారణాలేంటి?
-
Gym Tips : వర్కౌట్ మధ్యలో కోల్డ్ వాటర్.. మంచిదా? ప్రమాదమా.?
-
Putin: పుతిన్ భద్రతపై రష్యా సంచలన నిర్ణయం.. నిఘా వ్యవస్థలపై తాత్కాలికంగా..!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!